Breaking News

Movie News

సింగపూర్ యూనివర్సిటీలో మాస్టర్స్ పట్టా పొందిన అనా కొణిదెల 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. అనా కి ఇది రెండో మాస్టర్స్ డిగ్రీ. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లో వైభవంగా నిర్వహించిన స్నాతకోత్సవంలో పట్టా స్వీకరించారు. ఆగ్నేయాసియా దేశాల కళలు, సామాజిక విజ్ఞానం (ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్) లో ఆమె ఈ మాస్టర్స్ చేశారు. మాస్టర్స్ పట్టా పొందినందుకు సతీమణికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. అనా …

Read More »

కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను…

-ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా జనసేనాని ప్రమాణ స్వీకారం -కొలువుదీరిన కూటమి ప్రభుత్వం -అంగరంగ వైభవంగా ప్రమాణస్వీకారోత్సవం -ముఖ్య అతిధిగా ప్రధాని నరేంద్ర మోదీ  -ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం -జనసేన పార్టీ నుంచి మంత్రులుగా  నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్  గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఆనందోత్సాహాలలో మునిగితేలారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను… ఈ మాటలు వినపడగానే సంబరాలు అంబరాన్ని తాకాయి. …

Read More »

“ఆదిపత్య కోటలను బద్దలు కొట్టిన ప్రజల హీరో కృష్ణ”..!

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోటగోడల్ని పగలగొట్టడం, ఆధిపత్యాల్ని కూలదోయడం, కొత్త దారుల్ని వేయడం, పదిమందీ నడవడానికి దారిని విశాలం చేయడం హీరో తనమైతే దానికి అర్హుడు కృష్ణనే. స్వయంగా వెలగడం “స్టార్” లక్షణమైతే, అలా వెలగడంలో సూపర్‌స్టార్ ఆయన. ఆంగికం, వాచకం, అభినయం అనే మూడు అంశాలు తెరమీద నాటకానికి కీలకమనే అభిప్రాయాన్ని తత్తునియలుచేసి అదీ ఎడమచేతి(వాటం)తో ప్రేక్షకులచేత నీరాజనాలందుకున్న నటుడు కృష్ణ. కృతకమైన నటనలు, వ్యక్తిత్వాలూ ఆయన ప్రదర్శించలేదు అందరి నటుల్లాగా. ఆయన సహజంగా మన ఇళ్లలో, ఇంటి పక్కల …

Read More »

మహేశ్ బాబు పుత్రోత్సాహం.. ఎందుకో తెలుసా?

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకుని పట్టా అందుకున్నాడు. దీనిపై మహేశ్ బాబు సంతోషం వ్యక్తం చేస్తూ.. “నా హృదయం గర్వంతో ఉప్పొంగిపోతోంది. నువ్వు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినందుకు కంగ్రాచ్యులేషన్స్ గౌతమ్. నీ కలల సాకారం కోసం కృషిచేస్తూ ఉండు. ఎప్పటికీ నిన్ను ప్రేమించేవాళ్లు ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకో. ఓ తండ్రిగా ఇవాళ నేను పుత్రోత్సాహంతో గర్విస్తున్నాను” అని పోస్ట్ చేశారు.

Read More »

తండ్రి కోసం ‘చిరుత’ హీరోయిన్ ఎన్నికల ప్రచారం

ఉత్తరప్రదేశ్‌, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల బరిలో నిలిచిన తన తండ్రి అజిత్ శర్మ కోసం ‘చిరుత’ హీరోయిన్ నేహా శర్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలను ఆమె స్వయంగా ఇన్‌స్టాలో షేర్ చేశారు. నేహా కూడా రాజకీయ ఆరంగేట్రం చేస్తుందన్న వార్తలు తొలుత వినిపించినా ఆమె తన సినీ కెరీర్ మీదే ప్రస్తుస్తానికి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. నేహను రాజకీయాల్లోకి రావాలంటూ తండ్రి ప్రోత్సహించినా ఆమె నటన మీదే దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నారట.

Read More »

తమ్ముడికి మెగాస్టార్ భారీ విరాళం

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల నిర్వహణ కోసం తమ్ముడు పవన్ కళ్యాణ్కు మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం చెక్కుల రూపంలో అందించారు. హైదరాబాద్ నగర శివారులో ముచ్చింతల్ దగ్గర జరుగుతున్న విశ్వంభర షూటింగ్ లొకేషన్ లో వున్న చిరంజీవిని ఇవాళ అన్న నాగబాబుతో కలసి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు పవన్. విజయోస్తు అని చిరంజీవి ఆశీర్వదించారు. కాసేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల గురించి ముగ్గురూ చర్చించుకున్నారు. అక్కడే వున్న ఆంజనేయ స్వామి విగ్రహంకు దండం పెట్టుకుని చిరంజీవికి పాదాభివందనం చేశారు పవన్ …

Read More »

దివికేగిన బుర్రిపాలెం బుల్లోడు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్‌ కృష్ణ (79) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుకు గురైన కృష్ణను కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులు, తెలుగు సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. 1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు కృష్ణ జన్మించారు. ఐదుగురు సంతానంలో ఈయనే పెద్దవారు. కృష్ణ అసలు …

Read More »

నగరంలో ‘పక్కా కమర్షియల్‌’ చిత్ర యూనిట్‌ సందడి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో ‘పక్కా కమర్షియల్‌’ చిత్ర యూనిట్‌ సందడి చేసింది. జూలై ఒకటో తేదీన విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా యూనిట్‌ సభ్యులు నగరంలోని రాజ్‌-యువరాజ్‌ (జీ3) థియేటర్లకు విచ్చేశారు. ఈ సందర్భంగా యూనిట్‌ మీడియా శనివారం సమావేశం నిర్వహించింది. హీరో గోపీచంద్‌ మాట్లాడుతూ ఈ చిత్రం చాలా అద్భుతంగా వచ్చిందని ఖచ్చితంగా సినీ అభిమానులను అలరించేలా వినోదాత్మకంగా పక్కా కమర్షియల్‌ సినిమా వుందన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కామెడీ, యాక్షన్‌ సన్నివేశాలతో రూపొందించామని …

Read More »

తెలుగు సినిమా ప్రముఖులతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సినిమా ప్రముఖులతో తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ మంచి పాలసీ తీసుకురావాలని, తద్వారా పెద్ద సినిమాలకు, చిన్న సినిమాలకు న్యాయం జరగాలని గత కొద్ది కాలంగా కసరత్తు జరుగుతుంది. ఇందులో భాగంగానే అందరి అభ్యర్ధనలను పరిగణలోకి తీసుకుంటూ… దీనిపై ఒక కమిటీని కూడా నియమించాం. ఆ కమిటీ కూడా తరచూ సమావేశమవుతూ వాళ్లకొచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ కూడా నాతో పంచుకున్నారు. ఇంకా …

Read More »

దగ్గుబాటి ఇంట గుర్రమెక్కి సందడి చేసిన బాలయ్య…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గుర్రమెక్కి సందడి చేశారు. తన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి నివాసంలో సంక్రాంతి వేడుకలు జరుపుకునేందుకు కుటుంబంతో సహా ప్రకాశం జిల్లా కారంచేడు వచ్చిన ఆయన..సరదగా గడిపారు. గుర్రమెక్కి కాసేపు సందడి చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణను చూసేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు తరలి వచ్చారు.

Read More »