Breaking News

Daily Archives: December 22, 2025

ఒకేషనల్ ట్రైనర్ నియామకం కోసం దళారులను నమ్మి మోసపోవద్దు

-సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS.,  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో వృత్తి విద్యా కోర్సు అమలు కోసం బోధకులు (ఒకేషనల్ ట్రైనర్లు) నియామకాల్ని థర్డ్ పార్టీ ఏజెన్సీలు అయిన ఒకేషనల్ ట్రైనింగ్ పార్టనర్స్ నిర్వహిస్తున్నారని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నియామకాలకు సంబంధించి అభ్యర్థులు దళారులకు డబ్బులిచ్చి మోసపోవద్దని తెలిపారు. ఈ పోస్టులకు పూర్తిగా ఒకేషనల్ ట్రైనింగ్ పార్టనర్స్ నిర్వహణలో, పరిమిత కాలం మాత్రమే ఉంటాయని, …

Read More »

ప్రతి విద్యార్థి జీవన నైపుణ్యాలు నేర్చుకోవాలి

– సమగ్ర శిక్ష ఏఎస్పీడీ డాక్టర్ ఎం. ఆర్ ప్రసన్నకుమార్  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వృత్తి విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి విద్యార్ధి చదువు పూర్తయ్యేసరికి నైపుణ్యాలు నేర్చుకుని స్వశక్తితో జీవించేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా విద్యాశాఖ, సమగ్ర శిక్ష కృషి చేస్తోందని సమగ్ర శిక్ష ఏఎస్పీడీ డా. ఎం.ఆర్.ప్రసన్నకుమార్ అన్నారు. సోమవారం ఆంధ్రా లయోలా కాలేజీ ప్రాంగణం ఎస్-జె సెంటర్ లో పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ‘స్కిల్ ఎడ్యుకేషన్’ అంశంపై జీసీడీవోలకు, ఒకేషనల్ కోఆర్డినేటర్లకు, …

Read More »

ఆందోళనకర స్థాయిలో దళితులపై పెరిగిన దాడులు – జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు

-రాష్ట్రంలో జరిగే అన్యాయాలపై పోరాటం ఆగదు – ఎంపీ మద్దిల గురుమూర్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో దళితులపై దాడులు, అణచివేత చర్యలు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న పరిస్థితులపై జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రామచందర్ పత్రికా ముఖంగా స్పందించారు. ఈ సందర్బంగా ఆయన తెనాలిలో దళితుడిపై పోలీసులు పాశవికంగా దాడి చేసిన అంశాన్ని సుమోటోగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ అంశంపై వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి స్పందిస్తూ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడే సీరియస్‌గా …

Read More »

ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే విలువలను అందించిన ఏసు సందేశమే స్పూర్తి

-క్రైస్తవుల భద్రతకు, గౌరవానికి భంగం కలుగనివ్వం -24వ తేదీ సాయంత్రం లోపు పాస్టర్లకు రూ.51 కోట్ల గౌరవ వేతనం -గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది -విజయవాడలో ప్రభుత్వం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రీస్తు త్యాగాలను స్మరిస్తూ ఆయన చూపిన బాటను అనుసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. క్రైస్తవులకు సంక్షేమం, ఆర్థిక చేయూత అందించింది తమ ప్రభుత్వమేనని అన్నారు. విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో …

Read More »

తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని చాటిచెప్పేలా ఆవకాయ సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవం

-జనవరి 8 నుండి 10 వరకు విజయవాడ పున్నమి ఘాట్, భవానీ ఐల్యాండ్ లో నిర్వహణ.. ప్రవేశం ఉచితం -మంత్రి కందుల దుర్గేష్ -సినిమా, సాహిత్యం, సంగీతం, నాటకరంగం, సాంస్కృతిక చర్చలను ఒకే బహిరంగ వేదికపైకి తేనున్న వేడుక -తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడంతో పాటు, సమకాలీన సృజనాత్మక పద్ధతులకు పెద్దపీట -ఆంధ్రప్రదేశ్‌ను సాంస్కృతిక మార్పిడికి, కళాత్మక భాగస్వామ్యానికి ఒక శక్తివంతమైన గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా అమరావతి ఫెస్టివల్ ఉద్దేశమని పేర్కొన్న మంత్రి దుర్గేష్ -ప్రజా రాజధాని అమరావతిని సాహితీ, కళా రాజధానిగా మార్చేందుకు …

Read More »

క్వాంటం వ్యాలీలో భవనాల నిర్మాణానికి నిధుల కేటాయింపు

• క్వాంటం వ్యాలీ లో 2 భవనాల నిర్మాణానికి రూ. 103.96 కోట్లు • ఐఏఎస్ ల భవనాల ఇంటీరియర్ పనులకు రూ. రూ. 109కోట్లు • సీఆర్డీఏ పాలనా వ్యయానికి రూ. 100 కోట్లు • రాజధానిని వరద ముంపు తప్పించడానికి చర్యలు • జోన్ 8లోని ఎల్పీఎస్ పనులకు రూ. 1,358 కోట్లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతి ప్రాంతంలో క్వాంటం వ్యాలీలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 103.96 కోట్లు కేటాయింపునకు …

Read More »

ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో వెనకడుగు వేయం

– ఉద్యోగుల సంక్షేమం వైపు మా అడుగులు వేస్తాం – ఏపీ ఎన్‌జీజీవో న‌గ‌ర కార్య‌వ‌ర్గం ఏక‌గ్రీవ ఎన్నిక‌ – భారీగా త‌ర‌లివ‌చ్చిన ఉద్యోగులు – ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఎ.విద్యాసాగర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల సంక్షేమ‌మే ల‌క్ష్యంగా ఏపీ ఎన్‌జీజీవో అడుగులు ముందుకు వేస్తోంద‌ని.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో వెన‌క‌డుగు వేయ‌బోమ‌ని, సానుకూల దృక్ప‌థంతో డిమాండ్ల సాధ‌న‌కు చిత్త‌శుద్ధితో కృషిచేస్తామ‌ని ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్య‌క్షులు ఎ.విద్యాసాగ‌ర్ అన్నారు. ఏపీ ఎన్‌జీజీవో అసోసియేష‌న్ విజ‌య‌వాడ న‌గ‌ర‌శాఖ నూత‌న కార్య‌వ‌ర్గ …

Read More »

“చిరు ధాన్యాల సాగుకు మేలైన యాజమాన్య పద్ధతులు”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ ఆహార భద్రత మరియు నూట్రిషన్ మిషన్ పధకము 2025-26 క్రింద తక్కువ సారవంతమైన , అరకొరగా నీటి సౌకర్యము ఉన్న నేలల్లో ఆకస్మిక వాతావరణ మార్పులకు అనువైన పురాతన కాలం నాటి సాంప్రదాయ పంటలు మరియు జాతి ఆహారాలైన ప్రత్యేక పోషక లక్షణాలు – అధిక ఫైబర్, నాణ్యమైన ప్రోటీన్ & ఖనిజాలు సమృద్ధిగా కల్గిన చిరుధాన్యాల ప్రోత్సహించ వలసిన ఆవశ్యకతను వివరించడంతో పాటు చిరుధాన్యాల సమగ్ర యాజమాన్యం గురించి అవగాహన కల్పించడంతో పాటు ఎన్ …

Read More »

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి

-ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను సద్వినియోగం చేసుకొని.. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. డీఆర్ డీఏ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇగ్నైట్ సెల్ ను కలెక్టర్ లక్ష్మీశ సందర్శించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు అందుబాటులో ఉన్న వివిధ వనరులపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన ప్రచార సామగ్రిని పరిశీలించారు. వివిధ మహిళా సంఘాలు …

Read More »

ప్ర‌జ‌ల సంతృప్తే సేవ‌ల్లో నాణ్య‌త‌కు గీటురాయి

– నిబ‌ద్ధ‌త‌తో పీజీఆర్ఎస్ అర్జీల‌ను ప‌రిష్క‌రించండి – పారిశ్రామిక, సేవా రంగాల వృద్ధికి స‌మ‌ష్టి కృషి అవ‌స‌రం – స‌మ‌గ్ర అభివృద్ధికి ఎంఎస్ఎంఈలు గేమ్ ఛేంజ‌ర్లు – జిల్లాస్థాయి పీజీఆర్ఎస్‌కు 229 అర్జీలు – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జ‌ల సంతృప్తే సేవ‌ల్లో నాణ్య‌త‌కు గీటురాయ‌ని.. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) ద్వారా వ‌చ్చిన ప్ర‌తి అర్జీని స‌కాలంలో నిబ‌ద్ధ‌త‌తో ప‌రిష్క‌రించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. సోమ‌వారం క‌లెక్ట‌ర్ …

Read More »