“ఆర్ డి టి పై జరుగుతున్న కుట్రలు ప్రజా సంక్షేమంపై దాడులు” – దాసరి సువర్ణ రాజు
రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్ డి టి ) డికేడ్స్ పాటు గ్రామీణ ప్రజల అభివృద్ధికి, బలహీన వర్గాల సుస్థిర జీవితానికి ఆశాజ్యోతి వలె నిలిచింది. కానీ ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా సేవా సంస్థలపై ప్రణాళికాబద్ధమైన దాడుల భాగంగా, ఆర్ డి టి పై జరుగుతున్న కుట్రలు అత్యంత విచారకరం.
ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ రద్దు, నకిలీ ఆరోపణలు, మత మార్పిడి పేరిట వ్యాపిస్తున్న తప్పుడు ప్రచారం
ఆర్ డి టి
గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రులు, మొబైల్ హెల్త్ యూనిట్లు, దివ్యాంగులకు ఆపరేషన్లు.
విద్య పాఠశాలలు, హోస్టళ్లు, దివ్యాంగులకు ప్రత్యేక విద్యా పథకాలు.
మహిళా సంఘాలు, ఉపాధి కార్యక్రమాలు.
స్వయం ఉపాధి నిధులు, రైతులకు సహకారం.
కుల, మత, వర్గ భేదం లేకుండా సేవలు – ఇది భారత రాజ్యాంగ సిద్ధాంతాలకే అంకితభావం
సేవా రంగాన్ని రాజకీయంగా వాడుకునే వారు, నిస్వార్థంగా పని చేసే సంస్థలను భయపెడతారు.
ప్రభుత్వాలపై ప్రజల్లో అసంతృప్తిని తగ్గించేందుకు, సేవా సంస్థలపై మళ్లించడం.
అంతర్జాతీయ నిధులపై నియంత్రణ పెంచే ప్రయత్నం.
ఏపీ ఎం అర్ పి ఎస్ తరఫున మా డిమాండ్లు:
ఆర్ డి టి లైసెన్స్ పునరుద్ధరించాలి.
సేవా సంస్థలపై కుట్రలు కొనసాగితే, వాటిని ప్రజా ఉద్యమంగా ఎదిరించేందుకు సిద్ధంగా ఉంటాం.
కేంద్ర ప్రభుత్వాన్ని, న్యాయవ్యవస్థను న్యాయంగా కలవాలని మద్దతుదారులను కోరుతున్నాం.
ఆర్ డి టి సేవలకు ప్రజల మద్దతు మరోసారి వినిపించాలి.
ప్రజలందరికీ నా పిలుపు:
“ఈ దేశం సేవా సంస్కృతి మీద నిలబడింది. అలాంటి సంస్థలను రక్షించడం మన బాధ్యత.”
“ఆర్ డి టి ను టార్గెట్ చేయడం వెనుక ఉన్న కుట్రలను ఎత్తిచూపే బాధ్యత ఏపీ ఎం అర్ పి ఎస్ తీసుకుంటుంది.”
“మనం మౌనంగా ఉంటే, రేపటి సేవా ఉద్యమాలన్నీ శబ్దం కోల్పోతాయి.”
దాసరి సువర్ణ రాజు
ఆంధ్ర ప్రదేశ్ మాదిగ రిజర్వషన్ పోరాట సమితి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు
ఈ కార్యక్రమంలో ఎం ఈ ఎఫ్ అధ్యక్షులు ఉండుర్తి సుబ్బారావు వేగూరు విజయ్ కుమార్ యల పల్లి శ్రీనివాస్ పొలిమేర కిరణ్ తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News