మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఆయిల్ పామ్ తోటల సాగు వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని రైతులకు తెలియజేసి వారిని ఆ దిశగా మొగ్గు చూపేలా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులు, సిబ్బందికి సూచించారు. శనివారం ఉదయం అవనిగడ్డ ఎంపీడీవో కార్యాలయంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ మెగా మేళా – ఆయిల్ ఫామ్ సాగుపై గ్రామస్థాయి ఉద్యాన, వ్యవసాయ శాఖల సహాయ సిబ్బందికి, రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్ …
Read More »Daily Archives: July 20, 2024
స్మార్ట్ విజన్లో ఆధునాతనమైన లేజర్ మిషన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో నేత్ర సంరక్షణా రంగంలో అగ్రగామిగా నిలిచిన స్మార్ట్ విజన్ ఓ సరిక్రొత్త లేజర్ మిషన్ని ఆంధ్రప్రదేశ్లోనే తొలిసారిగా విజయవాడలో ప్రవేశపెట్టడానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా స్మార్ట్ విజన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ఎం.స్వాతిమణి మాట్లాడుతూ ఈ నూతన ‘‘స్మైల్ ప్రో’’ మిషన్ను భారతదేశంలో 5వ మిషన్గా విజయవాడ స్మార్ట్ విజన్లో ప్రారంభించడం గర్వకారణంగా వుందన్నారు. కేవలం 8 సెకన్లలోనే కంటి చికిత్సలను ‘‘స్మైల్ ప్రో’’ అనే నూతన లేజర్ మిషన్తో …
Read More »ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న సీపీఐ శ్రేణులపై కేసులను ఎత్తివేయండి…
– మంత్రి లోకేష్కు సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ళ వినతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వివిధ ప్రజా సమస్యలపై నిర్వహించిన ఉద్యమాల సందర్భంగా గత కాలంలో సీపీఐ, అనుబంధ ప్రజాసంఘాల శ్రేణులపై నమోదైన కేసులను తొలగించాలని రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ను శుక్రవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావులు కోరారు. ఈసందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సీపీఐ, అనుబంధ సంఘాల శ్రేణులపై నమోదైన కేసుల వివరాలతో కూడిన జాబితాను …
Read More »మేజర్ ఔట్ ఫాల్ డ్రైన్ పూడికలు తీయండి
-ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి -ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ తన పర్యటనలో భాగంగా శనివారం ఉదయం బెంజ్ సర్కిల్ నేషనల్ హైవే, గురునానక్ కాలనీ రోడ్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, కొమరయ్య స్ట్రీట్, ఓల్డ్ రాజరాజేశ్వరి పేట, నిజాం గేట్ ప్రాంతాలు తిరిగి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ముందుగా బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్న వర్షపు నీటి నిలువలను …
Read More »బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలోని పలు జిల్లాలో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి.. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో.. ఏజెన్సీలోని పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి..అయితే, ఈ రోజు, రేపు కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. 2-3 రోజుల్లో మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో రేపు ప్రకాశం జిల్లా, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడే …
Read More »నేడు సింహాచలంలో గిరి ప్రదక్షిణ
-సింహాచలంలో గిరి ప్రదక్షిణ , 32 కిలో మీటర్ల మేర జరిగే ఉత్సవం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ పౌర్ణమి రోజున సింహాచలంలో గిరి ప్రదక్షిణను వైభవంగా నిర్వహించనున్నారు. సింహాచలంలో సింహాద్రి అప్పన్నగా పిలిచే శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండ చుట్టూ 32 కిలో మీటర్ల మేర లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో కాలి నడకన చేరుకుంటారు. గిరి ప్రదక్షిణ కోసం సింహాచలం దేవస్థానం ఏర్పాట్లు చేస్తుంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేస్తుంది. జులై 20వ …
Read More »ఆషాఢ పూర్ణిమ వైశిష్ట్యం…గురు పూర్ణిమ వైశిష్ట్యం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్లో|| ఏకాక్షరప్రదాతారం, యో గురుం నాభిమన్యతే| స శ్వయోనిశతం గత్వా, చండాలత్వం అవాప్నుయాత్|| అన్నింటికంటే గురుద్రోహం మహాపాతకం. గురుద్రోహికి ప్రాయశ్చిత్తం చాలా కష్టం. ఒక్క అక్షరం లేక ఓంకారం, ఉపదేశంగా ప్రసాదించిన గురువును గౌరవించని పాపి వరుసగా నూరుజన్మలు కుక్కగా పుడతాడు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఆషాఢ శుక్ల ద్వాదశీ వ్రతం. ఆషాఢ శుక్ల ద్వాదశి నాడు ఉదయం లేచి శిరస్నానం చేసి గోపంచకంతో విప్రుల పాదాలు కడిగి, ఆపై శివాలయంలోని అర్చకునకు స్వయంపాకాదులు దానం చేస్తే, …
Read More »