Breaking News

Tag Archives: guntur

త్రాగునీటి పైప్ లైన్ లీకు మరమత్తు పనులను నిర్దేశిత గడువుకి ముందే యుద్దప్రాతిపదికన పూర్తీ చేయాలి…

-కమిషనర్ మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని తక్కెళ్ళపాడు హెడ్ వాటర్ వర్క్స్ లో, బృందావన్ కాలనీ, శంకర్ విలాస్ సెంటర్ లో పంపింగ్ లైన్లపై ఏర్పడిన లీకుల మరమత్తు పనులను నిర్దేశిత గడువుకి ముందే అంటే శనివారం ఉదయంలోపే పూర్తి చేసి, త్రాగునీటి సరఫరాని పునరుద్దరించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వేసవిని దృష్ట్యా నగరంలో త్రాగునీటి సమస్య కొరత రాకుండా ఉండడానికి …

Read More »

ఏబీసి వేగవంతంపై సమీక్షా సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వీధి కుక్కలకు ఏబీసి, ఏఆర్వీలు వేగంగా జరుగుతున్నాయని, రోజువారీ చేసే ఏబీసిల సంఖ్య పెంచేందుకు అవసరమైన అదనపు సెంటర్ ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో ఎంహెచ్, విఏఎస్, స్నేహ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులతో ఏబీసి వేగవంతంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని వీధి కుక్కల దాడులపై ప్రజల భద్రతను …

Read More »

చలివేంద్రం ప్రారంభం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన నగర కమిషనర్ కే. మయూర్ అశోక్. శుక్రవారం జిఎంసి ప్రధాన కార్యాలయంలోని పార్కింగ్ వద్ద చలివెంద్రాన్ని కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సందర్శకులు, పన్ను చెల్లించడానికి వచ్చే ప్రజల దాహార్తి తీర్చేలా ప్రస్తుతం ఉన్న రెండు ఆర్.ఓ ప్లాంట్లకు అదనంగా చలివేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ క్రింద …

Read More »

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా ఎలక్ట్రోల్ మ్యాపింగ్ 95 గుంటూరు తూర్పు, 94 పశ్చిమ నియోజకవర్గాల్లో 60 శాతంకి పైగా మ్యాపింగ్ జరిగిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఏఈఆర్ఓ, డిప్యూటీ కమిషనర్ సాంబశివరావు రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. శుక్రవారం జిఎంసి ప్రధాన కార్యాలయంలోని డిప్యూటీ కమిషనర్ చాంబర్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ కేంద్రాల …

Read More »

ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లను పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరానికి తక్కెల్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ తర్వాత ప్రధానమైన త్రాగునీటి సరఫరా కేంద్రమైన సంగం జాగర్లమూడి పంపింగ్ పాయింట్ నుండి పూర్తి సామర్ధ్యంతో నగరానికి త్రాగునీటి సరఫరా జరిగేలా ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శుక్రవారం సంగంజాగర్లమూడిలోని జిఎంసి ఫిల్టరేషన్ పాయింట్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లోని ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత జాగర్లమూడి …

Read More »

హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గుంటూరు నగరాన్ని స్వచ్ఛమైన మరియు హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు గుంటూరు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతోందని, ఇందులో భాగంగా విద్యుత్ మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను (ఈ-వేస్ట్) శాస్త్రీయ పద్ధతిలో సేకరించి, పునర్వినియోగం చేసేందుకు ప్రత్యేక సేకరణ వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరాన్ని ఈ-వేస్ట్ రహిత నగరంగా తీర్చిదిద్దుకోవడంలో నగర ప్రజలు స్వచ్చందంగా పెద్ద …

Read More »

స్వీయ జన గణనలో వివరాలు నమోదు చేసుకున్న గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వీయ జనగణన కార్యక్రమంలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్, ప్రిన్స్ పల్ సెన్సెస్ అధికారి కె.మయూర్ అశోక్ తన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. హౌస్ లిస్టింగ్- హౌస్ సెన్సెస్ కార్యక్రమంలో భాగంగా ఆన్ లైన్ ద్వారా వివరాల నమోదు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. se.census.gov.in వెబ్ సైట్ ద్వారా కమిషనర్ వివరాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఏప్రిల్ 16 నుండి 30వ తేదీ వరకు ప్రజలకు స్వచ్చంద …

Read More »

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగ రూపకర్త, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని గుంటూరు నగర పాలక సంస్థ డిప్యుటీ కమిషనర్ సి.హెచ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని మీటింగ్ హాల్‌లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిప్యుటీ కమిషనర్ మాట్లాడుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతికి మరియు దేశంలో సామాజిక సమానత్వం …

Read More »

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ కె.మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 13వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »

నగరంలోకి వచ్చే ప్రధాన రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి పనులపై సమీక్ష

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర సమగ్ర కారిడార్ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రధాన రహదారుల అభివృద్ధి, చెరువుల పునరుద్ధరణ కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని, ప్రజా ప్రతినిధుల సూచనలు, సహకారంతో నగరాభివృద్ధిని వేగం చేస్తామని నగర కమిషనర్ కె,మయూర్ అశోక్ తెలిపారు. శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మహ్మద్ నసీర్, గల్లా మాధవిలతో కలిసి ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఏపీయుఐఏఎంఎల్) ప్రతినిధులు …

Read More »