గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో మంగళవారం ఆయన క్యాంపు ఆఫీస్ లో తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ @ శరత్ చంద్ర అకాడమీ అంశాల మీద చర్చలు జరిపారు. సి ఆర్ డి ఏ లో రెండు ఎకరాలు కేటాయిస్తే అకాడమీ స్వంత నిధుల తో అకాడమీ భవనం నిర్మించుకుంటామని విల్సన్ కోరారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాను అన్నారు. తెలుగు భాష …
Read More »Tag Archives: guntur
మాదక ద్రవ్యాలను నివారిద్దాం… యువత జీవితాలను కాపాడుదాం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మాదక ద్రవ్యాలను నివారించి, యువత జీవితాలను కాపాడాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యా సంస్థలలలో మాదక ద్రవ్యాలు ప్రవేశించకుండా గట్టి నిఘా పెట్టాలని తెలిపారు. యువత మత్తులో పడితే జీవితం చిత్తు అవుతుందని, కుటుంబాలు ఆర్థికంగా నష్ట పోతాయని, ఆరోగ్యం దెబ్బతింటుందని అన్నారు. …
Read More »17న డీ వార్మింగ్ డే
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం (డీ వార్మింగ్ డే)ను ఈ నెల 17వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం పోస్టర్ ను కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం కింద చేపట్టడం జరుగుతోందని చెప్పారు. అన్ని అంగన్వాడీలు, పాఠశాలలు, కళాశాలల్లో 17వ తేదీన ఉచితంగా ఇవ్వబడే అల్బెండజోల్ 400 మిల్లీ గ్రాముల …
Read More »పీజీఆర్ఎస్ అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజలు అందించిన అర్జీలు సత్వరమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి సూచించారు. సోమవారం కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ( పీ.జీ.ఆర్ఎస్) జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్ఎస్ లో రెవెన్యూ, నాన్ రెవెన్యూ అంశాలకు సంబంధించి ప్రజలు …
Read More »వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలనలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలనలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా వెట్టి చాకిరి వ్యవస్థ (బాండెడ్ లేబర్) నిర్మూలనపై కార్మిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలన కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలతో ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ …
Read More »పన్నులను సకాలంలో చెల్లించడం ద్వారా నగరాభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ఆస్తి, ఖాళీ స్థల పన్నులు, నీటి మీటర్ చార్జీలు, డి&ఓ ట్రేడ్ లైసెన్స్ ఫీజుల చెల్లింపు కోసం గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాలతో పాటుగా నగరంలో మరో 6 ప్రాంతాల్లో అదనపు పన్ను చెల్లింపు కేంద్రాలను ఏర్పాటు చేశామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరపాలక సంస్థకు బకాయి ఉన్న పన్నులను సకాలంలో చెల్లించడం ద్వారా నగరాభివృద్ధిలో …
Read More »ఫిర్యాదులకి శాశ్వత పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్ ప్రజలు అందించే ఫిర్యాదులను శాశ్వత పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జరిగిన పిజిఆర్ఎస్ ద్వారా అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి అర్జీలను తీసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ అర్జీలు తీసుకొని అధికారులతో మాట్లాడుతూ పిజిఆర్ఎస్, ఇతర వేదికల ద్వారా ప్రజలు ఇస్తున్న ప్రతి అర్జీకి …
Read More »అన్న క్యాంటీన్లలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్ల పరిసరాల్లో వినియోగంలో లేని వస్తువులను తొలగించి, శుభ్రత పాటించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. సోమవారం నల్లచెరువు మెయిన్ రోడ్ లోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలోని అన్న క్యాంటీన్లలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వినియోగించని వస్తువులను తొలగించాలన్నారు. ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి, ఆహార నాణ్యత, రుచిపై అడిగి తెలుసుకొని, ఏమైనా …
Read More »నూరు శాతం తడిపొడిగా వేరు వేరుగానే వ్యర్దాలు సేకరణ చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ప్రతి ఇంటి నుండి నూరు శాతం తడిపొడిగా వేరు వేరుగానే వ్యర్దాలు సేకరణ చేయాలని, ప్రజలు కూడా వేరుగా ఇచ్చి సహకరించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ కోరారు. సోమవారం 14, 19 వార్డ్ ల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య, అభివృద్ది పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డ్ సచివాలయాల వారీగా మైక్రో ప్యాకెట్ల మేరకు ప్రతి ఇంటి నుండి వ్యర్ధాలను వేరువేరుగా …
Read More »గుంటూరులో తాగునీటి సరఫరాలో అంతరాయం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 9 (సోమవారం) సాయంత్రం నుండి ఫిబ్రవరి 10 (మంగళవారం) వరకు గుంటూరు నగరంలో తాగునీటి సరఫరాలో అంతరాయం. మంగళవారం సాయంత్రం పాక్షికంగా, బుధవారం ఉదయం నుండి యధావిధిగా సరఫరా జరుగుతుంది. తక్కెళ్ళపాడు హెడ్ వాటర్ వర్క్స్ నుండి నీటిని పంపింగ్ చేసే లైనుపై, సీతానగర్ వద్ద లీకేజీ ఏర్పడింది. నీటి వృధాను అరికట్టడానికి, ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం 6 గంటల నుండి మరమ్మతు పనులు చేపట్టనున్నారు. దీనివలన ఫిల్టరేషన్ ప్లాంట్ పూర్తిగా నిలిపివేయబడుతుంది. నీటి …
Read More »
Prajavartha Online Telugu News