Breaking News

Tag Archives: mangalagiri

ఇంటర్నేషనల్ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడికి మంత్రి నారా లోకేష్ ఆర్థిక సహాయం

-అస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పాల్గొనేందుకు ఫ్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో రూ. 3 లక్షల అందజేత -మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపిన కేళావత్ చరణ్ నాయక్ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి తన దాతృత్యాన్ని చాటుకున్నారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఇంటర్నేషనల్ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కేళావత్ చరణ్ నాయక్ అస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరగనున్న ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ షటిల్ బ్యాండ్మింటన్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు మంత్రి నారా లోకేష్ రూ.3 లక్షలు …

Read More »

రైతులకు పూర్తి స్థాయి భరోసా కల్పించండి

-బుడితి రాజశేఖర్ ఐఏఎస్ , ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ( వ్య & స) వ్యవసాయ అధికారులు జిల్లా పాలన యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ రైతులకు క్షేత్ర స్థాయిలో అందుబాటులో వుండండి . -S.డిల్లీ రావు , ఐఏఎస్,వ్యవసాయ సంచాలకులు ,ఆంధ్రప్రదేశ్ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : ది. 01/09/2024 ఆదివారం న రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు , ఐఏఎస్ వారు ,రాష్ట్రములోని అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు మరియు అనుబంధ శాఖల అధిపతులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు .తుఫాను రాష్ట్ర తీరం …

Read More »

ఎయిమ్స్ లో నూతనంగా ప్రవేశపెట్టిన పలు సేవలకు ప్రారంభోత్సవం

-మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి ద్వారా ప్రజలకు పూర్తిస్థాయి సేవలకు త్వరితగతిన చర్యలు : కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలందించేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర అధికారులకు సూచించారు. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిని సోమవారం సందర్శించిన ఆయన ఎయిమ్స్ పదవ స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో …

Read More »

ఎంసిసిడి సిఆర్ఎస్ విధానాన్ని ప్రామాణీకరించాలి

-వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : .పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మరణాలకు గల కారణాల్ని తెలియజెప్పే వైద్య ధృవీకరణ పథకాన్ని(Medical Certification of Cause of Death-MCCD Scheme), జనన మరణాల్ని నమోదు చేసే సివిల్ రిజిస్ట్రేషన్ విధానం(CRS)తో అనుసంధానం చేయడమే కాకుండా ప్రామాణీకరిం చాల్సిన(Standardize) అవసరం కూడా ఉందని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి. కృష్ణబాబు అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించి రిజిస్ట్రార్ జనరల్ ఇప్పటికే మార్గదర్శకాల్ని …

Read More »

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం

-కేసలి అప్పారావు మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములోని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 – 18 సం.లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వం జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోందని ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. సామాజిక సేవ,సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణం, విద్య, ధైర్య సాహసాలు, క్రీడలు, కళలు సాహిత్యం, సంస్కృతి, సంగీతం,నృత్యం,పెయింటింగ్, నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాలు,నాయకత్వ లక్షణాలు మొదలగు వాటిలో రాష్ట్ర జాతీయ మరియు …

Read More »

లోక్ అదాలత్ లో పెద్ద ఎత్తున కేసుల పరిష్కారం: డి‌జి‌పి రాజేంద్ర నాథ్ రెడ్డి

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా న్యాయస్థానం ఏర్పాటు చేసిన 386 ప్రత్యేక బెంచ్ ల ద్వారా జరిగిన లోక్ అదాలత్ లో పోలీస్ శాఖకు సంభందించి మొత్తం 1,22,146 కేసులను పరిష్కరించడం జరిగింది. అందులో 19,150(UnderInvestigation cases-7970. PendingTrail cases-11180) కంపౌండబుల్ IPC కేసులు (భూమి, ఆస్తి, హక్కులపై వివాదాలు,చిన్న నష్టాలు, గాయాలు, చిన్న దొంగతనాలు, దోపిడీలు, సాదారణ స్థాయిలో హింస).వంటి కేసులు కాగా ఐ‌పి‌సి కాని …

Read More »

జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా లక్ష మంది పేదలకు రిఫరల్ సేవలు

-జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న ప్రజలు -ముఖ్యమంత్రి ఆశయానికనుగుణంగా పగడ్బందీగా జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల నిర్వహణ -45 రోజుల పాటు ఆరోగ్యశ్రీ పై స్పెషల్ డ్రైవ్ -పెద్ద ఎత్తున ఆరోగ్యశ్రీ యాప్ల డౌన్లోడ్ కు చర్యలు -వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలకు ఇప్పటి వరకు 55 లక్షల మంది ఓపీకి రాగా , వీరిలో దాదాపు లక్ష మందికి …

Read More »

మంగళగిరిలో అమరావతి ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రాజధాని ముఖద్వారంగా ఉన్న మంగళగిరి నగరంలో అమరావతి ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం ఆదివారం ఉదయం జరిగింది. స్థానిక అంబేద్కర్ విగ్రహం సెంటర్ కు సమీపంలోని మండలపరిషత్ కార్యాలయం ఎదుట జ్యోతి ఎలక్ట్రానిక్స్ పైన సెకండ్ ఫ్లోర్ (పాత సిటీకేబుల్ ఆఫీసు)లో అమరావతి ప్రెస్ క్లబ్ ను ముఖ్యఅతిథిగా హాజరైన సీనియర్ పాత్రికేయులు చెవుల కృష్ణాంజనేయులు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉండే జర్నలిస్టులకు సంబంధించి ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్, హెల్త్ కార్డులు …

Read More »

న్యూరో క్రిటికల్ కేర్ చికిత్సల్లో విప్లవాత్మకం ‘గోల్డెన్ అవర్’

– తొలి గంటలో చికిత్సనందిస్తే మెరుగైన ఫలితాలు – ‘గోల్డెన్ అవర్’ను సద్వినియోగం చేసుకునేలా వరుణ్ కార్డియాక్ అండ్ న్యూరో సైన్సెస్ లో ప్రత్యేక విభాగం – ప్రఖ్యాత న్యూరో సర్జన్ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ సారథ్యంలో ‘గోల్డెన్ అవర్’ – గోల్డెన్ అవర్ బ్రోచర్లను ఆవిష్కరించిన వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు – ఈనెల 13న గోల్డెన్ అవర్ గ్లోబల్ ప్రోగ్రాం ఆవిష్కరణ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : “పక్షవాతానికి గురైన వారికి చికిత్స అందించడంలోనూ, ప్రమాదాల్లో …

Read More »

ఎన్నో అవార్డులు పొందినా.. ఈ అవార్డు మిన్న‌…!

-తెలుగు క‌ళా స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మాదిరెడ్డి కొండారెడ్డి మంగ‌ళ‌గిరి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం కాని రాష్ట్రం ముంబ‌య్‌లో క‌రోనా స‌మ‌యంలో తెలుగు వారికి ఆప‌ద్భాంధ‌వుడిగా ముంబ‌య్‌లో ఆహారం, వ‌స‌తి, ప్ర‌యాణం వంటి అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను అందించిన మాన‌వ‌తావాది మాదిరెడ్డి కొండారెడ్డి. ఇటువంటి వ్య‌క్తుల సేవ‌ల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తి ఏటా ఉగాది సంద‌ర్భంగా అందించే పుర‌స్కారాల‌లో అత్యంత ప్ర‌భావ‌వంత‌మైన సేవా రంగంలో మాదిరెడ్డి కొండారెడ్డికి గుర్తింపు క‌ల్పించింది. ఈ సంద‌ర్భంగా మాదిరెడ్డి కొండారెడ్డి త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. ఈ …

Read More »