Breaking News

Monthly Archives: August 2024

అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆదేశాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అల్లూరి జిల్లా డంబ్రిగూడ మండలం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు జిల్లా అధికారులతో మాట్లాడారు. అనారోగ్యంతో అరకులోయ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై జిల్లా అధికారులతో మాట్లాడారు. వారిని అప్రమత్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

Read More »

తెలుగు భాషోద్యమవేత్త వెంకయ్య నాయుడు

-కలమళ్ల గ్రామాన్ని ఆయన సందర్శించడం మహాభాగ్యం -ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి -తెలుగు భాషా పండితులు, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషకు స్ఫూర్తిదాయకమైన వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుండ్ల మండలం కలమళ్ల గ్రామాన్ని తెలుగు భాషోద్యమవేత్త, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సందర్శించడంతో మహా ప్రాచుర్యంలోకి వచ్చినట్లయిందని తెలుగు భాషా పండితులు, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు అన్నారు. క్రీ.శ.575లోనే రేనాటి చోళరాజ వంశానికి చెందిన …

Read More »

2 అక్టోబర్ 2024 నాటికి ఐదేళ్ల సర్వీస్ పూర్తి అవుతున్నందున అందరికీ సాధారణ బదిలీలకు అవకాశం కల్పించి అత్యంత పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీల విధానం ప్రకారం బదిలీలు కల్పించాలి

-గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అంతర్ జిల్లా బదిలీలు కల్పించి, వ్యవసాయ అనుబంధ విభాగాల ఉద్యోగులకు మరియు ఎ.యన్.యం లకు సైతం బదిలీలకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి : ఎం.డి.జాని పాషా రాష్ట్ర అధ్యక్షుడు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అంతర్ జిల్లా బదిలీలు కల్పించాలని,బదిలీల నుండి మినహాయించిన వ్యవసాయ అనుబంధ విభాగాల సచివాలయ ఉద్యోగులైన అగ్రికల్చర్ అసిస్టెంట్లు,హార్టీ కల్చర్ అసిస్టెంట్లు సెరీ కల్చర్ అసిస్టెంట్లు,యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్లు,ఫిషరీస్ …

Read More »

రాజ్యాంగబద్ధంగా పాలకులు పరిపాలన చేయాలి… : ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయ కక్ష లకు అతీతంగా పాలకులు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు నేటి గాంధీ ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ కోరారు. శుక్రవారం ఊర్మిళా నగర్ లోని గాంధీ ట్రస్ట్ కార్యాలయంలో ఆయన కళ్ళకు గంతలతో నిరాహార దీక్ష చేశా రు. ఈ సందర్భంగా గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ మహాత్మా గాంధీని గాడ్సే హత్య చేసిన జనవరి 30వ తేదీని జ్ఞాపకం చేస్తూ ప్రతినెలా 30వ తేదిన తాను కళ్ళకు …

Read More »

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనపై కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడిన సిఎం

-ఉదయం నుంచి జరిగిన విచారణపై వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి -తప్పు జరిగిందని తేలితే అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా గడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో రహస్య కెమెరాలు పెట్టారనే అంశంపై జరుగుతున్న విచారణను సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉదయం ఘటన విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులను, మంత్రి కొల్లు రవీంద్రను, జిల్లా ఎమ్మెల్యేలను కళాశాలకు వెళ్ళాలని ఆదేశించిన ముఖ్యమంత్రి…..ఉదయం నుంచి అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. …

Read More »

జస్టిస్ బి.శ్యామ్ సుందర్ సేవలను కొనియాడిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ బి.శ్యామ్ సుందర్ ఎన్నో సమగ్రమైన(కాంప్రెహెన్సివ్)కేసులను పరిష్కరించారని ఆయన అందించిన సేవలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జిస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రత్యేకంగా కొనియాడారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ శ్యామ్ సుందర్ ఆదివారం పదవీ విరమణ చేయనున్న సందర్భంగా శుక్రవారం హైకోర్టు మొదటి కోర్టుహాల్లో పుల్ కోర్టు ఆధ్వర్యంలో వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ …

Read More »

హరితాంధ్రప్రదేశ్ కోసం అడుగేద్దాం….పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృష్టి చేద్దాం

-రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం వస్తే అదే నిజమైన స్వర్ణాంధ్రప్రదేశ్ -మొక్క లేకపోతే మానవ మనుగడే లేదు…చెట్టు లేకపోతే జీవరాశుల చరిత్రే ఉండదు -175 నియోజకవర్గాల్లో నగర వనాల ఏర్పాటు…నీటి వనరులు, సహజ వనరుల పరిరక్షణ -ప్రకృతి ప్రజల ఆస్తి….దాన్ని అందరం కాపాడుకోవాలి -ప్రతి ఒక్కరూ ఏడాదికి రెండు మొక్కలు అయినా నాటాలి…చెట్లను పెంచాలి -ఎర్రచందనం స్మగ్లర్లకు హెచ్చరిక… అడవిలో కాలు పెడితే సంగతి తేలుస్తాం -పచ్చదనం, చల్లదనం కోరుకుంటూ…మొక్కలు పెంచకపోతే ఎలా? -వన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, …

Read More »

రాష్ట్రంలో మియావకీ విధానంలో వనాల అభివృద్ధి

-తక్కువ విస్తీర్ణంలో తక్కువ ఖర్చుతో పచ్చదనం పెంపు -మొక్కలను పెంచడం, సంరక్షించడం అలవాటుగా తీసుకోవాలి -రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపే బాధ్యతను తీసుకుందాం -గత ప్రభుత్వ హయాంలో రూ.19 వేల కోట్ల ఎర్రచందనం, సహజ వనరలు దోపిడీ -మేం పచ్చదనం పెంపునకు ప్రాధాన్యం ఇస్తాం -శుక్రవారం మంగళగిరిలో జరిగిన వనమహోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రాబాబునాయుడి తో కలిసి పాల్గొని, ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘అరణ్య కాండమ్ చదివితే మొక్కలు, చెట్ల విశిష్టత తెలుస్తుంది. …

Read More »

ప్రతీ ఒక్కరూ తమ తల్లితండ్రుల పేరుమీద మొక్కలు నాటాలి

-నాటిన మొక్కలు వృక్షాలు అయ్యేవరకు తల్లితండ్రుల్లా సంరక్షించాలి -నూజివీడులో మినీ జూ, ఎకో టూరిజం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం -రాష్ట్ర గృహ నిర్మాణ,సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు /ఏలూరు,  నేటి పత్రిక ప్రజావార్త : ప్రతీ ఒక్కరూ తమ తల్లితండ్రుల పేరుమీద రెండు మొక్కలు నాటాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా నూజివీడు మండలం బత్తులవారిగూడెం లోని నగరవనం లో శుక్రవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, …

Read More »

దేవాలయాల ఖ్యాతిని ఇనుమడింపజేసేలా వంశపారంపర్య ధర్మకర్తల పనితీరు ఉండాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేవాలయాల ఖ్యాతిని ఇనుమడింపజేసేలా వంశపారంపర్య ధర్మకర్తల పనితీరు ఉండాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం నాడు అమరావతిలోని సచివాలయంలో మంత్రి  రామనారాయణ రెడ్డి పలు ఆలయాల వంశపారంపర్య ధర్మకర్తలను కలిశారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయాల వైభవ పరిరక్షణకు వంశపారంపర్య ధర్మకర్తలు కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి కోరారు. ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయన వివరించారు. దేవాదాయ శాఖ కమీషనర్ ఎస్. …

Read More »