Breaking News

Daily Archives: August 23, 2024

బదిలీలలో ఉద్యోగుల అభ్యర్థను పరిగణంలోకి తీసుకోవాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని సవరించిన నేపథ్యంలో బదిలీలలో ఉద్యోగుల అభ్యర్థనను పరిగణంలోకి తీసుకోవాలని అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల అభ్యర్థనకు ప్రాధాన్యత నివ్వాలని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం రాజుబాబు సంయుక్త రవాణా కమిషనర్ ఎన్ శివరామ ప్రసాద్ ను కోరారు. నగరంలోని రవాణాశాఖ కార్యాలయంలో రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం రాజుబాబు కార్యదర్శి కెవివి నాగమురళి శుక్రవారంనాడు సంయుక్త రవాణా కమిషనర్ ఎన్ శివరామ ప్రసాద్ …

Read More »

గ్రామాభివృద్ధితోనే దేశాభివృద్ధి…గ్రామ పంచాయతీలను మళ్లీ అభివృద్ధి బాట పట్టిస్తాం

-గత ప్రభుత్వం సర్పంచులను ఉత్సవ విగ్రహాల్లా మార్చింది. -నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో…గ్రామాభివృద్ధికి సర్పంచి అంతే ముఖ్యం -ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి, ప్రతి ప్రాంతానికి మౌలిక వసతులు కల్పిస్తాం -మా ప్రభుత్వం రాగానే రూ.998 కోట్లు పంచాయతీలకు విడుదల చేశాం…మరో రూ.1,100 కోట్లు విడుదల చేయబోతున్నాం. -ఉపాధి హామీ పని దినాలు 15 కోట్ల నుండి 21.50 కోట్లకు పెంపు -సమాజానికి చేటు చేసే వ్యక్తులకు ప్రజలు దూరంగా ఉండాలి -ప్రతిపక్ష హోదా అనేది ప్రజలిచ్చేది…గెలిపిస్తే వచ్చేది…బెదిరిస్తే వచ్చేది కాదు -ఒకే రోజున …

Read More »

రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్న సీఎం చంద్రబాబు..

మధురపూడి (కోరుకొండ), నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్రామ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం హెలి క్యాప్టర్ ద్వారా రాజమండ్రి విమానాశ్రయం చేరుకొన్నారు. అనంతరం అక్కడ నుంచి చాపర్ లో హైదరాబాద్ బయలుదేరి వెళ్లడం జరిగింది. మధురపూడి విమానాశ్రయం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు అధికారులు ప్రజా ప్రతినిధులు ఘనవీడ్కోలు పలకడం జరిగింది. ముఖ్యమంత్రికి వీడ్కోలు పలికిన వారిలో జిల్లా కలెక్టర్ శ్రీ ప్రశాంతి జిల్లా ఎస్పీ …

Read More »

ఘనంగా కాటా కోటేశ్వరం గ్రామ సభ

-పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి నిడదవోలు( కాటకోటేశ్వరం), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆలోచన తో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనతి కాలములోనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిణమిల్లాలని ఆలోచనతో ఇప్పటికే ఉన్నటువంటి గ్రామ సభలను పునరుద్ధరణచేసి గ్రామ సమస్యలను తెలుసుకొని వారి ఆలోచనలతో సత్వర పరిష్కార దిశగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించుకునేందుకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల …

Read More »

కలక్టరేట్ లో టంగుటూరి ప్రకాశం పంతులుకు ఘన నివాళి

-చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంఘ సంస్కర్త , న్యాయనిపుణుడు, రాజకీయ నాయకుడు, మరియు మద్రాసు ప్రెసిడెన్సీకి ప్రధాన మంత్రిగా పనిచేసిన వలసవాద వ్యతిరేక జాతీయ వాది టంగుటూరి ప్రకాశం పంతులు మనందరికీ సదా స్మరణీయుడు అని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ లో టంగుటూరి ప్రకాశం జయంతి వేడుకలు సందర్భంగా చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా …

Read More »

భవన నిర్మాణం ప్రకారం ఆస్తి పన్ను ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ప్రతి ఇంటికి ఆస్తి పన్ను విధిగా ఉండాలని మరియు భవన నిర్మాణం ప్రకారం ఆస్తి పన్ను ఉండాలని, అందుకు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేయాలని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ రెవిన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాత్రం తమ ఛాంబర్ నందు రెవిన్యూ విభాగ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, ఐదు సంవత్సరాల నుండి రెవిన్యూ డిమాండ్ మరియు ఆస్తి విధింపు మరియు ఆస్తి పన్ను పెంపుదల …

Read More »

విజయవాడలోని సిజిఓ కాంప్లెక్స్‌లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన పీఐబీ

-ప్రకృతిని రక్షించాలని మరియు పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని మరింత ప్రభావవంతంగా మరియు చైతన్యవంతం చేయడంలో చురుకుగా సహకరించాలని పిలుపునిచ్చిన అదనపు డైరెక్టర్ జనరల్, రాజిందర్ చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్టు 15, 2024న 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని విజయవాడ పత్రికా సమాచార కార్యాలయం ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (తల్లి పేరు మీద ఒక చెట్టు నాటడం) …

Read More »

అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన పేలుడులో కార్మికులు మరణించిన కేసును సుమోటోగా విచారణకు స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ

-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ -కార్మికుల భద్రత విషయంలో నిర్లక్ష్యం ఉందేమో కనిపెట్టడానికి సమగ్ర విచారణ చేసి రెండు వారాల్లోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఆదేశం -ఎఫ్‌ఐఆర్, క్షతగాత్రుల ఆరోగ్యం & వైద్య చికిత్స, చనిపోయిన & గాయపడిన వారి కుటుంబాలకు పరిహారం పంపిణీ పరిస్థితిని కూడా తెలియజేయాలని నిర్దేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ అనకాపల్లి జిల్లాలో ఉన్న అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)లోని ఎసెన్షియా ఫార్మా పరిశ్రమలో రియాక్టర్ పేలి 17 మంది …

Read More »

గత ఐదేళ్లలో గ్రామ పంచాయతీల నిర్వీర్యం

-గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని -ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యులను చేస్తున్నామని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఉపాధి హామీ పథకం పనులపై గ్రామసభలు నిర్వహించారని తెలిపారు. జగన్ పాలనలో సర్పంచులు సైతం బిచ్చమెత్తుకున్న దుస్థితిని చూశామని అన్నారు. కేంద్రం గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులను సైతం మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తన అకౌంట్లోకి మళ్లించుకున్నారని తంగిరాల సౌమ్య ఆరోపణలు …

Read More »

తమకు న్యాయం చేయాల్సిందిగా విద్యార్థి నాయకులు విజ్ఞాపన పత్రం

రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఐదున్నర సంవత్సరాల కోర్సు విద్యార్థులకు 2010 సం. నుండి ఇప్పటి వరకూ స్టైఫండ్ 7000 రూపాయలు మాత్రమే ఇప్పటికీ కొనసాగుతోందని, అదే సాధారణ ఎంబిబిఎస్ కోర్సు విద్యార్థులకు మాత్రం ప్రతి సంవత్సరం పెంచుతూ ఈ సంవత్సరం 25 వేలకు పెంచడం జరిగిందని, కానీ తమకు పెంచడం లేదని అన్యాయం జరుగుతోందని సదర అంశంపై ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి శుక్రవారం రాత్రి రేణిగుంట ఎయిర్ పోర్టు నందు …

Read More »