Breaking News

Daily Archives: December 14, 2025

చిన్నారులు తప్పిపోకుండా చైల్డ్ ట్యాగ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ‌ వారు అమ్మవారి భవానీ దీక్షా విరమణకు వచ్చే భక్తుల పిల్లలు తప్పిపోకుండా చైల్డ్ మోనిటరింగ్ సిస్టమ్ ట్యాగ్ వేయడం జరుగుతోంది. ఒకవేళ చిన్నారులు తప్పిపోతే సత్వరం గుర్తించి వారిని తల్లిదండ్రులకు అప్పగించేందుకు ఈ ట్యాగ్ ఉపయోగపడుతుంది. మొత్తం 12 ప్రదేశాలలో 240 సిబ్బంది తో ట్యాగ్ లు వేయటం జరుగుతుంది. గత నాలుగు రోజులు నుండి 24 వేలు ట్యాగ్ లు వెయ్యటం …

Read More »

ఈ నెల 15న జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ రద్దు

-జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఎస్.ఇలక్కియ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 11వ తేదీన ప్రారంభమైన భవానీ దీక్షల విరమణ కార్యక్రమం 15వ తేదీ వరకు జరగనుందని.. ఈ కార్యక్రమం నిర్వహణ విధుల్లో జిల్లా అధికారులు నిమగ్నమై ఉన్నందున ఈ నెల 15న కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) జిల్లాస్థాయి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఎస్.ఇలక్కియ ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి సోమవారం నుంచి జిల్లాస్థాయి పేజీఆర్ఎస్ కార్యక్రమం యధావిధిగా జరుగుతుందని …

Read More »

ఈ నెల 28న ఎన్జీజీవోస్ నగరశాఖ ఎన్నికలు

-ఎన్నికల అధికారి వి.వి.ప్రసాద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ఎన్జీజివోస్ అసోసియేషన్ విజయవాడ నగర శాఖకు ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నట్లు ఎన్నికల అధికారి ఏపీ ఎన్జీజివోస్ జిల్లా సహాధ్యక్షుడు వి.వి ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ ఎన్జీజీఓస్ అసోసియేషన్ విజయవాడ నగర శాఖ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాను ఈనెల 16 న ఎన్జీవోస్ హోమ్ నందు పబ్లిష్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎన్నికలకు నామినేషన్లు డిసెంబర్ 22న స్వీకరించడం, జరుగుతుందన్నారు. నగర శాఖకు …

Read More »

ప్ర‌జ‌ల‌కు మంచి చేయ‌డ‌మే క్రీస్తు మార్గం

-20 ఏళ్ల త‌రువాత సాగ‌ర్ కాల్వ పొలాల‌కు నీళ్లిచ్చాం -కుల‌మతాల మధ్య గొడవలకు సైతానులు సిద్ధంగా ఉన్నారు -ప్ర‌తి అవ‌కాశాన్నీ ప్ర‌జ‌ల మంచి కోసం వినియోగిస్తున్నాం -గ్రాండ్ క్రిస్మ‌స్ వేడుక‌ల్లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జ‌ల‌కు మంచి చేయ‌డ‌మే అసలైన క్రీస్తు మార్గ‌మ‌ని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ స్ప‌ష్టం చేశారు. అద్దంకి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని క‌ట్ట‌క్రింద‌పాలెం సెంటిన‌రీ తెలుగు బాప్టిస్ట్ చ‌ర్చ్ లో ఆదివారం జ‌రిగిన గ్రాండ్ …

Read More »

నగరంలో ఉత్కంఠ భరితంగా కొనసాగిన పికిల్‌ బాల్‌ లీగ్‌-సీజన్‌ 1

-విజయం సాధించిన ది పికిల్‌ బాల్‌ రిపబ్లిక్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో విజయవాడ పికిల్‌ బాల్‌ లీగ్‌ ఉత్కంఠ భరితంగా సాగింది. ఆదివారం లలితా జ్యూయలరీ ప్రక్క రోడ్డులోగల పికిల్‌ బాల్‌ సెంటర్‌లో జరిగిన పోటీలలో హయ్యత్‌ రైజెస్‌-పికిల్‌ బాల్‌ రిపబ్లిక్‌ జట్ల మధ్య ఫైనల్‌ పోరు హోరాహోరీగా జరిగింది ఈ పోరులో పికిల్‌ బాల్‌ రిపబ్లిక్‌ జట్టు విజయం సాధించింది. నిర్వాహకులు డాక్టర్‌ శ్రావ్య వాసిరెడ్డి, డాక్టర్‌ ఆకర్ష కోటగిరి ఆధ్వర్యంలో విజయవాడ పికిల్‌ బాల్‌ లీగ్‌ కార్యక్రమం …

