Breaking News

Monthly Archives: August 2024

ఏపీ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఇచ్చిన తేనీటి విందు, కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో పాటు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఏపీ ఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షులు పరుచూరి అశోక్ బాబు తదితరులతో సుజనా ముచ్చటించారు. …

Read More »

రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కంపానియేన్ షిప్, సంస్థ నిర్వాహకులు గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. సుజనా చౌదరి మాట్లాడుతూ తల సేమియా మరియు ప్రాణాపాయ పరిస్థితుల్లో …

Read More »

ప్రజల ఆరోగ్యం కోసమే ఉచిత మెగా వైద్య శిబిరం

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 14 వరకు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించనున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) తెలిపారు. సుజన ఫౌండేషన్ , షేర్ ఇండియా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హెల్త్ క్యాంపును గురువారం కొత్తపేట కేబీఎన్ కళాశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ పేద మధ్యతరగతి, వర్గాలు ఎక్కువగా ఉన్న పశ్చిమ ప్రజలకు …

Read More »

అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత

-పశ్చిమ సమగ్రాభివృద్దే లక్ష్యం -ఎమ్మెల్యే సుజనా చౌదరి -ఎన్నికల్లో శాసనసభ్యునిగా విజయం తరువాత తొలిసారిగా జెండా ఎగరవేసిన సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో జాతీయ జెండాను పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ తో కలిసి ఆవిష్కరించారు.2024 ఎన్నికల్లో తొలిసారిగా శాసనసభ్యునిగా విజయం సాధించిన సుజనా, జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి …

Read More »

డీటీసీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

-జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన డిటిసి యం. పురేంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది ప్రాణాల సైతం అర్పించి మన దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారని అటువంటి మహనీయులను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని డిటిసి ఎం పురేంద్ర అన్నారు. స్థానిక బందరు రోడ్డు లోని డీటీసీ కార్యాలయంలో గురువారంనాడు 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో డీటీసీ యం పురేంద్ర పాల్గోని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అధికారులకు ఉద్యోగులకు స్వాతంత్ర్య దినోత్సవ …

Read More »

నాస్తిక కేంద్రంలో జాతీయ పతాకం ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నాస్తిక కేంద్రంలో జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది. జాతీయ పతాకాన్ని నాస్తిక కేంద్రం అధ్యక్ష్యులు ప్రముఖ వైద్యులు డాక్టర్ జి.సమరం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా మనకు స్వాతంత్య్ర్యం లభించిందని యువత ఆ మహనీయుల త్యాగాల నుండి స్వాతంత్య్ర్యం పొందడం నుండి ప్రేరణపొంది భవ్యమైన భారతదేశాన్ని నిర్మించడానికి నడుం బిగించాలని ఆయన అన్నారు. భారతదేశం అన్ని రంగాలతో పాటు సైన్సు సాంకేతికత రంగాలలో ముందుకు …

Read More »

రాష్ట్రంలో పేదరికం పూర్తిగా నిర్మూలించి, జీరో పావర్టీ దిశగా కృషి

-జన్మభూమి 2.O జనవరిలో ప్రారంభం -ముఖ్యమంత్రి చంద్రబాబు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు కడుపునిండా తిండి పెట్టడం జీవితంలో సంతృప్తినిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరితో కలిసి గురువారం గుడివాడలో తుమ్మల సీతారామపురం మున్సిపల్ పార్క్ లో అన్న క్యాంటీన్ పునః ప్రారంభించి, పేదలకు ఆహార పదార్థాలు వడ్డించారు. వివిధ వర్గాలకు చెందిన లబ్ధిదారులతో కలసి ముఖ్యమంత్రి దంపతులు భోజనం చేస్తూ వారు చేస్తున్న వృత్తులు వ్యాపారాలు, వారి కుటుంబాల …

Read More »

కలెక్టరేట్ ప్రాంగణంలో గౌరవ వందనం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎందరో మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆదర్శాలను పాటిస్తూ దేశ అభివృద్ధికి కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. తొలుత జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలసి మహాత్మా గాంధీ, భరతమాత చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని తెలుగు …

Read More »

ప్రజలు, కార్పొరేషన్ సిబ్బంది సహకారంతోనే విజయవాడ నగరాభివృద్ధి

-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి -స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలమే స్వాతంత్ర దినోత్సవం – నగర కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు, కార్పొరేషన్ సిబ్బంది ఇద్దరు రెండు కళ్ళు లాగా విజయవాడ నగరపాలక సంస్థకు సమన్వయంతో సహకరిస్తూ ఉండటం వల్లనే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందని విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ భాగ్యలక్ష్మి, విజయవాడ నగరపాలక సంస్థ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని అన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన …

Read More »

జాతీయ అవార్డు అందుకున్న సర్పంచ్ కృష్ణకుమారి

-కేంద్ర మంత్రి చేతులమీదుగా అవార్డు అందుకున్న చల్లపల్లి సర్పంచ్ కృష్ణకుమారి -భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిధిగా ఢిల్లీ వెళ్లిన సర్పంచ్ -దేశం మొత్తం మీద ఎనిమిది మంది సర్పంచులకు దక్కిన అరుదైన గౌరవం -స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం, మన కోసం మనం ట్రస్ట్ విస్తృత కృషితో క్లీన్ & గ్రీన్, సింగిల్ యూస్ ప్లాస్టిక్ నియంత్రణ, ఓడిఎఫ్ ప్లస్ లక్ష్యాలు సాధించిన చల్లపల్లి గ్రామ పంచాయతీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఓడిఎఫ్ ఫ్లస్ సాధనతో పాటు సింగిల్ …

Read More »