Breaking News

Daily Archives: August 15, 2024

జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య తెలుగుజాతికి గర్వకారణం : ఎంపి కేశినేని శివ‌నాథ్

-బాపు మ్యూజియం లో పంద్రాగ‌ష్టు వేడుక‌లు -జాతీయ ప‌తాకం ఎగర‌వేసిన ఎంపి -పింగ‌ళి వెంక‌య్య‌, గాంధీ విగ్ర‌హాల‌కు నివాళి -ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కమిషనర్ స‌మ‌క్షంలో మ్యూజియం సంద‌ర్శ‌న విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : భార‌త దేశానికి స్వాతంత్య్ర వ‌చ్చిన నాటి నుంచి దేశ ప్ర‌జ‌లంద‌రూ గ‌ర్వ‌ప‌డేలా జాతీయ ప‌తాకాన్ని రూప‌శిల్పి పింగ‌ళి వెంక‌య్య ఉమ్మ‌డి కృష్ణ జిల్లా వాసి కావ‌టం తెలుగువారంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం. పింగ‌ళి వెంక‌య్య రూపొందించిన త్రివ‌ర్ణ ప‌తాకం భార‌త‌దేశానికి ఒక ప్ర‌తీక‌గా నిలిచింద‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. …

Read More »

దేశ ప్రజలకు 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు… : మోటూరి శంకరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ ప్రజలకు ఏపీ స్టేట్ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌ అధ్యక్షులు మోటూరి శంకరరావు 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం తమ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌లు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బ్రిటీష్ దాస్య శృంఖలాలను తెంచి, స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఈరోజు మనందరికీ పర్వదినమన్నారు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్ళతో పెకళించి వేసేందుకు ఆనాడు ఎందరో త్యాగమూర్తులు తమ ప్రాణాలను అర్పించారని గుర్తుచేశారు. “స్వరాజ్యమే నా …

Read More »

ఎపి హైకోర్టులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

-జాతీయ జెండాను అవిష్కరించిన చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రాజధాని అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం జరిగిన ఈవేడుకలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ముఖ్య అతిధిగా పాల్గొని మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా జస్టిస్ ఠాకూర్ మాట్లాడుతూ స్వరాజ్యం, స్వపరిపాలన భారతీయుల జన్మహక్కు అంటూ నినాదాలు చేస్తూ స్వాతంత్య్ర సాధనకై ఎంతో మంది తమ ప్రాణాలను …

Read More »

స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం కోసం ప్రత్యేక ప్రార్థనలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగం చేయబట్టి భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని పాస్టర్ రెవ. డాక్టర్. డేవిడ్ బ్రెన్ హం అన్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ రోకళ్ళ పాలెం వద్ద ఉన్న హోలీ క్రాస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో భారత దేశ రక్షణ కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవ సోదరీ సోదరీమణులు పెద్ద ఎత్తున చేరుకొని ఉపవాస ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ డేవిడ్ బ్రెన్ హం మాట్లాడుతూ, దేశ రక్షణ కోసం ప్రాణ …

Read More »

ప్రజల రేపటి ఆకాంక్షలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం…

ఏలూరు,  నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల రేపటి ఆకాంక్షలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక విన్నూత్న కార్యక్రమాలను శ్రీకారం చుట్టిందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర సముపార్జన కోసం సర్వస్వము త్యాగం చేసిన …

Read More »

హెచ్ఆర్సీ ప్రాంగణంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ…

కర్నూల్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయ ప్రాంగణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషన్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని కమిషన్ ఇంచార్జ్ కార్యదర్శి మరియు ముఖ్య కార్యనిర్వహణ అధికారి అయిన పి హనుమంత రెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ గావించారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సందర్భంగా వారి సందేశాన్ని అందిస్తూ ఎందరో త్యాగదనుల కృషి ఫలితంగానే ఈ స్వాతంత్రం మనకు లభించిందని ప్రతి ఒక్కరు …

Read More »

ఉభయ సభల్లో ప్రజా సమస్యలపై ఫలవంతమైన చర్చలు జరగాలి : స్పీకర్ అయ్యన్న పాత్రుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉభయ సభల్లో ప్రజా సమస్యలపై అర్ధవంతమైన మరియు ఫలవంతమైన చర్చలు జరగాలని అప్పుడే ప్రజాస్వామ్య స్పూర్తికి నిలువెత్తు నిదర్శనాలైన చట్ట సభలకు మరింత గౌరవం పెరుగుతుందని రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్ర శాసన సభ వద్ద జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించిన పిదన మువ్వన్నెల జాతీయ పతాకావిష్కరణ …

Read More »

అభివృద్ధి సంక్షేమ పధకాలు పేదలకు పూర్తిగా అందినప్పుడే సమ సమాజ స్థాపన సాధ్యం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలోని పేదరిక నిర్మూలకు ప్రభుత్వాలు అమలు చేసే అభివృద్ధి సంక్షేమ పధకాలు పూర్తిగా క్షేత్ర స్థాయిలోని పేదలందరికీ అందినపుడే సమ సమాజ స్థాపనకు అవకాశం కులుగుందని రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు అన్నారు. 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గురువారం రాష్ట్ర అసెంబ్లీ భవనం వద్ద జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు …

Read More »

వికసిత్ ఆంధ్రప్రదేశ్-2047 ప్రణాళిక రూపకల్పనలో ప్రజలంతా భాగస్వాములు కావాలి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వికసిత్ భారత్-2047లో భాగంగా వికిసిత్ ఆంధ్రప్రదేశ్-2047 ప్రణాళిక రూపకల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని దీనిలో ప్రజలందరూ భగస్వాములై వారి సూచనలు,సలహాలను అందించాలని రాష్ట్ర వ్యవసాయ,సహకార శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ పిలుపునిచ్చారు.78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్క రించుకుని గురువారం రాష్ట్ర సచివాలయం మొదటి భవనం వద్ద జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించిన తదుపరి మువ్వన్నెల …

Read More »

మ‌హ‌నీయుల త్యాగాల స్ఫూర్తిగా బంగారు భ‌విత నిర్మాణానికి కృషిచేద్దాం

-78వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మ‌నకు స్వేచ్ఛా స్వాతంత్య్రాల‌ను ప్ర‌సాదించిన మ‌హ‌నీయుల త్యాగాల స్ఫూర్తిగా బంగారు భ‌విత నిర్మాణానికి, జిల్లా ప్ర‌గ‌తికి ఐక్య‌తతో స‌మ‌ష్టిగా కృషిచేద్దామంటూ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న పిలుపునిచ్చారు. గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను పురస్కరించుకొని విజ‌య‌వాడ పోలీస్ ప‌రేడ్ మైదానంలో నిర్వ‌హించిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ సృజ‌న‌.. జాయింట్ క‌లెక్ట‌ర్ డా. నిధిమీనా, అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ శుభం నోఖ్వాల్‌, డీఆర్‌వో …

Read More »