Breaking News

Daily Archives: August 2, 2024

ఏపీలో పౌర విమానయాన అభివృద్ధికి సహకరించాలి… : డూండీ రాకేష్‌

-గన్నవరం నుంచి విమాన సర్వీసులు పెంచండి -కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుకు టీడీపీ నేత డూండీ రాకేష్‌ వినతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశ, విదేశీ విమాన సర్వీసులు పెంచాలని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్‌ నాయుడుకు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్‌ విజ్ఞ ప్తి చేశారు. శుక్రవారం ఢల్లీిలో కేంద్రమంత్రిని కలిసిన ఆయన ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు. ఏపీలో పౌర విమానయాన అభివృద్ధికి …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

గడిచిన 50 రోజుల్లో 10వేలకు కు పైగా గ్రీవెన్స్ కు అర్జీలు

-పారదర్శకంగా అర్జీల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక -సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి అర్జీదారులందరికి న్యాయం జరిగేలా చర్యలు -మంత్రి గొట్టిపాటి రవికుమార్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : వస్తున్న అర్జీదారులకు ఇస్తున్న వినతులకు న్యాయం జరిగేలా… ప్రత్యేక చర్యలు చేపడతున్నామని.. దాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి.. ప్రతి అర్జీని పారదర్శకంగా పరిశీలించి.. గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్, టీడీపీ రాష్ట్ర …

Read More »

2029 ఎన్నికలు లక్ష్యంగా పని చేయండి…

-ఎన్ఆర్ఐ టీడీపీ ప్రతినిధులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయానికి కీలకంగా పని చేసిన ఎన్ ఆర్ ఐ టీడీపీ ప్రతినిధులు ఇక నుండి 2029 ఎన్నికలు లక్ష్యంగా పని చేయాలని రాష్ర్ట రెవిన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. శుక్రవారం సచివాలయంలో తనను కలిసిన ఎన్ ఆర్ ఐ టీడీపీ ప్రతినిధులతో ఆయన కాసేపు మాట్లాడారు. తమ బృందం ఎన్ ఆర్ ఐ టెక్ బ్రెయిన్స్ …

Read More »

2025 జూన్ నాటికి రామాయపట్నం పోర్టు పూర్తికి చర్యలు

-పోర్టు పనులపై ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లతో ఉమ్మడి సమీక్ష -అలసత్వం వహిస్తే సహించేది లేదని కాంట్రాక్టర్లకు మంత్రి బీసీ హెచ్చరిక -ప్రతినెల రివ్యూ…ఫలితం కనిపించాలని అధికారులు, కాంట్రాక్టర్లకు మంత్రి ఆదేశాలు రామాయపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని ప్రారంభ సమయంలో అనుకున్న విధంగా 2025 జూన్ నాటికి పూర్తిచేసేలా సంబంధిత అధికారులకు రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం పనులను మంత్రి శుక్రవారం …

Read More »

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై మాదిగ సంఘాల జేఏసీ హర్షం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విజయోత్సవ సంబరాల కార్యక్రమంలో భాగంగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై మాదిగ జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గాంధీనగర్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నేత కాండ్రు సుధాకర్‌ మాట్లాడుతూ జయహో ఎస్సీ రిజర్వేషన్స్‌ వర్గీకరణ అని అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ మూడు దశబ్దాలుగా పోరాటం సాగిందన్నారు. ఎస్సీలో ఒక సామాజికవర్గమే ఫలాలు పొందుతుందని దీంతో మిగతా మాదిగ, మాదిగ ఉప కులాలు అన్యాయానికి గురవుతున్నారన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు …

Read More »

BEE advisor calls for communication strategy on energy efficiency activities

Vijayawada, Neti Patrika Prajavartha : Bureau of Energy Efficiency (BEE) Regional Media Advisor (South) A. Chandrasekhara Reddy appreciated the Andhra Pradesh State Energy Conservation Mission (AP-SECM) for its proactive role in implementing and promoting energy efficiency (EE) programmes in the State. He emphasised the need for adopting a media action plan for spreading awareness on EE and energy conservation activities, …

Read More »

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ విధానంలో సమూల మార్పులు తేవాలి

-పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల సమన్వయం ద్వారా అందుబాటులో నిత్యావసర వస్తువులు -సివిల్ సప్లై శాఖపై సమీక్షలో సిఎం నారా చంద్రబాబు నాయుడు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఫౌర సరఫరాల శాఖపై సిఎం నారా చంద్రబాబు నాయడు సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ విధానం, రేషన్ బియ్యం సరఫరా, డోర్ డెలివరీ విధానం పనితీరు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ వంటి అంశాలపై అధికారులతో సచివాలయంలో శుక్రవారం సమీక్షించారు. గత ప్రభుత్వం ధాన్యం సేకరణ విధానాన్ని అస్తవ్యస్తం చేసి రైతులను తీవ్ర …

Read More »

ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వ అక్రమాలపై సీఐడీ విచారణ

-ప్రజలు ప్రాణాలు తీసే నాణ్యత లేని మద్యం రాష్ట్రంలో కనిపించడానికి వీలు లేదు -మద్యం రేట్లు విచ్చలవిడిగా పెంచి పేద వాడిని దోచుకున్న గత ప్రభుత్వ విధానానికి స్వస్తి -సమగ్ర అధ్యయనం తర్వాత కొత్త ఎక్సైజ్ పాలసీ :- సీఎం చంద్రబాబు నాయుడు -ఎక్సైజ్ శాఖపై సీఎం సమీక్ష అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సీఐడీతో దర్యాప్తు జరిపిస్తామని సీఎం చంద్రబాబు నాయడు మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్నకారణంగా గత …

Read More »

2015లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారమే సీఆర్డీయే పరిధి : సీఎం నారా చంద్రబాబు నాయుడు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : 2015లో ఇచ్చిన జీవో నెంబర్ 207 ప్రకారం 8,352 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే సీఆర్డీయే ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంలో గుర్తించిన విస్తీర్ణం ప్రకారమే సీఆర్డీఏ పరిధి కొనసాగుతుందని పేర్కొన్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 36వ అథారిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో 12 అంశాలపై సీఎం చర్చించారు. గతంలో 130 సంస్థలకు జరిగిన భూ కేటాయింపులు, వాటి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. గతంలో ల్యాండ్ …

Read More »