-ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీవారి తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న విషయం సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ దర్యాప్తు సంస్థ స్పష్టంగా తేల్చి చెప్పిందని ఇది జగన్ ప్రభుత్వానికి చెప్ప పెట్టులాంటిదని, ధార్మికతపై దాడి చేసిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు కూడా బుద్ది చెప్పారని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ తెలిపారు. గురువారం ఉదయం గురునానక్ నగర్ లోని ఎం.పి కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయం ఎన్టీఆర్ …
Read More »Monthly Archives: January 2026
ఆదరణ 3.0లో టైలర్లకు ప్రాధాన్యం
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తాడేపల్లి/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న ఆదరణ 3.0 పథకంలో టైలర్లకు ప్రాధాన్యమిస్తామని, ఆధునిక కుట్టు మిషన్లు అందజేయనున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. టైలర్ల సంక్షేమానికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను ఏపీ టైలర్ల ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యల పరిష్కారానికి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా …
Read More »ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్
-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గానికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ -1,03,534 కుటుంబాలకు లబ్ధి -మగ్గం వాడే నేతన్నలకు నెలకు రూ.720లు, ఏడాదికి రూ.8,640లు ఆదా -మరమగ్గం చేనేతలకు నెలకు రూ.1800లు, ఏడాదికి రూ.21,600లు లబ్ధి -ప్రభుత్వంపై ఏడాదికి రూ.85 కోట్లకు పైగా భారం -నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పనే కూటమి లక్ష్యం -కల్తీకి కేరాఫ్ అడ్రాస్ జగన్ -తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందని తేల్చిన సుప్రీంకోర్టు సిట్ -పామాయిల్, ఇతర కెమికల్స్ వాడినట్లు …
Read More »నగరంలో ‘హయాత్ డెంటల్ క్లినిక్’ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘హయాత్ డెంటల్ క్లినిక్’ ను 28వ డివిజన్ కార్పొరేటర్ వీరమాచనేని లలిత కిషోర్ ఘనంగా ప్రారంభించారు. గురువారం సాంబమూర్తి రోడ్డు, దుర్గాపురం వాకర్స్ క్లబ్ ఎదురుగా వున్న ‘హయాత్ డెంటల్ క్లినిక్’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా కె.బి. హాస్పిటల్స్ చైర్మన్ అయిన డాక్టర్ మునీర్, త్రిపుర హాస్పిటల్స్ ఎం.డి. డాక్టర్ రబియా బస్రీ విచ్చేశారు. ఈ సందర్భంగా లలిత కిషోర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన డెంటల్ క్లినిక్ ప్రారంభం కావడం ఎంతో …
Read More »ఎన్. హెచ్ ఎం. కింద జిల్లాలకు రూ.128.43 కోట్లు విడుదల
-ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కలిపి జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా రూ.128.43 కోట్లను వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది వీటిని వచ్చే నెల 20వ తేదీ నాటికి ఖర్చు పెట్టాలని స్పష్టంచేసింది. గరిష్టంగా గుంటూరు జిల్లాకు రూ.26.1 కోట్లు, నెల్లూరు జిల్లాకు రూ.8.60 కోట్లు, కృష్ణా జిల్లాకు రూ.6.21 కోట్ల చొప్పున ఎన్హెచ్ఎం బడ్జెట్లో చివరి విడత కింద (2025-26) విడుదల చేసినట్లు ఆరోగ్య, కుటుంబ …
Read More »పాఠశాల విద్య నుంచే విద్యార్థులకు ఆరోగ్య సూత్రాలు బోధించాలి…
-ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు -ఆరోగ్యాలయాన్ని సందర్శించిన వైద్యాధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఆరోగ్య సూత్రాలు బోధించేలా చర్యలు తీసుకోవాలని యోగా- నేచురోపతి రాష్ట్ర ప్రభుత్వ సలహదారు మంతెన సత్యనారాయణ రాజు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అమరావతిలో కరకట్టపై ఉన్న మంతెన సత్యనారాయణ ఆరోగ్యాలయాన్ని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు …
Read More »బండ్ల గణేష్ కు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రశంస
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సినీ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన పాదయాత్రను ప్రశంసించారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టైన సందర్భంలో, ఆయన విడుదలై రాష్ట్రం మళ్లీ శుభపథంలో నడిస్తే పాదయాత్ర చేస్తానని ముక్కోటి దేవుని సాక్షిగా మొక్కుకున్న బండ్ల గణేష్ తన మాటకు కట్టుబడి ఈ పాదయాత్రను ప్రారంభించారని మంత్రి గుర్తుచేశారు. ఫోన్లో బండ్ల గణేష్ తో మాట్లాడారు. “మీరు కోరుకున్నట్టుగానే నేడు రాష్ట్రం శుభపథంలో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు …
Read More »నెయ్యి కల్తీ చేసిన కుట్రదారులను వదిలేదే లేదు
– కలియుగ దైవం పవిత్రత దెబ్బతీసేలా జగన్ రెడ్డి కుట్రలు చేశాడు – పాలు సేకరించకుండా నెయ్యి ఎక్కడి నుండి తెచ్చారు – హైందవ సంప్రదాయాలను అవమానించిన జగన్ రెడ్డిని ప్రజలు క్షమించరు – తప్పు చేసినోళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఒక్క లీటర్ పాలు సేకరించి కంపెనీ 60లక్షల లీటర్ల నెయ్యి ఏ విధంగా టీటీడీకి సరఫరా చేసిందో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు …
Read More »రాష్ట్రంలో అక్రమ మద్యంపై ఉక్కుపాదం
– గతంలో సొంత ఆదాయం కోసం ఎక్సైజ్ వ్యవస్థను నాశనం చేశారు – కల్తీ మద్యంతో ప్రజల జీవితాలు నాశనం చేశారు – నవోదయంతో సారా రహిత రాష్ట్రంగా ఏపీని మార్చాం – ఏపీ ఎక్సైజ్ వ్యవస్థను దేశానికి ఆదర్శంగా మారుద్దామని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ఐదేళ్ల పాలనలో అస్తవ్యస్తంగా మారిన ఎక్సైజ్ శాఖను మళ్లీ గాడిలో పెట్టమని, రాష్ట్ర ప్రజల సంక్షేమం ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు …
Read More »శ్రీకృష్ణ మందిరంలో ఆలయ పరిసరాలను శుభ్రం చేసిన యేదుపాటి రామయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఈరోజు భవానీ పురం పరిధిలోని శ్రీకృష్ణ మందిరంలో ఆలయ పరిసరాలను శుభ్రం చేసి, ఆలయ శుద్ధి అనంతరం పూజా కార్యక్రమం నిర్వహించిన క్లస్టర్ ఇంచార్జి యేదుపాటి రామయ్య, కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రామయ్య మాట్లాడుతూగత ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానము లో కల్తీ లడ్డు వల్ల ఆలయ ప్రతిష్ట ను బ్రష్టు పట్టించారనీ ప్రపంచ దేశాలలో కలియుగ దైవము …
Read More »
Prajavartha Online Telugu News