Breaking News

Daily Archives: December 21, 2025

అశోకగజపతిరాజుకు అభినందనలు -సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : గోవా గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోకగజపతిరాజుకు సిపిఐ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. విశాఖపట్నం భీమిలీ వద్ద ఏవియేషన్ ఎడ్యూసిటీ ప్రాజెక్టు కోసం రూ.1000 కోట్ల విలువైన 136,63 ఎకరాల తన స్వంత భూమిని అశోకగజపతిరాజు ప్రభుత్వానికి ఇవ్వడం నేటి రాజకీయాలకు ఆదర్శనీయం, ఆయన ముందునుండీ కూడా తనకు ఏనాడూ అవినీతి మరక అంటకుండా విలువలతో కూడిన రాజకీయాలు నడిపారు. రాజకీయ అవినీతి, అక్రమాలు తారాస్థాయికి చేరిన నేటి పరిస్థితులలో ఆయన రాజకీయ నేపథ్యం అందరికీ …

Read More »

మత్స్యకారుల వలసలు నివారించి ఆదుకోండి… : సూరాడ రాజారావు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సముద్ర తీరప్రాంత మత్స్యకారుల జీవన స్థితిగతులు దుర్భరంగా ఉండడంతో అనేక మంది వలస వెళ్తున్నారని, వలసల నివారణకు వేటకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు తక్షణం కల్పించాలని రాష్ట్ర మత్స్యకార సముదాయ సంఘాల నెట్ వర్క్ (ఫిష్ కాస్ ) అధ్యక్షుడు సూరాడ రాజారావు డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఫిషింగ్ హార్బర్లు నేటికీ నిర్మాణ దశలోనే ఉన్నాయన్నారు. ఫిష్ లాండింగ్ కేంద్రాల్లో మౌలిక మౌళిక సదుపాయాలతో పాటు …

Read More »

3 వేల మందితో ‘పదవి – బాధ్యత’ కార్యక్రమం

-జనసేన నుంచి నామినేటెడ్ పదవులు పొందిన వారికి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం -పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖమంత్రి నాదెండ్ల మనోహర్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వంలో జనసేన పక్షాన నామినేటెడ్ పదవులు పొందిన వారితో పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం సమావేశం అవుతున్నారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. మూడు వేల మందితో పదవి – బాధ్యత అని పేరిట నిర్వహించే ఈ …

Read More »

ప్రజారోగ్యం వ్యాపారం కాదు – అది ప్రజల ప్రాధమిక హక్కు!

-ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరించే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కు తీసుకోవాలి!! విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (పి డి ఎస్ ఓ) ఆధ్వర్యంలో ఈరోజు రాఘవయ్య పార్క్ సమీపంలోని బాలోత్సవ భవన్ నందు “వైద్య విద్య ప్రైవేటీకరణ – సమాజంపై దాని ప్రభావం” అనే అంశంపై రాష్ట్ర సెమినార్ ను నిర్వహించడం జరిగింది. పిడిఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.భాస్కర్ అధ్యక్షత వహించిన ఈ సెమినార్ కు ప్రధాన వక్త గా విచ్చేసిన ఘంటా …

Read More »

ఢిల్లీలో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు

-అసలైన విజన్ ఉన్న నాయకుడు వైఎస్ జగన్: ఎంపీ గురుమూర్తి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ముఖ్య అతిధిగా హాజరై కేకు కట్ చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్నవారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అమలు చేసిన ప్రజాహిత కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ ఆయన సేవలను కొనియాడారు. …

Read More »

ఎన్టీఆర్ జిల్లాను పేద‌రికం లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు స‌హ‌క‌రించాలి…

-పారిశ్రామివేత్త‌ల‌కు, ప్ర‌ముఖుల‌కు ఎంపీ కేశినేని శివ‌నాథ్ పిలుపు -తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రంలో అమ‌రావ‌తి విశిష్ట‌సేవ పుర‌స్కారం 2025 కార్య‌క్ర‌మం -ముఖ్యఅతిథులుగా హాజ‌రైన ఎంపీ కేశినేని శివ‌నాథ్ , ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాను పేదరికం లేని జిల్లా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు జిల్లాలోని ప్రముఖులు, పారిశ్రామిక‌వేత్త‌లు సహకరించాలని విజయవాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ పిలుపునిచ్చారు. అంతే కాదు సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన పీ 4 కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని ప్రతి ఒక్కరూ ఒక బంగారు కుటుంబాన్ని …

Read More »

అమిగోస్ ఈవెంట్స్ మ్యూజికల్ నైట్ పోస్టర్ ఆవిష్కరణ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : న్యూ ఇయర్ ని పరిష్కరించుకొని అమిగోస్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీన హాయ్ ల్యాండ్లో మ్యూజికల్ నైట్ జరగనుందని ఆస్కార్ అవార్డు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తెలిపారు. గవర్నర్పేట అప్సర థియేటర్ సమీపంలోని ఒక షోరూమ్ లో న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించే మ్యూజికల్ నైట్ పోస్టర్ను ఆస్కార్ అవార్డు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమిగోస్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలను విజయవాడ నగరంలో జరుపుకోవడం తనకెంతో సంతోషంగా …

Read More »

ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి…

-సమాన పనికి సమాన వేతన విధానాన్ని అమలు చేయాలి -ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి -ఏపీ ఎన్జీజిఓ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ జెఎసి చైర్మన్ ఎ. విద్యాసాగర్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ విభాగాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడం సమాన పనికి సమాన వేతనం విధానాన్ని అమలు చేయడం వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి సంఘటిత కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉందని సంఘ రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ తెలిపారు. విజయవాడ …

Read More »

జర్నలిస్టుల పునశ్చరణ తరగతులు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు సి.ఆర్ మీడియా అకాడమీ ప్రయత్నాలు చేస్తున్నామని అకాడమి చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ అన్నారు. రామచంద్రపురం వి. ఎస్.ఎం ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో రెండోరోజు ఆదివారం జరిగిన పునశ్చరణ తరగతులు కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ద్రాక్షారామం పత్రికా విలేఖరి రమేశ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఫునశ్చరణ తరగతుల నిర్వహణ ఇందులో భాగమని ఆయన చెప్పారు. రెండోరోజు నిర్వహించే కార్యక్రమంలో ప్రముఖులు, సీనియర్ జర్నలిస్టులు ద్వారా నిర్వహించే పునశ్చరణ తరగతుల …

Read More »

డిసెంబర్ 22న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ..

-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : డిసెంబర్ 22వ తేదీ సోమవారం కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత …

Read More »