Breaking News

ఈ నెల 31 వరకే వడ్డీ రాయితీ గడువు…కమిషనర్ కీర్తి చేకూరి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం పన్ను బకాయి అంతా ఏక మొత్తంగా చెల్లించిన వారికి కల్పించిన వడ్డీ రాయితీ గడువు ఈ నెలాఖరు వరకే ఉందని, పన్ను బకాయిదార్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఏప్రిల్ 1 నుండి పన్ను పై వడ్డీ జమ అవుతుందని నగర కమిషనర్ కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పన్ను బకాయి అంతా ఏక మొత్తంగా చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ప్రకటించిందని, నగర పజలు ఈ నెలాఖరులోపు తమ ఆస్తి, ఖాళీ స్థల పన్నులు పూర్తిగా చెల్లించి వడ్డీ రాయితిని పొందాలని తెలిపారు. నెలాఖరు వరకు వేచి చూడకుండా ముందుగానే పన్ను చెల్లించాలని, నెలాఖరులో సర్వర్ లో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్నారు. ఏప్రిల్ 1 నుండి పన్ను పై వడ్డీ యధావిధిగా జమ అవుతుందని, బకాయిదార్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేశామని తెలిపారు. పన్ను చెల్లింపుదార్లకు వీలుగా సెలవు రోజుల్లో కూడా జిఎంసి ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయంల్లోని క్యాష్ కౌంటర్లతో పాటుగా, భారత్ పేటలోని 140, పెద్ద పలకలూరు రోడ్ లోని 106, వసంతరాయపురం మెయిన్ రోడ్ లోని 148 వార్డ్ సచివాలయాల్లోని క్యాష్ కౌంటర్లు ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయన్నారు. కావున నగర పాలక సంస్థకు చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలం పన్ను, నీటి మీటర్ చార్జీలు, డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ లు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు.

Check Also

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలి

-ఐదేళ్లకు ఒక సారి జరిగే ప్రజాస్వామ్య వేడుకలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *