Breaking News

Daily Archives: January 2, 2026

ఉచిత ఫల మరియు పూల మొక్కల పంపిణీ కార్యక్రమం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాలుష్యాన్ని తగ్గించే దిశగా మొక్కలను నాటి ఆంధ్రప్రదేశ్ను హరితాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు విజయవాడ నగరపాలక సంస్థ ఉచిత పండ్ల మరియు పూల మొక్కలను పంపిణీ చేస్తున్నారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పరిధిలో గల మూడు నియోజకవర్గాలలో ప్రజలకు ఉచితంగా పండ్ల మరియు పూల మొక్కలను నేటి నుండి పంచ బోతున్నారని ఆసక్తిగల ఎన్జీవోలు, స్వయం సహాయక బృందాలు, ప్రజలందరు …

Read More »

రోడ్లపై చెత్త వేస్తే జరిమానా

-నిబంధనలు ఉల్లంఘిస్తే మొబైల్ కోర్టులో హాజరు కావాల్సిందే విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలతో రోడ్ల పైన చెత్త వేసిన వారికి, కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ప్రతి శుక్రవారం నిర్వహించే మొబైల్ కోర్టులో 8వ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ గోలీ లెనిన్ బాబు, శుక్రవారం ఉదయం సర్కిల్-2 కార్యాలయం, నందు సర్కిల్-2 పరిధిలోని శానిటరీ ఇన్స్పెక్టర్లు నమోదు చేసిన 11 కేసులపై విచారణ జరిపి వారికి Rs.3,100/- రూపాయలు జరిమానా విధించారు.మరోసారి ఈ విధంగా …

Read More »

దోమల వల్ల కలిగే వ్యాధుల నివారణ కొరకు ఫ్రైడే డ్రై డే

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే ఫ్రైడే నిర్వాహణ తో ప్రజలకు అవగాహన కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం ప్రజాశక్తినగర్, చిట్టినగర్,ఫైజర్ పేట మరియు కండ్రిక ప్రాంతాలలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు విఎంసి సిబ్బంది అవగాహన కల్పించారు. అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజల వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేస్తూ …

Read More »

అధికారులు అందరు సమన్వయంతో విజయవాడను అభివృద్ధి పధం లో నడపాలి

-విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధికారులు అందరు సమన్వయంతో విజయవాడ నగరపాలక సంస్థను అభివృద్ధి పథంలో నడిపించాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని తమ ఛాంబర్ లో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, అధికారులు సిబ్బందితో అన్నారు. ఈ సందర్భంగా మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విజయవాడ నగర ప్రజల యోగ క్షేమం కోసం అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా చేపట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, …

Read More »

ఎపీలో ఎస్‌ఐఆర్‌ అమలుకోరడం బిజెపికి వంతపాడడమే

-ఎస్‌ఐఆర్‌పై తక్షణమే అఖిలపక్ష సమావేశం జరపాలి -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)ను త్వరగా ప్రారంభించాలంటూ జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయడం బిజెపి కుట్రపూరిత రాజకీయాలకు జనసేన వంతపాడుతున్నట్లున్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా విమర్శించారు. ఎపీలో ఎస్‌ఐఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. …

Read More »