Breaking News

Daily Archives: August 19, 2024

మంకీపాక్స్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తున్న మంకీ పాక్స్‌పై ప్రపంచ ‌ఆరోగ్య సంస్థ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి, వారికి వైద్యం అందిచడానికి ఐసోలేషన్‌ వార్డులు సిద్ధం చేయాలని అధికారులకు ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అలాగే దిల్లీలో మూడు నోడల్‌ ఆస్పత్రులను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే అనుమానితులకు RT-PCR వ్యాధి నిర్థరణ పరీక్ష చేయాలని మంత్రిత్వశాఖ ఆదేశించింది. ఆఫ్రికాలో …

Read More »

అన్నా క్యాంటీన్ కు శిష్ట్లా లోషిత్ రూ.కోటి విరాళం

-పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం అభినందనీయం: లోకేష్ -చంద్రబాబు, లోకేష్ ల స్పూర్తితోనే సేవా కార్యక్రమాలు: లోహిత్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపడుతున్న కార్యక్రమాలతో ప్రేరణ పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టిడిపి కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోషిత్ అన్న క్యాంటీన్ల నిర్వహణకు కోటి రూపాయలు విరాళం అందజేశారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ కు ఈ మేరకు రూ. కోటి చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి …

Read More »

జగనన్న భూ సర్వే పెద్ద భోగస్ సర్వే

-గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీలన్నీ భూ సమస్యలపైనే -మా ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉండవు -తప్పు చేసిన వారిని వదిలి పెట్టం -భూ సమస్యల పరిష్కారంకు త్వరలో గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు -మంత్రి అచ్చెన్నాయుడు, కభంపాటి రామ్మోహన్ రావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా వినతుల స్వీకరణలో భాగంగా నేడు మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయు, టీడీపీ నేతలు కంభంపాటి రామ్మోన్ రావు, డాక్టర్ శివ ప్రసాద్ లు ప్రజల నుండి …

Read More »

ఐపిఎంలో పోస్టుల భ‌ర్తీకి చ‌ర్య‌లు

-డిసెంబ‌రుక‌ల్లా వైజాగ్ ల్యాబ్‌ను అందుబాటులోకి తేవాలి -ఫుడ్ సేఫ్టీ క‌మీష‌న‌ర్ సి.హ‌రికిర‌ణ్‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఐపిఎంలో ఖాళీగా ఉన్న పోస్టుల్ని త్వ‌ర‌లో భ‌ర్తీ చేసి దీన్ని గాడిలో పెడ‌తామ‌ని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మ‌రియు ఫుడ్ సేఫ్టీ క‌మీష‌న‌ర్ సి.హ‌రికిర‌ణ్ అన్నారు. కొత్తగా ఆహార వ్యాపారాల కోసం రిజిస్ట‌ర్ చేసుకునే వారికి వీలైనంత త్వ‌ర‌గా లైసెన్స్‌లు ఇవ్వ‌గ‌లిగితే త‌ద్వారా ప్ర‌భుత్వానికి ఆదాయం స‌మ‌కూరుతుంద‌ని సూచించారు. మంగ‌ళ‌గిరి ఎపిఐఐసి ట‌వ‌ర్స్‌లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాల‌యంలో సోమ‌వారం ఇన్సిట్యిట్యూట్ …

Read More »

నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టును పరిశీలించిన సీఎం

-వైసీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్టులు -సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం కాదు…నిర్వహణకూ డబ్బులు ఖర్చు చేయలేదు -రూ.5.40 కోట్లతో సోమశిల ప్రాజెక్టుకు తక్షణ మరమ్మతులు -రాష్ట్రంలో ప్రాజెక్టుల మరమ్మతులకు రూ.300 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా -సర్వేరాళ్లపై బొమ్మలకు, రిషికొండ ప్యాలెస్ కు కోట్లు ఖర్చు పెట్టిన గత ప్రభుత్వం…కీలకమైన సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది -అనకాపల్లిలో విద్యార్థుల మృతికి కారణమైన సంస్థను మూసేస్తాం…కారకులపై చర్యలు తీసుకుంటాం -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మకూరు/సోమశిల, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు

