గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను(యు.జి.డి) పక్కాగా ఏర్పాటు చేయుటకు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డి.పి.ఆర్) తయారు చేయాలని జిల్లా కలెక్టర్ మరియు గుంటూరు నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి సి.యం.సాయి కాంత్ వర్మ జిఎంసి అధికారులను ఆదేశించారు. గుంటూరు పట్టణంలో యు.జి.డి, నిరంతర నీటి సరఫరా, సుందరమైన కూడళ్లు, పార్క్ ఏర్పాటు, పి.వి.ఎన్ నాయుడు మార్కెట్ పునర్నిర్మాణ పనులుపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిఎంసి అధికారులతో సమీక్షించారు. …
Read More »Tag Archives: guntur
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : నగర కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ అన్నారు. జూన్ 5 పర్యావరణ దినోత్సవం సందర్భంగా పోల్యుషణ్ కంట్రోల్ బోర్డు మరియు హార్ట్ ఫుల్ సెంటర్ వారి ఆధ్వర్యంలో పాటిబండ్ల సీతారామయ్య స్కూల్ నుండి తారకరామ నగర్ వరకు ప్రజల అవగాహన కొరకు ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీని నగర కమిషనర్ జెండా ఊపి ప్రారంభించి, ప్రజలు విధ్యార్ధులతో కలిసి సైక్లింగ్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, …
Read More »నేటి నుంచి హజ్ యాత్రికుల రాక ప్రారంభం
-హజ్ యాత్ర ముగించుకుని స్వదేశాలకు వచ్చిన హాజీలకు ఘన స్వాగతం: రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హసన్ భాష గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం ద్వారా పవిత్ర హజ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు విజయవంతంగా యాత్రను ముగించుకుని తిరిగి స్వదేశానికి చేరుకుంటున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ హసన్ భాష తెలిపారు. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక విమానాల ద్వారా హజ్ యాత్రికులు విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటున్నారని ఆయన గుంటూరు కార్యాలయం …
Read More »ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు పర్యటన ఏర్పాట్లను పరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన నగర కమిషనర్ మయూర్ అశోక్. జూన్ 3న పివియస్ లలితా హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వర్యులు రానున్న నేపథ్యంలో హెలిప్యాడ్, నేషనల్ హై వే, హాస్పిటల్ ఆవరణ, సభాప్రాంగణం తదితర ప్రాంతాలను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూన్ 3, బుధవారం పివియస్ లలితా …
Read More »గుంటూరులో పారిశుధ్య, పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను పరిశీలించిన యూనిడో బృందం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సుస్థిర పట్టణాభివృద్ధి, ప్రజారోగ్య పరిరక్షణ, ఆధునిక పారిశుధ్య నిర్వహణలో గుంటూరు నగరపాలక సంస్థ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (యూనిడో) ప్రతినిధులు, రాష్ట్రంలోని వివిధ నగరపాలక సంస్థలు మరియు మునిసిపాలిటీల కమిషనర్ల బృందం మంగళవారం పరిశీలించింది. ఈ సందర్భంగా నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ బృందానికి నగరంలో యూనిడో సహకారంతో అమలు చేస్తున్న పలు వినూత్న కార్యక్రమాల గురించి, ముఖ్యంగా ప్రజారోగ్య పరిరక్షణ, పారిశుధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు …
Read More »జలధార పనులను వేగవంతం చేయాలి… : జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జలధార పనులను జూన్ 15 నాటికి ఖచ్చితంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలక్టరేట్ లోని వీసీ హాల్ లో జిల్లాలోని అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా, మండల అధికారులతో జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ దరఖాస్తులు బియాండ్ ఎస్ ఎల్ ఏ లోకి వెళ్ళకుండా …
Read More »ఇళ్ల గణనను 100 శాతం ఖచ్చితత్వంతో పూర్తి చేయాలి
– నగర ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారి, కమిషనర్ కె. మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో జనాభా గణన–2026లో భాగంగా నిర్వహిస్తున్న ఇళ్ల గణన (హౌస్ లిస్టింగ్) ప్రక్రియను ఈ నెల 6వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో, మిగిలిన పనులను అత్యంత జాగ్రత్తగా, 100 శాతం ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని నగర ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్ సూపర్వైజర్లను ఆదేశించారు. సోమవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ హాల్లో ఇళ్ల …
Read More »ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ జి.సాంబశివరావు విభాగాదిపతులకు తెలిపారు. సోమవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, పిజిఆర్ఎస్ కు అందే ఫిర్యాదుల్లో ఎక్కువగా పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి సరఫరా మరియు …
Read More »గుంటూరు నగరపాలక సంస్థకు అంతర్జాతీయ పురస్కారం
-UNIDO ‘జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్’ అవార్డు అందుకున్న కమిషనర్ మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఐక్యరాజ్యసమితికి చెందిన యునిడో (యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) ప్రతిష్టాత్మక “జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్” అవార్డును గుంటూరు నగరానికి ప్రకటించింది. సోమవారం విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్లో జరిగిన ‘సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ (SC-IAP)’ ప్రాజెక్ట్ వర్క్షాప్లో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ ఈ …
Read More »ఒకటో తేదీనే పెన్షన్.. పేదలకు కొండంత భరోసా
-గుంటూరు నగర కమిషనర్ మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నెల ప్రారంభంలోనే ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరడం పేదలు, వృద్ధులు, మరియు వికలాంగులకు ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తుందని గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒకటవ తేదీనే పెన్షన్ల పంపిణీలో భాగంగా సోమవారం ఉదయం శ్రీనివాసరావుతోట 69వ సచివాలయం పరిధిలో అచ్చి నాగేంద్రం అనే వికలాంగురాలి ఇంటికి వెళ్లి పెన్షన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా …
Read More »
Prajavartha Online Telugu News