Breaking News

Daily Archives: January 16, 2026

APFIRST పేరుతో తిరుపతిలో అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం

-ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ-AP FIRST ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ -తిరుపతి IIT-IISER కాంబినేషన్‌తో AP FIRST ఏర్పాటు -ఏరో స్పేస్-డిఫెన్స్, ఐటీ-డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ సలహదారులతో సీఎం సమావేశం -యువత భవిష్యత్తుకు బాటలు వేసేలా పరిశోధనలు : సీఎం చంద్రబాబు -యువతకు…రాష్ట్రానికి మేలు జరిగేలా అతిపెద్ద రీసెర్చ్ కేంద్రంగా ఏపీ ఫస్ట్: ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : యువతరం భవిష్యత్తును తీర్చిదిద్దేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని… ఆ దిశగా వారికి …

Read More »

గ్రీన్ అమోనియా ఉత్పత్తిలో కొత్త చరిత్రకు శ్రీకారం

-ఏపీలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టు -రూ.13 వేల కోట్లతో ఏఎమ్ గ్రీన్ అమోనియా ప్లాంట్‌కు రేపు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు -కాకినాడలో 495 ఎకరాల్లో ఏర్పాటు..2,600 మందికి ఉద్యోగాలు -ఏడాదికి 1 మిలియన్ మెట్రిక్ టన్ను గ్రీన్ అమోనియా ఉత్పత్తి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లీన్ ఎనర్జీ రంగంలో సరికొత్త చరిత్రను సృష్టించబోతోంది. గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా పరిశ్రమ ఏర్పాటుతో దేశంలోనే అతిపెద్ద పర్యావరణహిత పరిశ్రమలలో ఒకటిగా నిలిచి చారిత్రాత్మక అడుగు వేయనుంది. …

Read More »

ముస్లిం ఆస్తుల నష్టానికి వక్ఫ్ అధికారులే కారణం

-అన్యాక్రాంతాలపై ముఖ్యమంత్రికి వివరిస్తే ప్రభుత్వ ఖాజీ ని సస్పెండ్ చేయడం దారుణం -రాష్ట్ర అహలె సున్నతుల్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ బాబా ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అంజుమన్, ఖాజీ,మసీదు దర్గా భూములన్నీ ముస్లిం మైనార్టీ భూములని ఆ తర్వాతే అవి వక్ఫ్ బోర్డు పరిధిలోకి వస్తాయని అన్నారు రాష్ట్ర అహలె సున్నతుల్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ బాబా. ముస్లిం మైనార్టీల భూములు అన్యాక్రాంతమవుతున్నయని ముఖ్యమంత్రి కలిస్తే వక్ఫ్ అధికారులు కక్ష సాధింపు చర్యలో భాగంగా జిల్లా ప్రభుత్వ ఖాజీ హబీబుల్లా హుస్సేని …

Read More »

భోగి–సంక్రాంతి–కనుమ పండుగ మూడు రోజులూ రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన

-ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ప్రత్యేక డ్రైవ్ – కారు, ఆటో, ద్విచక్ర వాహనదారులకు సూచనలు -హెల్మెట్, సీట్‌బెల్ట్ ధారణ లో నిర్లక్ష్యం ప్రాణాలకే ప్రమాదం -జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం 2026 (National Road Safety Month–2026) కార్యక్రమాల్లో భాగంగా, భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా మూడు రోజుల పాటు రాజమహేంద్రవరం నగరంలో విస్తృత స్థాయిలో రహదారి భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు జిల్లా రవాణా అధికారి ఆర్. …

Read More »

జిఎంసి సంక్రాంతి సంబరాలకు విశేష స్పందన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం జిఎంసి సంక్రాంతి సంబరాల్లో భాగంగా సాంప్రదాయ డ్రస్ పోటీలు, చెక్క భజన, కోలాటం, అంబికా బృందం మ్యూజికల్ నైట్, డ్యాన్స్ లు, తంబోలా గేమ్ ప్రజలను విశేషంగా అలరించాయి. సాంప్రదాయ డ్రస్ పోటీల్లో పెద్దలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తంబోలా గేమ్ చిన్నారులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మ్యూజికల్ నైట్ లో భాగంగ అంబికా బృందం గేయాలకు ప్రజల నుండి విశేష స్పందన …

Read More »

