Breaking News

Monthly Archives: July 2024

పెరటి తోటల పెంపకం.. ప్రకృతితో అనుబంధం జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పెరటి తోటల పెంపకం ద్వారా ప్రకృతితో ప్రత్యేక అనుబంధం ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. గురువారం ఉదయం ఆయన కలక్టరేట్ లోని సమావేశపు మందిరంలో పాఠశాల ప్రాంగణంలో పెరటి తోటల పెంపకం(కిచెన్ గార్డెన్)పై విద్య, అటవీ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పోషక విలువలు ఎక్కువగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటల పెంపకం, వినియోగంతో ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పెంపొందించుకోవచ్చని అన్నారు. సేంద్రీయ …

Read More »

అల్లూరి సీతారామరాజు గొప్ప స్వాతంత్ర సమరయోధుడు… : కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్ విసి హాల్లో జిల్లా కలెక్టర్ , డిఆర్ఓ, అధికారులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు తెల్లదొరల శ్రమ దోపిడి, అన్యాయాన్ని ఎదిరించి, పోరాడే పోరాట పటిమ స్ఫూర్తిని గిరిజనుల్లో రగిలించిన విప్లవ యోధుడనీ, తద్వారా దేశ స్వాతంత్ర సంగ్రామంలో పోరాట స్ఫూర్తిని నింపిన మహనీయుడనీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె. …

Read More »

చరిత్రలో ఎందరికో స్ఫూర్తి కలిగించిన అల్లూరి సీతారామరాజు అమరత్వం అజరామరం !!

-కార్పొరేషన్ లో అల్లూరి సీతారామరాజుకి ఘన నివాళులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కార్యాలయం కమాండ్ కంట్రోల్ రూమ్ లో గురువారం ఉదయం అల్లూరి సీతారామరాజు 127 వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. దేశ స్వాతంత్ర్యం కోసం, స్వయం పాలన కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టి బ్రిటీష్ పరాయి పాలకులతో పోరాడిన అల్లూరి సీతారామరాజు త్యాగం గొప్పదని, స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఎందరికో స్ఫూర్తి కలిగించిన ఆయన అమరత్వం అజరామరమని అదనపు కమిషనర్ (జనరల్) డాక్టర్ ఏ మహేష్ …

Read More »

విజయవాడ ను అభివృద్ధి మాత్రమే కాకుండా అందంగా సుందరంగా తీర్చిదిద్దిన ఘనత స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.యస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ సిబ్బంది బుధవారం సాయంత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నగర కమిషనర్, విధుల నుండి రిలీవ్ అవుతున్న సందర్భంగా, విజయవాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న శాఖాధిపతులు మరియు సిబ్బంది కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కీ ఘనంగా సెండ్ ఆఫ్ నిర్వహించి, శ్రీకాకుళం జిల్లాకి కలెక్టర్గా వెళ్తున్నoదుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ (జనరల్) డాక్టర్ ఏ మహేష్ మాట్లాడుతూ కమిషనర్ స్వప్నిల్ విజయవాడలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అయినా రాజీవ్ గాంధీ …

Read More »

విద్యార్థుల హాజ‌రుపై ప్ర‌త్యేకంగా దృష్టిసారించాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న బుధ‌వారం మ‌ధ్యాహ్నం జిల్లా విద్యాశాఖ కార్య‌క‌లాపాల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. జిల్లాలోని వివిధ పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు ప్ర‌వేశాలు, బోధ‌నా సిబ్బంది, మౌలిక వ‌స‌తులు, ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల ఫ‌లితాలు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించారు. విద్యార్థులు ప్ర‌తిరోజూ త‌ర‌గ‌తుల‌కు హాజ‌ర‌య్యేలా చూసి.. నిర్దేశ బోధ‌నా ప్ర‌ణాళికకు అనుగుణంగా విద్యా నైపుణ్యాలు అందించేందుకు కృషిచేయాల‌న్నారు. ఒక‌వేళ ఎవ‌రైనా హాజ‌రుకాకుంటే అందుకు గ‌ల కార‌ణాల‌ను తెలుసుకోవాల‌న్నారు. విద్యార్థుల స‌మ‌గ్రాభివృద్ది ల‌క్ష్యంగా క‌రిక్యుల‌ర్‌, కోక‌రిక్యుల‌ర్ యాక్టివిటీస్‌ను అమ‌లుచేయాల‌న్నారు. ప్ర‌తి …

