Breaking News

admin

తెలంగాణలో బీఆర్ఎస్ కు మరో షాక్ తప్పదా? బీజేపీలోకి ఆ నేత జంప్!

BRS Leader

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : ఖమ్మం రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణ బీజేపీ నేతలు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఈ నెల 22న జరగనున్నట్టు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి రెండు లోక్‌సభ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. అవి ఖమ్మం, వరంగల్. ఇప్పటికే అరూరి రమేష్‌కి వరంగల్ టిక్కెట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఖమ్మం స్థానంపై తేల్చుకోలేని స్థితిలో …

Read More »

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కస్టడీలో పుస్తకాలే నేస్తాలు

MLC Kavitha

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆమె ఈడీ కస్టడీ మార్చి 23 వరకు కొనసాగుతుంది. కస్టడీలో ఉన్న రోజు ఈడీ అధికారులు కవితను కొంతసేపు ప్రశ్నించారు. తరువాత, పుస్తకాలు చదువుతూ సమయాన్ని వెచ్చిస్తున్నారు. నిన్న, బుధవారం ఏకాదశి సందర్భంగా ఆమె  ఉపవాసం ఉన్నారని తెలుస్తోంది.  అందుకే కవిత కోసం పళ్లను ఈడీ అధికారులు అందచేశారని చెబుతున్నారు. పుస్తకాలే నేస్తాలు.. కస్టడీలో ఉన్న కవిత ఎక్కువ సమయం పుస్తకాలు …

Read More »

తెలంగాణ కొత్త గవర్నర్ గా రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం

Telangana New Governor

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : ఇప్పటి వరకు తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన తమిళిసై ఇటీవల రాజీనామా చేశారు. ఆమె తమిళనాడు నుంచి పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ నూతన గవర్నర్ ప్రమాణస్వీకారానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇదీ రాధాకృష్ణన్ నేపథ్యం.. రాధాకృష్ణన్ 1998, 1999లో రెండుసార్లు లోక్ …

Read More »

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం.. అతనికి బెయిల్!

Praveen Kumar

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ మద్యం కుంభకోణంలో పెద్ద ముందడుగు పడింది. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన అభిషేక్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతనికి ఐదు వారాల షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఈ బెయిల్‌తో పాటు ట్రయల్‌ కోర్టు అనుమతి కూడా తీసుకోవాలని… ఆ తర్వాతే హైదరాబాద్‌ వెళ్లాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాదు, అభిషేక్‌ను విదేశాలకు వెళ్లవద్దని.. పాస్‌పోర్టును అప్పగించాలని ఆదేశించింది. అభిషేక్ భార్యకు ఆరోగ్య సమస్యలు ఉన్నందున కోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. …

Read More »

YSR Kapu Nestham: వరుసగా రెండోసారి వైఎస్సార్ కాపు నేస్తం.. రేపు!

YSR Kapu Nestham

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : YSR Kapu Nestham: రేపు(22.07.2021, గురువారం) వరసగా రెండో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 3,27,244 మంది కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ. 490.86 కోట్ల ఆర్ధిక సాయం అందించబోతున్నారు. అమరావతిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో రేపు కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్‌. అయితే, ప్రభుత్వం ఇచ్చిన ఈ …

Read More »

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు.. పొంగి పొర్లుతున్న వాగులు

heavy rains

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : Heavy Rains: రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. జూరాల, శ్రీశైలం, నాగార్జుసాగర్‌ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ఇన్‌ఫ్లో 1,10,239 ఉండగా ఔట్‌ఫ్లో 28,252 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్‌ ఇన్‌ఫ్లో 31,512, ఔట్‌ఫ్లో 1,555 క్యూసెక్కులుగా ఉంది. ఇక ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో …

Read More »