Breaking News

Daily Archives: September 12, 2024

సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో బుడమేరు వరదల నుండి విజయవాడ నగరం సత్వరంగా కోలుకుంటున్నందుకు, సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ నగరంలో ఇటీవల వచ్చిన బుడమేరు వరదలను, విజయవాడ నగరపాలక సంస్థ దిగ్విజయంగా వరద ప్రభావం నుండి బయటపడింది. వచ్చిన వరద ఉధృతి ఎక్కువైనప్పటికీ, దాని ప్రభావం విపరీతంగా ఉన్నప్పటికీ, తక్కువ సమయంలో వరద …

Read More »

మరిన్ని FTSCs లను ఏర్పాటు చేయాలి… : Dr B కీర్తి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “వాసవ్య మహిళా మండలి” అత్యాచార బాధితులకు త్వరితగతిన న్యాయం కోసం మరిన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కోసం అప్పీల్స్ నివేదిక ‘ఫాస్ట్ ట్రాకింగ్ జస్టిస్ కేసులు అసంపూర్తిగా పేరుకుపోయి ఉండటాన్ని తగ్గించడంలో ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టుల పాత్ర ఇతర కోర్టులు మరియు పోస్కో కేసులతో పోలిస్తే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు చాలా సమర్థవంతంగా ఉన్నాయని చూపిస్తుంది. అన్ని FTSCs లను పనిచేసేలా చేసి, జాబితాకు మరో 1000 మందిని చేర్చాలని నివేదిక సిఫార్సు చేసింది, ఇది …

Read More »

ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్ డాక్టర్ యలమంచి సదాశివరావుకు ప్రతిష్టాత్మక పురస్కారం

– అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ నుంచి గవర్నర్స్ రికగ్నిషన్ అవార్డు – లక్నోలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా పురస్కార ప్రదానం – అవార్డు అందుకున్న అనంతరం బెంగళూరులో జరిగిన సదస్సులో కాలి పుండ్లకు ప్రత్యామ్నాయ చికిత్సలపై ప్రసంగించిన డాక్టర్ సదాశివరావు – అవార్డు లభించిన సందర్భంగా డాక్టర్ యలమంచి సదాశివరావుకు ఆరిజన్ హాస్పిటల్లో ఘన సత్కారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మధుమేహ వ్యాధి చికిత్సా రంగంలో దశాబ్దాలుగా విశిష్ట సేవలందిస్తున్న ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్ …

Read More »

ప్రాణం అరచేతిలో పట్టుకొని బయటపడ్డారు

-ప్రతిఒక్కరు సహాయంగా నిలవాలి – వరద బాధితులను ఆదుకోవాలి ఏపీ ఎన్జీజీఓస్ రాష్ట్ర అధ్యక్షులు కెవి శివారెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అకాల వర్షాల కారణంగా ముంపుకు గురై తినటానికి తిండి కట్టుకోవడానికి బట్ట కూడా లేకుండా నష్టపోయినా వరద భాదితులకు ప్రతిఒక్కరు సహాయంగా నిలవాలని ఏపీ ఎన్జీజీఓస్ రాష్ట్ర అధ్యక్షులు కెవి శివారెడ్డి అన్నారు. స్థానిక చిట్టినగర్ లోని కలరా హాస్పిటల్ సమీపంలో గల వియంసి కాలనీలో గురువారంనాడు ఏపీ ఎన్జీజీఓస్ సంఘం జిల్లా అధ్యక్షులు ఎ విద్యాసాగర్ ఆధ్వర్యంలో …

Read More »