Read More »

ర‌క్షిత మంచినీటి ప‌థ‌కాల‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టండి

– అధికారుల‌తో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ర‌క్షిత తాగునీరు, పారిశుద్ధ్యంతో ప్ర‌జ‌ల ఆరోగ్య ర‌క్ష‌ణ త‌ద్వారా జీవ‌న ప్ర‌మాణాల మెరుగుకు దోహ‌దం చేస్తాయ‌ని… దీన్ని దృష్టిలో ఉంచుకొని ర‌క్షిత‌, స‌మ‌గ్ర ర‌క్షిత మంచినీటి ప‌థ‌కాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న అధికారుల‌ను ఆదేశించారు. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బుధ‌వారం క‌లెక్ట‌ర్ సృజ‌న‌.. క‌లెక్ట‌రేట్‌లోని ఛాంబ‌ర్‌లో పంచాయ‌తీరాజ్‌, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా, ఇరిగేష‌న్‌; ర‌హ‌దారులు, భ‌వ‌నాలు; ప్ర‌జారోగ్యం, ఏపీఈడ‌బ్ల్యూఐడీసీ సూప‌రింటెండింగ్‌, ఎగ్జిక్యూటివ్ …

Read More »

రహదారుల వెంట పచ్చదనం అభివృద్ది చెయ్యాలి

– పెండింగ్ పనుల పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి – కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణ ను దృష్టిలో ఉంచుకొని రాజమహేంద్రవరం నగరం మీదుగా వెళ్లే జాతీయ రహదారులకు ఇరువైపులా పచ్చదనంతో కూడిన గ్రీనరీ అభివృద్ది ని చేసే విధంగా జాతీయ రహదారుల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సూచించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి తదితర శాఖల అధికారులతో …

Read More »

నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను సమర్పిందాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 2023 డిసెంబర్ లో జరిగిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ పరీక్షలో ఎంపిక అయిన విద్యార్థులు ఈ సంవత్సరం తప్పకుండా 31 ఆగస్ట్ 2024 లోపు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను సమర్పిందాలని, 2020, 2021 మరియు 2022 సంవత్సరాలలో ఎంపిక అయిన విద్యార్థులు తప్పకుండా రెన్యువల్ చేసుకొనవలెను అనియు కేంద్ర మానవ వనరుల శాఖ, న్యూ ఢిల్లీ వారు తెలియజేసినట్లు జిల్లా పాఠశాల విద్యాధికారి కె. వాసుదేవ రావు …

Read More »

ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టుకు 15 రోజులు ముందుగానే సాగునీటి విడుదల

– గత పాలకులు నిర్లక్ష్యంతో పోలవరం అభివృద్ధి జరగలేదు. -పోలవరం ప్రాజెక్టు కొరకు భూములు ఇచ్చిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది. -జల వనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు. సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త : శివారు ప్రాంతపు ఆయికట్టు వరకు సాగునీరు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డా. నిమ్మలరామా నాయుడు పేర్కొన్నారు. బుధవారం సీతానగరం మండలం పురుషోత్తపట్నం, పుష్కర పంపింగ్ స్కీమ్ ” ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు రైతాంగానికి …

Read More »

హోమియోపతి కాలేజీలో పిజి సీట్లు పునరుద్ధరించాలి కేంద్రమంత్రికి ఎంపీ పురందేశ్వరి విజ్ఞప్తి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ) సీట్ల పునరుద్దరణ కై చొరవ చూపిన ఎంపీ , ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన హోమియో కళాశాల సిబ్బంది రాజమండ్రిలోని ప్రతిష్టాత్మక  అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో పతి  మెడికల్ కాలేజీలో  పిజి సీట్ల పునరుద్ధరించాలని  కేంద్ర ఆయుష్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ  మంత్రి ప్రతాప్ రావు గణపతిరావు  జాదవ్ ని  రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు, ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. ఈమేరకు కేంద్రమంత్రిని కలుసుకుని   వినతిపత్రం సమర్పించారు.  …

Read More »