Breaking News

Monthly Archives: August 2024

ప్రజా సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వాటి పరిష్కారానికి సకాలంలో చర్యలు తీసుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వాటి పరిష్కారానికి సకాలంలో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల సమస్యలను ఎంతో ఓపిగ్గా విని సంబంధిత అధికారులను పిలిపించి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. …

Read More »

ప్రత్యేక మహిళా కారాగారమును సందర్శన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హెూంశాఖామాత్యులు వంగలపూడి అనిత ప్రత్యేక మహిళా కారాగారమును సోమవారం సందర్శించినారు. హోమ్ మంత్రి కి మహిళా కారాగారమునకు రాగానే మహిళా జైలు కానిస్టేబుల్స్ గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించి, వారిని ప్రసంశించారు. అనంతరం హోం మంత్రి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జైళ్ల శాఖాధికారి కుమార్ విశ్వజీత్ లతో కలిసి జైలు మొత్తం తిరిగి చూసినారు. ఖైదీలను పలకరించి వారి క్షేమ సమాచారములు అడిగి తెలుసుకొనినారు. ఖైదీల యొక్క భోజనం, ఇంటర్వ్యూలు, ఫోను …

Read More »

సెంట్రల్ జైలు సిబ్బందికి ఆరోగ్య భద్రత కల్పిస్తాం

– గంజాయి కేసులపై ఎక్కువ దృష్టి సారిస్తున్నాం -సైకియాట్రిస్టులను అందుబాటులో ఉంచుతాం. -ఇకనుంచి మహిళా పోలీసు స్టేషన్లగానే దిశ స్టేషన్లు -ప్రిజన్స్ కేఫ్ ప్రారంభించిన.. -హోం విపత్తుల నిర్వహణ హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : క్షణికావేశంలో చేసిన తప్పులకు జైలు జీవితం గడుపుతున్న ఖైదీలు బయటకు వెళ్ళాక నేర ప్రవృత్తివైపు వెళ్లకుండా ఉండేందుకు ఫ్యూయల్ అవుట్ లెట్స్, ప్రిజన్ కేప్స్ వంటివి ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ మరియు హోం శాఖ మంత్రి వంగలపూడి …

Read More »

యువత మాధక ద్రవ్యాలు వినియోగం వైపు ప్రభావితులు కావద్దు.

-మాధక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలను  ప్రతి ఒక్కరికి   అవగాహన కల్పించాలి. -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : యువత మాధక ద్రవ్యాలు వినియోగం వైపు ప్రభావితులు కావద్దని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పిలుపునిచ్చారు. సోమవారం రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాలలో ఏర్పాటుచేసిన మాధక ద్రవ్యాలు నియంత్రణ పై అవగాహన సదస్సు కు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు తెలిసి గాని, తెలియక గాని …

Read More »

నగరపాలక సంస్థ ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో 27 అర్జీలు స్వీకరణ

-మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను త్వరిత గతిన పరిష్కరించేందుకు స్పందన స్థానంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘ కు శ్రీకారం చుటిందని నగరపాలక నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ అన్నారు. సోమవారం ఉదయం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి నగరపాలక సంస్థ కమీషనర్ కేతన్ గర్గ్ 27 అర్జీలను స్వీకరించామన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కేతన్ …

Read More »

ఆగస్ట్, 20 న డీ వార్మింగ్ డే .. ప్రభుత్వ, ప్రవేట్ స్కూల్ విద్యార్థులకు పంపిణి

-మీకు తెలుసా..? …. హెచ్ ఐ వి పై ఆగష్టు 12 నుంచి 8 వారాల ప్రచార కార్యక్రమం -2030 నాటికి జిల్లా నుంచి అంటువ్యాధులను నిర్మూలిద్దాం -ప్రత్యేక అధికారుల వ్యక్తిగత పర్యవేక్షణా చెయ్యాలి -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆగష్టు 12 నుంచి అక్టోబర్ 13 వరకూ ఎనిమిది వారాల పాటు హెచ్ ఐ వి పై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం అంతర్జాతీయ యువజన దినోత్సవం ఆగష్టు 12 నుంచి ప్రచారం చేపట్టడం జరిగిందని, …

Read More »

సబ్ జైలు ప్రాంగణంలో హెచ్పీసీఎల్ వారి పెట్రోల్ బంకు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం రాజమహేంద్రవరం సబ్ జైలు ప్రాంగణంలో హెచ్పీసీఎల్ వారి పెట్రోల్ బంకును రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి వనిత ప్రారంభించారు. స్థానిక ఇన్నీస్ పేట సమీపంలో ఉన్న సబ్ జైలు ఆవరణ లో ఏపి ప్రిజన్స్ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ఏర్పాటు చెయ్యడం జరిగిందని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. జైళ్ళ శాఖ ద్వారా పెట్రోల్ కంపెనీలు ఆద్వర్యంలో పెట్రోల్ బంకు లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం హోం మంత్రి వినియోగదారుని వాహనానికి స్వయంగా వాహనానికి …

Read More »

అభివృద్ధి కార్యక్రమాలపై పాయింట్ ప్రెసెంటేషన్

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి లోని యంటీయంసీ కార్యాలయ పరిధిలో జరుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ , ట్రైనీ కలెక్టర్ స్వప్నిల్ పవార్ జగన్నాధ్ లకు సోమవారం మునిసిపల్ కమిషనర్ షేక్.అలీం బాష పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. మంగళగిరి పరిధిలో 11 విలీన గ్రామాలు , తాడేపల్లి పరిధిలో పది విలీన గ్రామాలు వున్నాయని తెలిపారు. పట్టణంలోని ప్రజలకు అందిస్తున్న నీటి సరఫరా వివరాలను తెలిపారు. …

Read More »

హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన అవగాహన కార్యక్రమం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హెచ్ఐవి / ఎయిడ్స్ నియంత్రణ మండలి మరియు తిరుపతి జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ మండలి మరియు వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో “మీకు తెలుసా “IEC హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన అవగాహన కార్యక్రమం మొదటి రోజున తిరుపతి జిల్లా కలెక్టరేట్ నందు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆల్ లైన్ డిపార్ట్మెంట్ HODs, మరియు, O. శ్రీనివాస్ రెడ్డి సార్ , జిల్లా కుష్టు ఎయిడ్స్ మరియు క్షయ నియంత్రణ అధికారి(DLATO …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రెవెన్యూ, విద్యుత్ శాఖ మంత్రులు అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవి కుమార్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారిని నేటి సోమవారం ఉదయం రెవెన్యూ, విద్యుత్ శాఖ మంత్రులు అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవి కుమార్ వి ఐ పీ విరామ సమయంలో దర్శించుకుని ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. మొదటగా రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడుతూ … తెలుగు ప్రజలందరూ బాగుండాలని, రాష్ట్రం సుభిక్షంగా,సస్యశ్యామలంగా ఉండాలని కోరుకున్నానని, గతంలో జరిగినటువంటి అన్యాయాల వలన ఇబ్బంది పడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలని ప్రజలందరూ ఏకతాటిపై ఓటు వేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి …

Read More »