Breaking News

Monthly Archives: August 2024

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పక్కాగా చేసి ఘనంగా నిర్వహిద్దాం

-జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పక్కాగా ఏర్పాట్లు చేసి ఘనంగా నిర్వహిద్దామని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు. నేటి సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు డిఆర్ఓ పెంచల కిషోర్ తో కలిసి ఈ నెల ఆగస్ట్ 15న నిర్వహించనున్న 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి అధికారులతో …

Read More »

మన రాష్ట్రంపై వకుళ మాత మరియు శ్రీవారి కృప ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నా

-ఈ నెల 15న రెవెన్యూ సదస్సు ఫార్మల్ లాంచింగ్… 16 నుండి సెప్టెంబర్ 30 వరకు క్షేత్ర స్థాయిలో రెవెన్యూ సదస్సులు: రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ -వకుళమాత ను దర్శించుకున్న రాష్ట్ర రెవెన్యూ, విద్యుత్ శాఖా మంత్రులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల భూ సమస్యల పరిష్కార దిశగా ప్రజల ముంగిటకు గ్రామాలకు అధికారులు వెళ్లి పరిష్కరించే విధంగా ఈ ఆగస్ట్ నెల 15 న ఫార్మల్ లాంచింగ్ చేసి ఈ నెల 16 నుండి సెప్టెంబర్ 30 …

Read More »

చేనేత వస్త్రాల అమ్మకమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఎగ్జిబిషన్ లు

-రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత వస్త్రాల అమ్మకమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఎగ్జిబిషన్ లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఎస్.సవితగారు తెలిపారు. నగరంలోని మారిస్ స్టెల్లా కాలేజీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఎగ్జిబిషన్ లో ప్రతి స్టాల్ వద్దకు వెళ్లి నేతన్నలను పలుకరించారు. ఏయే రాష్ట్రాల నుంచి …

Read More »

ఉపాధి హామి.. రెవెన్యూ సదస్సులు.. ఇ-పంట నమోదుల పై ప్రత్యేక దృష్టి పెట్టండి..

-క్షేత్ర స్థాయి అధికారుల సమన్వయంతో గ్రీవెన్స్‌ను పరిష్కరించండి.. -బడిమానిన పిల్లలను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టండి. -జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి హామి పనుల నిర్వహణలో లక్ష్యాల సాధన, రెవెన్యూ సదస్సుల నిర్వహణ ఇ పంట నమోదు లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, శాఖల సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, బడిమానిన పిల్లలను గుర్తించి బడిలో చేర్పించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన జిల్లా అధికారులకు …

Read More »

స్పష్టతతో అర్జీలను పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వండి – జాయింట్ కలెక్టర్ నిధి మీనా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను పారదర్శకంగా నిర్దిష్టమైన స్పష్టతతో అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా అధికారులను సూచించారు. క‌లెక్ట‌రేట్లోని శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో సోమ‌వారం నిర్వహించిన ప్రజా సమస్యల ప‌రిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జాయింట్ కలెక్టర్ నిధి మీనా, అసిస్టెంట్ కలెక్టర్ శుభం కుమార్, డీఆర్‌వో వి.శ్రీనివాస‌రావు, జిల్లా పౌరసరఫరాల డిఎం. జి. వెంకటేశ్వర్లు, కెఆర్ఆర్ సీ స్పెషల్ …

Read More »

ఈ ఐదేళ్లలో రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా మార్చుతాం

-అమరావతి బ్రాండింగ్ తో ఐపీఎల్ క్రికెట్ టీంను ప్రమోట్ చేస్తాం. -గల్లీ నుండి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం. -క్రీడామైదానాలు, స్టేడియంల ఏర్పాటుకు కృషి -క్రీడాకారులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు వారిని ప్రోత్సహిస్తాం. -ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు అనే తేడా లేకుండ విద్యార్థులకు ఒక గంట క్రీడలకు కేటాయించాల్సిందే -సర్టిఫికెట్ల కుంభకోణంపై దృష్టి పెట్టి నిజమైన క్రీడాకారులకు పూర్తి న్యాయం చేస్తాం. -సీఎంతో మాట్లాడి అతి త్వరలోనే సరికొత్త క్రీడాపాలసీని రూపొందిస్తాము. -గత ఐదేళ్లలో క్రీడలకు అన్యాయం జరిగింది. …

Read More »

ఎయిడ్స్‌ వ్యాధి కట్టడి “మీకు తెలుసా?”

-పూర్తి అవగాహనతోనే ఎయిడ్స్‌ నివారణ -ఎయిడ్స్‌ నుండి రక్షణకు క్రమశిక్షణా జీవితమే మార్గం.. -జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎయిడ్స్‌ వ్యాధి పట్ల పూర్తి అవగాహన కల్పించి వ్యాధిని నివారించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని క్రమశిక్షణా జీవితమే ఎయిడ్స్‌ వ్యాధి రక్షణకు ఏకైక మార్గమని, వ్యాధి బారిన పడిన వారి పట్ల వివక్షత చూపకుండా మనోధైర్యాన్ని నింపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన …

Read More »

రెవిన్యూ సదస్సులకు ఆర్ పి సిసోడియా

-విజయనగరం, విశాఖలలో నాలుగు రోజుల పర్యటన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెవిన్యూ సదస్సులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవిన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు) ఆర్ పి సిసోడియా స్వయంగా హాజరవుతున్నారు. పదహేనవతేదీ సాయంత్రానికి విశాఖపట్నం చేరుకుని, 16వ తేదీ ఉదయం విజయనగరం వెళతారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలోనే అందుబాటులో ఉండి అక్కడి రెవిన్యూ సదస్సులను అకస్మికంగా సందర్శిస్తారు. కనీసం సాయంత్రం లోపు రెండు, మూడు సదస్సులకు హాజరుకావాలని …

Read More »

కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ శంకర రావు ఇచ్చిన పిలుపు మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ విజయవాడ డివిజన్ ఆధ్వర్యములో గూడూరు నుండి అనకాపల్లి వరకు అన్ని రైల్వే కార్యాలయముల ముందు నూతన పెన్షన్ విధానం రద్దు, కరోనా సమయంలో ఫ్రీజ్ చేసిన 18 నెలల DA ను తిరిగి చెల్లించాలని, ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేయడం …

Read More »

డ్రగ్ ఫ్రీ ఇండియా అవగాహన కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ ముందుండాలని భారత దేశం విద్య వైద్య అవస్థాపన మరియు సాంకేతిక రంగాలలో ముందుండాలని యువత ముఖ్య పాత్ర పోషించాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ జసింత క్వాద్రశ్ పిలుపునిచ్చారు. వికసిత భారత్ లక్ష్యం గా ఈ రోజు కళాశాల విద్యార్థినులు LEPL INOX థియేటర్ ప్రాంగణం లో డ్రగ్స్ వాడటం మంచిది కాదు అని తద్వారా యువత అనారోగ్యం బారిన పడుతున్నారని భవి భారత పౌరులైన యువత …

Read More »