మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలందరికి చేరువ చేసి వారు ప్రయోజనం పొందేలా కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర రాజధాని అమరావతిలోని రాష్ట్ర సచివాలయం 5 వ బ్లాక్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన 6 వ కలెక్టర్ల సదస్సు లో రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, శాఖలధిపతులు, కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే …
Read More »Daily Archives: March 11, 2026
ఈ నెల 13న కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
-సూరంపల్లి వేదికగా ‘అన్నదాత సుఖీభవ’ మూడో విడత నిధులను విడుదల చేయనున్న సీఎం -సూరంపల్లిలో సభా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మరియు జిల్లా అధికారులు గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 13వ తేదీన కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత నిధులను పీఎం – కిసాన్ నిధులతో కలిపి గన్నవరం మండలం సూరంపల్లి గ్రామం నుండి విడుదల చేయనున్నారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను …
Read More »లోక్సభ స్పీకర్పై తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాం : వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : పార్లమెంటులో లోక్సభ స్పీకర్పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్సభలో స్పష్టం చేశారు. సభలో మాట్లాడుతూ స్పీకర్ పదవికి, పార్లమెంటు సంప్రదాయాలకు ఉన్న గౌరవాన్ని కాపాడటం కోసమే తమ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. తమ పార్టీ ఏ కూటమికీ చెందినది కాదని, తాము ఎన్డీయే కూటమిలోనూ లేమని, ఇండియా కూటమిలోనూ లేమని ఆయన పేర్కొన్నారు. సభ గౌరవం, స్పీకర్ స్థానం పరిరక్షణ …
Read More »తిరుపతి ప్రాంతాన్ని అరుదైన ఖనిజ కారిడార్లో చేర్చాలని ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : అరుదైన ఖనిజాల అభివృద్ధి, వాటి ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించే అంశంపై తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి లోక్సభలో ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో అరుదైన ఖనిజాల కారిడార్ల ఏర్పాటు, తిరుపతి ప్రాంతాన్ని కూడా అందులో చేర్చే అవకాశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన వివరాలు కోరారు. ఈ ప్రశ్నకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు శాఖతో పాటు ప్రధాన మంత్రి కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానం ఇచ్చారు. కేంద్ర బడ్జెట్ 2026–27లో …
Read More »ఎయిర్ ఫోర్స్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీకి భారీ స్పందన
-12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురుష అభ్యర్థులకు -15న తెలంగాణ రాష్ట్ర పురుష అభ్యర్థులకు -నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగంలో ఎంపిక -కనీస ఎత్తు 152 సెం.మీ. (స్త్రీ మరియు పురుషులు) -ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత లేదా 3 సంవత్సరాల డిప్లొమా ఇంజనీరింగ్ లేదా 2 సంవత్సరాల ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణత కలిగి ఉండాలి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగంలో జరుగుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీకి భారీ స్పందన వస్తుందని …
Read More »అగ్ని ప్రమాద స్థలిని పరిశీలించిన ఏడీసీ సీఎండీ: డి. లక్ష్మీపార్థసారథి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతి పరిధిలో ఉద్ధండరాయునిపాలెం గ్రామం వద్ద సీడ్యాక్సెస్ రోడ్డుకు దగ్గరలో ఉన్న ఎల్ అండ్ టి క్యాంపు కార్యాలయం వద్ద గల స్టాక్ పాయింట్ లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ఛైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి డి.లక్ష్మీపార్థసారథి వారు పరిశీలించారు. అగ్నిమాపక అధికారి పి. వెంకట రమణ ప్రమాద పరిస్థితిని వివరించారు. అమరావతి నిర్మాణ పనులకు గుత్తేదారు నిల్వ చేసుకున్న భూగర్భ విద్యుత్తు పైపులు అగ్నికి ఆహుతైనట్లు …
Read More »స్వచ్ఛ సర్వేక్షణ్ 2024లో సాధించిన విజయాలను కొనసాగిస్తూ ప్రతి ఒక్కరూ భాద్యత తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చ సర్వేక్షణ్ లో ర్యాంక్ కోసం కృషి చేయడం అంటే నగరాన్ని క్లీన్, హెల్తీ నగరంగా తీర్చిదిద్దుకోవడమేనని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్రలో భాగంగా సాహస్, వాష్ స్వచ్చంద సంస్థలు బుధవారం గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లోని డిఆర్ఎం కన్వెన్షన్ హాల్లో ప్రజారోగ్య విభాగ కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఎస్ లకు ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో కమిషనర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరపాలక …
Read More »నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పారిశుధ్య పనులను పరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లు, డ్రెయిన్ల లో చెత్త వేస్తె భారీ ఫైన్ తప్పదని, గుర్తించిన ప్రాంతాల్లో 24 గంటల పర్యవేక్షణకు ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. బుధవారం యాదవ బజార్, అలీ నగర్, మల్లయ్య లింగం నగర్, పాత గుంటూరు మెయిన్ రోడ్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిఎంసి ప్రజారోగ్య కార్మికులు ఇంటింటి చెత్త …
Read More »జక్కంపూడి ZP హై స్కూల్ వారికి ఐరన్ రాక్స్ మరియు సౌండ్ సిస్టమ్ డొనేట్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , విజయవాడ జోనల్ మరియు రీజినల్ ఆఫీసెస్ నుండి ఎంపవర్ హర్ అండ్ పవర్ హిం కమిటీ వారు సంయుక్తంగా , CSR యాక్టివిటీ లో భాగంగా ఈ రోజు జక్కంపూడి ZP హై స్కూల్ నందు వారికి కావసిన ఐరన్ రాక్స్ మరియు సౌండ్ సిస్టమ్ ను డొనేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జోనల్ హెడ్ M.V.N రవి శంకర్, AGM దాస్యం శ్రీనివాస్, …
Read More »వడదెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలి
-వైద్య ఆరోగ్య సిబ్బంది సూచనలను పాటించండి -డీఎంహెచ్వో డా. ఎం.సుహాసిని విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా వడదెబ్బ తగలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. వైద్య ఆరోగ్య సిబ్బంది చేసిన సూచనలు పాటించాలని డీఎంహెచ్వో డా. ఎం.సుహాసిని సూచించారు. ఈ మేరకు బుధవారం ఆమె ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ వారి సూచనల మేరకు వేసవికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా తగిన ఏర్పాట్లు చేశామని.. ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య …
Read More »
Prajavartha Online Telugu News