-ఒకే రోజున 13,326 పంచాయతీల్లో నిర్వహణ -గ్రామాల్లో చేపట్టాల్సిన ఉపాధి హామీ పనులపై గ్రామ సభల్లో చర్చించి ఆమోదం -గత ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసింది -కలసికట్టుగా పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలం -గ్రామ సభల్లో ప్రజలందరూ పాల్గొనేలా చూడాలి -గ్రామ స్వరాజ్యం సాధించాలంటే అధికారుల సహాయ, సహకారాలు అవసరం -గ్రామ సభల నిర్వహణపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘గ్రామ పంచాయతీల నుంచి …

Read More »

కలుషిత ఆహారంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ఉన్నత స్ధాయి విచారణకు ముఖ్యమంత్రి ఆదేశం

-విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ తో మాట్లాడిన సీఎం -బాధిత విద్యార్థుల కుటుంబసభ్యులు, సంరక్షులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనకాపల్లి జిల్లా, కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. బాధిత విద్యార్థుల కుటుంబసభ్యులు, సంరక్షులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అనాథాశ్రమంలో కలుషిత ఆహారంతో విద్యార్థులు అస్వస్థకు గురైన ఘటనలో …

Read More »

వెనుకబడిన వర్గాలకు విద్య, వైద్యం, ఆరోగ్యం అందించడంలో సాంఘిక సంక్షేమ శాఖ పనితీరు కీలకం

-గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి -ఉపాధ్యాయులు విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలి, విద్యార్థులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి -త్వరలో ఎస్సీ విద్యార్థులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ -సెప్టెంబర్ మొదటివారం నుంచి అన్ని జిల్లాల్లో పర్యటిస్తా -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వెనుకబడిన వర్గాలకు విద్య, వైద్యం, ఆరోగ్యం అందించడంలో సాంఘిక సంక్షేమ శాఖ పనితీరు కీలకమని ఉద్యోగులు బాధ్యతతో పనిచేసి మెరుగైన ఫలితాలు సాధించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి …

Read More »

మంత్రి సవితమ్మ జోక్యంతో రహదారి కష్టాలు మాయం

-ఆనందంలో మహదేవపల్లి గ్రామస్తులు పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత జోక్యంతో మహదేవపల్లి గ్రామస్తుల రహదారి కష్టాలు తీరాయి. స్థానిక రైల్వే బ్రిడ్జి అండర్ పాస్ వద్ద శిథిలమైన రహదారిని మరమ్మతులు చేసి, తాత్కాలిక రహదారిని ఆర్ అండ్ బి అధికారులు నిర్మించారు. దీంతో స్థానికులు ఆనందం వ్యక్తమవుతోంది. మంత్రి సవితమ్మ చొరవ వల్లే రహదారి కష్టాలు తీరాయని గ్రామస్తులు సంతోషం వక్తంచేస్తున్నారు. రొద్దం మండల కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తను …

Read More »

స్వయం ఉత్పత్తి వ్యాపార కేంద్రాలుగా యస్ హెచ్ జి లు.

-యస్ హెచ్ జిల ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తికి ప్రణాళికల సిద్ధం చేస్తున్న ప్రభుత్వం -చెత్త నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేయాలని ఆలోచిస్తున్న ప్రభుత్వం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రములోని స్వయం సహాయక సంఘాలను స్వయం ఉత్పత్తి, వ్యాపార కేంద్రాలుగా మార్చే దిశగా ఆలోచిస్తుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన మరియు చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖల సమన్వయంతో ముందు సాగే విధంగా చర్యలు చేపట్టనున్నారు. ఈ అంశాలపై ఈరోజు సెర్ప్ సీఈవో వీర పాండ్యన్, మరియు ఎం ఎస్ …

Read More »