Breaking News

Daily Archives: August 12, 2024

మంత్రి సత్యకుమార్ యాదవ్ ని కలిసిన డా. వేముల భాను ప్రకాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ది మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్, రాష్ట్ర అధ్యక్షులు డా. వేముల భాను ప్రకాష్ సోమవారం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖా మాత్యులు సత్యకుమార్ యాదవ్ ని సెక్రటేరియట్ లో ఆయన ఛాంబర్ లో కలిసి కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం లో ఆయుష్ చికిత్సలు చేర్పించాలని, అందుకురాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ప్రపోజల్స్ కేంద్రప్రభుత్వం కి పంపించేటట్లు సహకరించాలని కోరారు. ఈ విషయం పై మంత్రి స్పందిస్తూ కేంద్రప్రభుత్వం ఆయుష్ అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి …

Read More »

దేశంలో టాప్ 5 రాష్ట్రాలతో పోటీపడేలా కొత్త పారిశ్రామికాభివృద్ధి విధానం ఉండాలి

-పాలసీ రూపకల్పనలో నీతి ఆయోగ్ ఆలోచనలను పరిగణనలోకి తీసుకోవాలి -15శాతం ఓవర్ ఆల్ గ్రోత్ రేట్ సాధన లక్ష్యంగా నూతన పాలసీని తయారు చేయాలి -పరిశ్రమల స్థాపనలో ఎపి కి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను తిరిగి తీసుకురావాలి -100 రోజుల్లోగా పారిశ్రామికాభివృద్ధికి చెందిన ముఖ్య పాలసీలు తీసుకురావాలి -ఈనెల 16న పారిశ్రామిక వేత్తలతో సమావేశం -పారిశ్రామికాభివృద్ధి విధానం 2024-29పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి దేశంలో టాప్-5 రాష్ట్రాలతో పోటీ పడే విధంగా …

Read More »

సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల భేటీ

-రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు భేటీ అయ్యారు. సచివాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, సీఆర్డీయే కమిషనర్ కాటంనేని భాస్కర్ తో కలిసి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడుతో సోమవారం బ్యాంక్ ప్రతినిధులు భేటీ అయ్యారు. నలుగురు సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం గత రెండు రోజులుగా అమరావతిలో పర్యటిస్తోంది. ఈ బృందంలో వరల్డ్ బ్యాంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ …

Read More »

స్కూల్ వ్యాన్ ల ఫిట్ నెస్ పరీక్షలకు సీఎం చంద్రబాబు ఆదేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లె హైవే క్రాస్ సమీపంలో స్కూల్ వ్యాను బోల్తాపడిన ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ప్రమాదంలో భవిష్య అనే చిన్నారి మృతి చెందడంపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై రవాణా శాఖ అధికారులు డ్రైవ్ నిర్వహించాలని, ఫిట్ నెస్ లేకుండా స్కూల్ బస్సులు నడుపుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Read More »

రాష్ట్రంలోని స‌హ‌జ వ‌న‌రుల్ని కాపాడుకుంటాం

-గ‌త ఐదేళ్ల పాల‌నలో స‌హ‌జ వ‌న‌రుల్ని దోచుకున్నారు -శాస్త్ర సాంకేతికంగా మైనింగ్ శాఖను ప‌టిష్ట ప‌రిచేలా చ‌ర్య‌లు తీసుకుంటాం -నేష‌న‌ల్ మిన‌లర‌ల్ ఎక్స్ ప్లోరేష‌న్ ట్ర‌స్ట్ 6వ స‌మావేశంలో మంత్రి కొల్లు ర‌వీంద్ర‌ న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అంతులేని స‌హ‌జ వ‌న‌రులున్నాయ‌ని, వాటిని రాష్ట్ర అబ్యున్నతికి వినియొగిస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు & ఎక్ష్సెజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఢిల్లీలో కేంద్ర గనులు, బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి, అనుశాఖ సహాయమంత్రి డా.జితేంద్ర …

Read More »

ఆర్జీలను అధికారులు భాధ్యతతో పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఇస్తున్న ఆర్జీలను అధికారులు భాధ్యతతో పరిష్కరించాలని, విభాగాధిపతులు పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న ఆర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని గుంటూరు నగర కమిషనర్ (ఎఫ్ఏసి) ఎస్.హరికృష్ణ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు తీసుకొని అధికారులతో మాట్లాడుతూ నగర ప్రజలు తమ స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో అందించే …

Read More »

పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “77” ఫిర్యాదులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాసమస్యల సత్వర పరిష్కారం కోసం “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి 13.00 గంటల వరకు ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపధ్యంలో సోమవారం పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో ఎన్.టీ.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.యస్ ఆదేశాలు మేరకు అడ్మిన్ డి.సి.పి.ఎం.కృష్ణమూర్తి నాయుడు  “ప్రజా సమస్యల పరిష్కార వేదిక”( పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం) …

Read More »

ధాన్యం అమ్మిన 48 గంటల్లో రైతు ఖాతాకు సొమ్ము

-రైతు సహాయక కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు -రైతులకు 50 శాతం సబ్సిడీతో టార్పాలిన్ల సరఫరా -ప్రతి కౌలు రైతుకూ గుర్తింపు కార్డు -కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి.. ప్రతి అడుగులో రైతుకి పెద్దపీట వేస్తాం -అన్నదాతకు ఎలాంటి కష్టం లేకుండా అండగా నిలబడతాం -గత ప్రభుత్వం రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది -గత పాలకులు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రూ.1674 కోట్లు బకాయిపెట్టేశారు -పౌరసరఫరాల శాఖనూ అప్పుల్లో ముంచేసింది -రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆ బకాయిలు చెల్లించింది -చంద్రబాబు నాయుడు, పవన్ …

Read More »

సుజనా ఫౌండేషన్ ద్వారా ట్రై సైకిల్ బహుకరణ

విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త : 42వ డివిజన్ ప్రియదర్శిని కాలనీకి చెందిన పావని అనే వికలాంగురాలికి సుజనా ఫౌండేషన్ ద్వారా సోమవారం ట్రై సైకిల్ అందజేసారు. పావని పుట్టుకతోనే వైకల్యంతో ఉందని నడవలేని పరిస్థితుల్లో ఉండటంతో ఎన్డీయే కార్యాలయాన్ని సంప్రదించి సాయం చేయాలని కొరగా ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, సుజన ఫౌండేషన్ కోఆర్డినేటర్ వీరమాచినేని కిరణ్, పదివేల విలువ గల ట్రై సైకిల్ బహుకరించారు. సుజనా ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది వికలాంగులకు చేయూతని …

Read More »

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన 16 విన్నతులు

విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఈ సోమవారం ఉదయం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుండి అందిన ఫిర్యాదులకు, శాఖాధిపతులు ఆ సమస్య ఉన్న ప్రదేశానికి స్వయంగా విచ్చేసి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ప్రజలకు సంతృప్తికరమైన పరిష్కారాన్ని ఇస్తున్నారని, ఒకవేళ ఆ సమస్య విభిన్న శాఖల సంబంధించిన అయినప్పటికీ శఖాధిపతుల సమన్వయంతో …

Read More »