Breaking News

Daily Archives: August 6, 2024

అక్రమంగా ఇసుక రవాణా జరక్కుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎక్కడ కూడా అక్రమంగా ఇసుక రవాణా జరక్కుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక అక్రమంగా రవాణా కాకుండా నిరోధించాలన్నారు. ఇసుక రీచ్ లలో గట్టిగా నిఘా ఉంచి ఇసుక అక్రమంగా రవాణా కాకుండా …

Read More »

నగరాభివృద్ధిలో కాంట్రాక్టర్ల పాత్ర కీలకం

-కాంట్రాక్ట్టర్లతో సమావేశం నిర్వహించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : నగరాభివృద్ధిలో కాంట్రాక్టర్ల పాత్ర ఎంతో కీలకమైనదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్లో నిర్వహించిన కాంట్రాక్టర్లతో సమావేశం లో అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతిరోడ్లో, విజయవాడ అభివృద్ధి పనుల్లో వారి సహకారం, భాగస్వామ్యం, బాధ్యత, కనబడుతుందని. ఏ పని చేసినా నాణ్యత ప్రమాణాలతో చేయాలని. …

Read More »

బిజెపి కార్యాలయానికి డాక్టర్ తరుణ్ కాకాని ఎయిర్ కండీషనర్‌ విరాళం

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అభ్యర్థన మేరకు ఆంధ్ర ప్రదేశ్ బిజెపి రాష్ట్ర నాయకుడు డాక్టర్ తరుణ్ కాకాని మంగళవారం పార్టీ కార్యాలయానికి ఎయిర్ కండీషనర్‌ను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ, డాక్టర్ తరుణ్ పార్టీకి చురుగ్గా సేవలందిస్తున్నారని, ప్రజాసేవలో ఎంతో మక్కువతో నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. పార్టీ కార్యాలయానికి విరాళం అందించినందుకు డాక్టర్ తరుణ్‌కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ డీటీ కోశాధికారి అవ్వారు శ్రీనివాసరావు, …

Read More »

ఏపీలో విద్యాహక్కు చట్టం అమలు బాగుంది…

-ప్రశంసించిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో సోమవారం జరిగిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలుతీరును జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రశంసించిందని ఏపీ విద్యాహక్కు చట్టం నోడల్ అధికారి డి.మధుసూదనరావు తెలిపారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తరఫున విద్యాహక్కు చట్టం నోడల్ అధికారి డి మధుసూదన రావు పాల్గొని ఆంధ్రప్రదేశ్ లో విద్యాహక్కు చట్టం అమలు తీరు తెన్నులను, …

Read More »

రెండు డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్థానాలకు, ఐదు సహాయ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్థానాలకు దరఖాస్తులు ఆహ్వానం

-చివరి తేది ఆగస్టు 9 సా.5.00 వరకూ -డి పి జే గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్ సవరించిన పథకం, 2022 ప్రకారం స్థాపించబడిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ కార్యాలయం, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం నందు రెండు డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్థానాలు , ఐదు అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్థానాల ను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డి ఎల్ ఎస్ …

Read More »

ఉచిత మెగా మెడికల్ క్యాంపు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ వైద్య సేవ కింద బీమా పద్ధతిలో 25 లక్షల వరకు వైద్యం అందించే పాలసీ త్వరలో ముఖ్యమంత్రి ప్రకటించనున్నారని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. స్థానిక పోతేపల్లి జ్యువెలరీ పార్కులో బిగ్ టీవీ, మానవత స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును మంత్రి వైద్యుల బృందంతో కలిసి ప్రారంభించారు. వైద్య సేవలు పొందిన రోగులకు మంత్రి మందులు అందజేశారు. ఈ సందర్భంగా …

Read More »