Breaking News

Daily Archives: December 15, 2025

ఆర్టీసిలో ప్రవేశ పెట్టాలను కుంటున్న విధ్యుత్ బస్సులు ఆర్టీసి ద్వారా నిర్వహించాలి…

-ఆర్టీసిలో ఉన్న 10 వేలు ఖాళీలను భర్తికీ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయాలి -స్త్రీశక్తి పధకాన్ని ఉద్యోగులంతా విజయవంతము చేయడానికి కృషి చేస్తుంటే… ఆర్టీసి అధికార్లు మాత్రం చిన్నచిన్న తప్పులకు కూడా సస్పెండ్లు,పనిష్ మెంట్లు ఇస్తున్న చర్యలు మానుకోవాలి -ప్రభుత్వం అనుమతించిన ఆర్టీసి ఉద్యోల పదోన్నతలు అన్ని ఈనెలాఖరులోగా ఇవ్వాలి -ఏపి పిటిడి (ఆర్టీసి) ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపియస్ ఆర్టీసిలో డీజల్ ఖర్చులు తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రవేశ పెట్టాలను కుంటున్న విధ్యుత్ బస్సులను ఏపిపిటిడి ఎంప్లాయీస్ …

Read More »

ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. సోమవారం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా గుంటూరు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో కమిషనర్ పులి శ్రీనివాసులు, ఏపి హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషాలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ, అమరజీవి పొట్టి …

Read More »

కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు జరుగుతున్నందున పనులను వేగంగా చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వార్డ్ ల వారీగా ఆమోదించిన అభివృద్ధి పనులను అసంపూర్తిగా చేపట్టడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గతంలో ఇచ్చిన హామీ మేరకు నిధి పోర్టల్ ద్వారా కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు జరుగుతున్నందున పనులను వేగంగా చేపట్టాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. సోమవారం నగర కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి పట్టాభిపురం మెయిన్ రోడ్, డిఆర్ఎం ఆఫీస్ రోడ్లను పరిశీలించి, పనుల వేగవంతంపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ …

Read More »

పిజిఆర్ఎస్ కు అన్ని విభాగాల అధికారులు హాజరు కావాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్ కు అన్ని విభాగాల అధికారులు హాజరు కావాలని, ప్రజలు అందించే ఫిర్యాదులు, అర్జీలను విభాగాధిపతులు క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దేశిత గడువు మేరకు పరిష్కరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు విభాగాధిపతులకు స్పష్టం చేశారు. సోమవారం డయల్ యువర్ కమిషనర్, నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో జరిగిన పిజిఆర్ఎస్ లో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను ఉన్నతాధికారుల …

Read More »

అన్నక్యాంటీన్లలో మౌలిక వసతులు సమన్వయం చేసుకొని ఏర్పాటు చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లలో మౌలిక వసతులకు సంబంధించి జిఎంసి ఇంజినీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకొని ఏర్పాటు చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అక్షయ పాత్ర సిబ్బందిని ఆదేశించారు. సోమవారం బస్టాండ్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో ఆహారం తీసుకునేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని, కొందరు క్యాంటీన్ లో స్థలం సరిపోక కాంపౌండ్ లోపల కూర్చొని భోజనం …

Read More »

ప్రజలకు కార్యదర్శులు, కార్మికులు అవగాహన కల్గించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వార్డ్ ల వారీగా ప్రతి సచివాలయం పరిధిలో నూరు శాతం వ్యర్ధాలను తడి, పొడిగా వేరుగా ఇచ్చేలా ప్రజలకు కార్యదర్శులు, కార్మికులు అవగాహన కల్గించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. సోమవారం సంగడి గుంట, ఆర్టీసి కాలనీ, పాత బస్టాండ్ ఏ టు జెడ్ సందు, చాకలి గుంట తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ …

Read More »

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆత్మార్పణ దినం – భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావం గా రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.. ఈ సందర్భంగా పొట్టి శ్రీ రాములు త్యాగనిరతిని ముఖ్యమంత్రి కొనియాడి ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. తొలుత భాషా సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జీవిత ఛాయా …

Read More »

చివరి రోజు భవాని దీక్షల సేవలలో జిల్లా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిలో ఈనెల 11 నుంచి 15 వరకు జరుగుతున్న భవాని దీక్షల విరమణ సేవలలో 100 మంది ఎన్టీఆర్ జిల్లా కు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు( ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మేరిస్టెల్లా కళాశాల, విజయ ఇన్స్టాప్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ మరియు కేబీఎన్ కళాశాల) పాల్గొని భవాని దీక్షల విరమణకు విచ్చేసిన భక్తులకు దేవస్థానం వారు ఏర్పాటుచేసిన సదుపాయాలు (అన్నప్రసాదాలు, లడ్డు ప్రసాదాలు, త్రాగునీరు, మెడికల్,సానిటరీ, క్యూ లైన్లు, పాలు, చంటి పిల్లలకు ట్యాగ్) …

Read More »

స‌మ‌ష్టి కృషితో భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌లు విజ‌య‌వంతం

– భక్తుల నుంచి పూర్తిస్థాయిలో సంతృప్తి వ్య‌క్తీక‌ర‌ణ‌ – ప‌టిష్ట ప్ర‌ణాళిక‌ల ఆధారిత ఎస్‌వోపీతో స‌త్ఫ‌లితాలు – ఇంద్ర‌కీలాద్రిపై మీడియా స‌మావేశంలో కలెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు, సిబ్బంది స‌మ‌ష్టి కృషి, భాగ‌స్వామ్యంతో భ‌వానీ దీక్ష‌ల విర‌మ‌ణ‌ల ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మం విజ‌య‌వంత‌మైంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సోమ‌వారం భ‌వానీ దీక్ష‌ల విర‌మ‌ణ‌ల కార్య‌క్ర‌మాన్ని క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. భ‌వానీ భ‌క్తుల‌తో మాట్లాడి ఏర్పాట్ల‌పై అభిప్రాయాల‌ను అడిగి తెలుసుకున్నారు. అన్న‌దానం, ల‌డ్డూ …

Read More »

ఇంధ‌న పొదుపుతో స్వ‌ర్ణాంధ్ర దిశ‌గా అడుగులు..

– మ‌హోద్య‌మంగా ఇంధ‌న పొదుపును ముందుకు తీసుకెళ్దాం – నిక‌ర శూన్య ఉద్గారాల ల‌క్ష్యాన్ని చేరుకుందాం – ప్రతిఒక్క‌రూ ప్రొడ్యూమ‌ర్‌గా మారాల్సిన అవ‌స‌ర‌ముంది – గౌర‌వ సీఎం ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా స‌మ‌ష్టిగా కృషిచేద్దాం – ఇంధ‌న సంర‌క్ష‌ణ‌లో వ‌రుస అవార్డుల‌తో రాష్ట్రానికి నూత‌నుత్తేజం – ఏపీ జెన్‌కో ఎండీ ఎస్‌.నాగ‌ల‌క్ష్మి, జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స‌మ‌ష్టి భాగ‌స్వామ్యంతో ఇంధ‌న పొదుపుతో స్వ‌ర్ణాంధ్ర @ 2047 దిశగా అడుగులు వేద్దామ‌ని.. మ‌హోద్య‌మంగా ఇంధ‌న పొదుపును ముందుకు తీసుకెళ్దామ‌ని …

Read More »