Breaking News

Monthly Archives: January 2026

ఏ పథకాలను అమలు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలి… : నాగేంద్ర నాయక్ చౌహన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేసిందని వైసీపీ ఎస్టీ సెల్ స్టేట్ సెక్రటరీ నాగేంద్ర నాయక్ చౌహాన్, ఆరోపణలు చేశారు. 18 నెలల కాలంలో ఏ ఏ పథకాలను అమలు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైసిపి ఎస్టీ సెల్ స్టేట్ సెక్రటరీ నాగేంద్ర నాయక్ చౌహన్ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన …

Read More »

సంక్రాంతి సంబరాలు – క్రీడలతో సంప్రదాయ వేడుకలు పోస్టర్‌ను ఆవిష్కరన

-పోస్టర్‌ను ఆవిష్కరించిన శాప్ ఛైర్మన్ రవినాయుడు  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో జనవరి 10 నుండి 12వ తేదీ వరకు నిర్వహించనున్న “సంక్రాంతి సంబరాలు – క్రీడలతో సంప్రదాయ వేడుకలు” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను శాప్ ఛైర్మన్ రవినాయుడు ఈ రోజు విజయవాడ ఐజీఎంసీ స్టేడియంలోని శాప్ ఛైర్మన్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ, తెలుగు వారి సంప్రదాయ పండుగ అయిన సంక్రాంతికి క్రీడలతో విడదీయరాని అనుబంధం ఉందని పేర్కొన్నారు. గ్రామీణ …

Read More »

ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఫిబ్రవరి 5వ తేది “ఛలో ఢిల్లీ”ని విజయవంతం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ స్థాయిలో 7 ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు అఖిల భారత జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్ (AIJACTO) గా ఏర్పడి దీని ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికై “ఛలో ఢిల్లీ” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని AIJACTO జాతీయ స్టీరింగ్ కమిటీ సభ్యులు, ఎఐఎస్ ఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తి నరసింహారెడ్డి, యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు, ఎస్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.సాయి శ్రీనివాస్, ఆష్టా ప్రధాన కార్యదర్శి ఎం.జి. …

Read More »

అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య విద్యను సామాన్యులకు చేరువ చేయడమే లక్ష్యం

-వైద్య విద్య లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ హెల్త్ కేర్, సాంకేతికత జోడింపు -గుజరాత్ లో పీపీపీ మోడల్ విధానం వైద్య విద్య విజయవంతం -జాతీయ వైద్య కమిషన్ (NMC) చైర్మన్ డాక్టర్ అభిజత్ చంద్రకాంత్ సేథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య విద్యను సామాన్యులకు చేరువ చేస్తూనే, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే జాతీయ వైద్య కమిషన్ (NMC) లక్ష్యమని కమిషన్ చైర్మన్ డాక్టర్ అభిజత్ చంద్రకాంత్ సేథ్ తెలిపారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రాంగణంలోని సమావేశ …

Read More »

మాతా, శిశు మ‌ర‌ణాలు న‌మోదు కాకుండా ప‌టిష్ట చ‌ర్య‌లు

– వైద్య, ఇత‌ర సేవ‌ల్లో నిబ‌ద్ధ‌తే నిండు ప్రాణాల‌ను కాపాడుతుంది – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మాతృ, శిశు మ‌ర‌ణాలు సంభ‌వించ‌కుండా ఆశా కార్య‌క‌ర్త నుంచి వైద్యాధికారి వ‌ర‌కు ప్ర‌తిఒక్క‌రూ నిబ‌ద్ధ‌త‌తో, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో సేవ‌లందించాల‌ని, ఇలా అందించే సేవ‌లే నిండు ప్రాణాల‌ను కాపాడుతాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. బుధ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో మాతృ, శిశు మ‌ర‌ణాల ప‌ర్య‌వేక్ష‌ణ‌, ప్ర‌తిస్పంద‌న క‌మిటీ స‌మీక్షా స‌మావేశం …

Read More »

ఆర్‌టీఐహెచ్ విజయవాడ – నలందా డిగ్రీ కళాశాలతో అవగాహన ఒప్పందం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH), విజయవాడ, జనవరి 7, 2026న విజయవాడ, ఎనికేపాడు లోని ఆర్‌టీఐహెచ్ కార్యాలయంలో నలందా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కు చెందిన నలందా డిగ్రీ కళాశాలతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఆర్‌టీఐహెచ్ సీఈవో జి. కృష్ణన్ మరియు పార్ట్‌నర్‌షిప్స్ హెడ్ నందన్ టాండి ఆర్‌టీఐహెచ్ లక్ష్యాలు, కార్యక్రమాలు, కార్యకలాపాల గురించి వివరించారు. అలాగే ముఖ్యమంత్రి “ఒక కుటుంబం – ఒక వ్యాపారవేత్త (One Family – One Entrepreneur)” అనే …

Read More »

కోడి పందేలు నిర్వ‌హిస్తే క‌ఠిన చ‌ర్య‌లు..

– చ‌ట్టాల‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించాలి – సంయుక్త బృందాలు విస్తృత త‌నిఖీలు నిర్వ‌హించాలి – గ్రామ‌, మండ‌ల‌, డివిజ‌న్ స్థాయి క‌మిటీలు అప్ర‌మ‌త్తంగా ఉండాలి – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండ‌గ సంద‌ర్భంగా ఎక్క‌డైనా కోడి పందేలు నిర్వ‌హిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని, చ‌ట్టాల‌పై గ్రామాలు మొద‌లు జిల్లాస్థాయి వ‌ర‌కు ప్ర‌త్యేక అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ పేర్కొన్నారు. బుధ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధ్య‌క్ష‌త‌న క‌లెక్ట‌రేట్ శ్రీ …

Read More »

పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో నల్లపాడు రోడ్ లో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి డ్వాక్రా బజార్ (సరస్) కి ఈ నెల 8వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి రానున్నందున సదరు పర్యటన మార్గంలో జిఎంసి నుండి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు ఇప్పటికే పూర్తీ చేశామని, పర్యటన ముగిసే వరకు విధులు కేటాయించబడిన అధికారులు, సచివాలయ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. బుధవారం కలెక్టర్ బంగ్లా రోడ్, జిటి రోడ్, చుట్టగుంట నుండి నల్లపాడు …

Read More »

అన్నక్యాంటీన్లల్లో ఆహార సరఫరాకి నిర్దేశిత సమయాన్ని పాటించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లల్లో ఆహార సరఫరాకి నిర్దేశిత సమయాన్ని పాటించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అక్షయ పాత్ర సిబ్బందిని ఆదేశించారు. బుధవారం మిర్చి యార్డ్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో నాణ్యమైన, రుచికరమైన ఆహారం కేవలం రూ.5 అందించడంపై పేద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. క్యాంటీన్లలో సమయపాలన పాటించాలన్నారు. ఆహారం అందించే పాత్రలు, ప్లేట్ …

Read More »

గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం..

-మచిలీపట్నంలో రూ. 39 కోట్ల విలువైన రహదారుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి -రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి పలు రహదారుల అభివృద్ధికి శంకుస్థాపనలు చేసిన మంత్రి కాలేఖాన్ పేట/చిన్నాపురం(మచిలీపట్నం), నేటి పత్రిక ప్రజావార్త : గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి …

Read More »