Read More »

నగరంలో గాయత్రి రెడ్డి సిల్క్స్ ప్రారంభం

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో గాయత్రి రెడ్డి సిల్క్స్ ను లబ్బీపేట లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీమాన్ చిన జీయర్ స్వామీజీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామీజీ ఆశీర్వాదం కోసం భక్తులు,అభిమానులు విశేష సంఖ్యలో తరలి వచ్చారు. శ్రీమాన్ చిన జీయర్ స్వామీజీ భక్తులకు అభివాదం చేసి అనుగ్రహ భాషణ చేశారు. గాయత్రి రెడ్డి సిల్క్స్ వ్యాపార రంగంలో దినదినా భివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం గాయత్రి రెడ్డి సిల్క్స్ యాజమానులు గాయత్రి, జ్యోత్న్స మాట్లాడుతూ విజయవాడ …

Read More »

పిన్నెల్లి సోద‌రులు న‌ర‌హంత‌కులు….రాష్ట్ర ప్ర‌జ‌లు వారి అరెస్ట్ స్వాగ‌తిస్తున్నారు : మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న‌

-కొవ్వొత్తుల ప్రదర్శనకు పిలుపు నిచ్చిన‌ పులివెందుల ఎమ్మెల్యే జ‌గ‌న్ పై మండిప‌డ్డ బుద్ధా -పిన్నెల్లి అరాచ‌కాల‌కు వై.ఎస్.జ‌గ‌న్ బాధ్యుడు -జగన్ ఒక రాక్షసుడైతే, పిన్నెల్లి సోదరులు నరరూప రాక్షసులు.. విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి, ఆయ‌న సోద‌రుడు వెంక‌ట రామి రెడ్డి ఇద్ద‌రు న‌రరూప రాక్షసులైతే, పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.జ‌గ‌న్ రెడ్డి మ‌రోర‌కం రాక్ష‌సుడు. పిన్నెల్లి సోద‌రుల‌కు ద‌య‌,క‌ర‌ణ అన్న‌దే వుండ‌దు..వీరికి బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జ‌లంటే చుల‌క‌న….అందుకే వారి అరెస్ట్ ను రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ స్వాగ‌తిస్తున్నారు. …

Read More »

జిల్లాలో ప్ర‌తి మ‌హిళ‌ ఎంట‌ర్ ప్రెన్యూర్ గా రాణించాల‌న్న‌దే ఎంపీ కేశినేని శివ‌నాథ్ ల‌క్ష్యం

-కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీ చైర్మ‌న్ చెన్నుబోయిన చిట్టిబాబు , టిడిపి రాష్ట్ర కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి జంపాల సీతారామయ్య‌ -ఎంపి కేశినేని శివ‌నాథ్ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డికి 45 మంది మ‌హిళ‌ల‌తో బ‌య‌లుదేరిన బ‌స్సు -జెండా ఊపి బ‌స్సు ప్రారంభించిన చెన్న‌బోయిన , జంపాల -ఎన్.ఐ.ఆర్.డి లో కేశినేని ఫౌండేష‌న్ , ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఐదు రోజుల శిక్ష‌ణ‌ -నేచుర‌ల్ ఫార్మింగ్, వ‌ర్మీ కంపోస్ట్, తేనే తయారీ పై శిక్ష‌ణ‌ ఇబ్ర‌హీంప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా లో అర్బ‌న్ ప్రాంత, రూర‌ల్ …

Read More »

సుజనా చౌదరి ఆధ్వర్యంలో భవానీలకు ప్రసాద వితరణ

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : గిరి ప్రదక్షిణ చేస్తున్న భవానీ భక్తులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో ప్రసాదం, మజ్జిగ పంపిణీ చేశారు.. కుమ్మరిపాలెం, సితార జంక్షన్, సాయిరాం థియేటర్ సెంటర్, నెహ్రూ బొమ్మ సెంటర్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు పంపిణీ చేశారు.. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి అధికారులు ప్రత్తిపాటి శ్రీధర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు . కార్యక్రమంలో కూటమి నాయకులు చిన సుబ్బయ్య, కార్పొరేటర్ లు నరేంద్ర రాఘవ, ఉమ్మడి చంటి, సుజనా మిత్ర లు తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బృందావన థియేటర్ పక్కన గల నియోజకవర్గ టీడీపి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్భార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను ఓపిగ్గా ఆలకించిన ఆయన వారి సమస్యల పరిష్కారానికి భరోసా కల్పించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు …

Read More »