ఈ సంక్రాంతికి ఎన్టీఆర్ జిల్లా మొత్తం పండుగ వాతావరణంతో వైబ్రెంట్‌గా క‌నిపిస్తుంది

-సంక్రాంతి సంబరాలు ప్రజలకు మరపురాని అనుభూతి -ఎంపీ కేశినేని శివ‌నాథ్ వెల్ల‌డి -జగ్గయ్యపేటలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు -సుగాలి నృత్యంలో కాలు క‌దిపిన‌ ఎంపీ కేశినేని శివ‌నాథ్ -కర్ర సాముతో ఆక‌ట్టుకున్న ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ జగ్గ‌య్య‌పేట, నేటి పత్రిక ప్రజావార్త : ఈ సంక్రాంతికి ఎన్టీఆర్ జిల్లా మొత్తం పండుగ వాతావ‌ర‌ణంతో వైబ్రెంట్ గా కనిపిస్తోంది. తెలంగాణ నుంచి కూడా తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాలకు ప్రజలు వచ్చి సంబరాల్లో పాల్గొన్నారని తెలిపారు. ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు. …

Read More »

రాజకీయాలకు అతీతంగా ఈద్గా, షాదీ ఖానా, బరియల్ గ్రౌండ్ అభివృద్ధి : ఎంపీ కేశినేని శివనాథ్

-కుమ్మ‌రి పాలెం లో షాదీఖానా, ఈద్గా గ్రౌండ్, బ‌రియ‌ల్ గ్రౌండ్ సంద‌ర్శ‌న -ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను ఆహ్వానించిన మ‌క్కా మ‌స్జీద్ మ‌రియు మ‌దీనా మ‌స్జీద్ క‌మిటీ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గం కుమ్మ‌రి పాలెం గుప్తా సెంట‌ర్ లోని షాదీ ఖానా, ఈద్గా ప్రాంగ‌ణం, బ‌రియ‌ల్ గ్రౌండ్ ను విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ శుక్రవారం ప‌రిశీలించారు. మ‌క్కా మ‌స్జీద్ మ‌రియు మ‌దీనా మ‌స్జీద్ క‌మిటీ ఆహ్వానం మేర‌కు టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఫ‌తావుల్లా …

Read More »

చిన్న సినిమాల విజయం చిత్రసీమకు శుభప‌రిణామం : ఎంపీ కేశినేని శివనాథ్

-విజ‌య‌వాడ లో ‘నారీ నారీ నడుమ మురారీ’ మూవీ సక్సెస్ మీట్ -ముఖ్యఅతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ హాజ‌రు -సంక్రాంతి విన్న‌ర్ గా నారీ నారీ న‌డుము మురారీ సక్సెస్ మీట్ నిర్మాత అనిల్ సుంక‌ర‌, డైరెక్ట‌ర్ రామ అబ్బ‌రాజు వెల్ల‌డి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : లో బడ్జెట్‌లో తెర‌కెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యం సాధించ‌టం తెలుగు చిత్ర సీమ‌కు శుభ‌ప‌రిణామమ‌ని, చిన్న సినిమాలు విజ‌యం సాధించ‌టం వ‌ల్ల మూవీ ఇండ‌స్ట్రీలో ఎంతో మంది స్పూర్తి పొందుతార‌ని విజయవాడ ఎంపీ …

Read More »

బడి పిల్లల కంటి రక్షణ భేష్!

-రాష్ట్ర ఆరోగ్య శాఖకు జాతీయ స్థాయి గుర్తింపు -లక్ష్యాన్ని 90 వేల నుంచి 2.50 లక్షల విద్యార్దులకు పెంచిన కేంద్రం -అధికారులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు, కంటి అద్దాల పంపిణీలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గత రెండు సంవత్సరాలుగా అమలు చేస్తున్న విధానాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2024–25, 2025–26 విద్యా సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపుతున్న చొరవ …

Read More »

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి APCRDA నిరంతరం కట్టుబడి వుంది 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పరిపాలనా కారణాల దృష్ట్యా, APCRDA ప్రాజెక్ట్ కార్యాలయంలో ప్రతి శనివారం నిర్వహించే వారపు గ్రీవెన్స్ డే కార్యక్రమం శనివారం నిర్వహించబడదని తెలియజేయడమైనది. అయితే, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కారం కౌంటర్లో యథావిధిగా స్వీకరిస్తారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి APCRDA నిరంతరం కట్టుబడి ఉందని సంస్థ భరోసా ఇస్తోంది.

Read More »