-గిరిజన బాలిక, ఆమె సోదరుడి కోసం రూ.1 లక్ష ఫిక్స్డ్ డిపాజిట్ ప్రకటించిన కలెక్టర్ – పోలీస్ శాఖ తరఫున రూ.10 వేల నగదు సహాయం, నూతన వస్త్రాల పంపిణీ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన బాలికకు భరోసా కల్పిస్తూ ఆమె భవిష్యత్తుకు అండగా నిలిచిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఐఏఎస్., మరియు జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు మానవతా దృక్పథంతో సహాయం అందించారు. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం పెద్ద ఊరంపాడు గ్రామానికి …
Read More »Daily Archives: March 10, 2026
రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు
-ఎప్పటికప్పుడు సరఫరాను పర్యవేక్షిస్తున్నాం -గృహ వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా చూసుకుంటాం -గ్యాస్ బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా నిఘా బృందాలు -అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గ్యాస్ సరఫరాపై ఉన్నతాధికారులతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు. ప్రజలెవరూ దీనిపై అనవసరమైన ఆందోళనకి గురి కావాల్సిన అవసరం లేద’ని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గృహ అవసరాలకు, వాణిజ్య …
Read More »తెలుగు వైభవాన్ని చాటేలా అమరావతి అభివృద్ధి
-సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులపై దృష్టి సారించండి -క్రీడలు, పర్యాటకానికి పెద్ద పీట వేసేలా ప్రణాళికలు -పెట్టుబడులు పెట్టడానికి వచ్చే సంస్థలతో నిరంతరం సంప్రదింపులు -59వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు -భూ కేటాయింపులు సహా వివిధ ప్రతిపాదనలకు సీఆర్డీఏ అథార్టీ ఆమోదం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటేలా… భావితరాలకు అందించేలా అమరావతిని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధానిలో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులను చేపట్టేలా అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. …
Read More »ఆంధ్రప్రదేశ్లో పంట ఉత్పాదకత, రైతు సంక్షేమంపై వివరాలు కోరిన ఎంపీ గురుమూర్తి
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయం, రైతుల సంక్షేమానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పంటల ఉత్పాదకత పెంపు అంశంపై తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి లోక్సభలో ప్రశ్నించారు. వరి వంటి ప్రధాన పంటల దిగుబడులు జాతీయ సగటుతో పోలిస్తే తక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక పంట ఉత్పాదకత వ్యూహం రూపొందించిందా అని కేంద్రాన్ని అడిగారు. అలాగే జిల్లాల వారీగా దిగుబడి లోటుపాట్లపై అంచనాలు చేసి వాటిని రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకున్నారా, సూక్ష్మ సాగు విధానాలు, మెరుగైన విత్తనాల వినియోగం, వ్యవసాయ సలహా …
Read More »పన్నులను సకాలంలో చెల్లించాలి …
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పరిధిలో దీర్ఘ కాలంగా ఆస్తి పన్ను చెల్లించని వారి నివాస గృహాలు మరియు వ్యాపార సంస్థలకు సంబంధించి రెవెన్యూ సిబ్బంది సుమారు 36 నీటి కుళాయి కనెక్షన్లను తొలగించారని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పన్ను బకాయిలపై ఇప్పటికే నోటీసులు, స్లిప్స్ పంపిణీ, మెసేజ్ లు పంపి అవగాహన కల్గించినా కొందరు చెల్లించడంలేదన్నారు. ఆస్తి పన్ను, నీటి కుళాయి పన్న, వాటర్ మీటర్ …
Read More »52 శాతంకి పైగా మ్యాపింగ్ జరిగింది…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా ఎలక్ట్రోల్ మ్యాపింగ్ 95 గుంటూరు తూర్పు, 94 పశ్చిమ నియోజకవర్గాల్లో 52 శాతంకి పైగా మ్యాపింగ్ జరిగిందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఏఈఆర్ఓ, డిప్యూటీ కమిషనర్ సిహెచ్. శ్రీనివాస్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. మంగళవారం జిఎంసి ప్రధాన కార్యాలయంలోని డిప్యూటీ కమిషనర్ చాంబర్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ …
Read More »అభివృద్ధి పనుల ప్రక్రియను వేగవంతం చేయడానికి ఏపిఇట్కో డిపిఆర్ ని త్వరగా సిద్దం చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నల్లపాడు తెలగమాంబ చెరువు అభివృద్ధి పనుల ప్రక్రియను వేగవంతం చేయడానికి ఏపిఇట్కో డిపిఆర్ ని త్వరగా సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ అండ్ టెక్నికల్ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్ లిమిటెడ్ (ఏపిఇట్కో) ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, తెలగమాంబ చెరువు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, అందులో …
Read More »గుంటూరు నగరపాలక సంస్థకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ర్యాగ్ పికర్స్ కి ఆర్ధికంగా అండగా నిలవడంలో గుంటూరు నగరపాలక సంస్థకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని, దేశ ప్రధాని నరేంద్ర మోడీకి అందించే వీడియో రిపోర్ట్ కోసం కేంద్ర బృందం మంగళవారం నగరంలోని బొంగరాలబీడు, బాలాజీ నగర్ ప్రాంతాల్లోని ర్యాగ్ పికర్స్ అనుభవాలు, అభిప్రాయాలని రికార్డ్ చేసిందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ర్యాగ్ పికర్స్ ని కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ …
Read More »జీవో 96 ను పునరావృతం చేసి మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎమ్ టి ఎస్ ను వర్తింప చేయాలి…
-జేఏసీ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ & ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ )నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం లో భాగంగా విజయవాడ వేదికగా గులాముద్దీన్ నగర్ రిజర్వాయర్ ట్యాంక్ వద్ద ఈరోజు ఉదయం నూతన JAC కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ చైర్మన్ పిట్టా మహేష్ బాబు, కార్యదర్శి ఆర్ సత్యము ,కోశాధికారి షేక్ కరీముల్లా మరియు రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం …
Read More »ప్రతి ఇంట్లో సూర్యఘర్ వెలుగులు నింపుదాం..
– పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజల్లో అవగాహన పెంచాలి – సూర్యాంధ్ర ప్రగతి శకటాల ద్వారా జనజాగృతికి శ్రీకారం – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సౌరశక్తి వినియోగంపై ప్రజలను ప్రోత్సహిస్తూ ప్రతి ఇంట్లో సూర్యఘర్ వెలుగులు నింపుదామని.. పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సూర్యాంధ్ర ప్రగతి శకటాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈఎఫ్ఐ) – …
Read More »
Prajavartha Online Telugu News