Breaking News

Daily Archives: January 26, 2026

బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం గొల్లపూడిలోని బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ జెండా ఎగరవేసి దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ దేశహితం కోసం ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా సమాజానికి న్యాయం, గౌరవం, అభివృద్ధి అందించడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వికసిత్ భారత్ సంకల్పాన్ని స్ఫూర్తిగా తీసుకొని, …

Read More »

ఐకమత్యంతోనే నగరాభివృద్ది సాధ్యం – రాయన భాగ్యలక్ష్మి, నగర మేయర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలందరికీ స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం అందించింది మన రాజ్యాంగ్యం – డాక్టర్ డి చంద్రశేఖర్, ఇంచార్జ్ కమిషనర్ ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధుల ఐకమత్యంతోనే నగరాభివృద్ది సాధ్యమన్నారు విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి. సోమవారం ఉదయం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాన కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు, ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ …

Read More »

భారత దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన యోధులను స్మరించుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన యోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, ప్రపంచంలోనే అత్యత్తమ రాజ్యాంగాన్ని అందించిన నాయకుల స్పూర్తితో గుంటూరు నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేపట్టడానికి కృషి చేస్తామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ షేక్ సజిలాలతో కలిసి నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, జిన్నాటవర్ సెంటర్లలో జాతీయ …

Read More »

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శాఖల స్టాల్ల్స్ సందర్శించిన ఇంచార్జి జిల్లా కలెక్టర్, ఎస్పీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాల్ల్స్‌ను ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్, జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ సందర్శించారు. ఈ సందర్భంగా పరిశ్రమలు – RTIH, బ్యాంకులు మరియు కేంద్ర ప్రాయోజిత పథకాలు, DRDA–MEPMA, ఐసిడిఎస్ (ICDS), మత్స్య సంపద, రెవెన్యూ శాఖ, SC, BC & ST సంక్షేమ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్ల్స్‌ను వారు పరిశీలించారు. ప్రతి స్టాల్ వద్ద ప్రదర్శించిన పథకాలు, …

Read More »

జిల్లా సమాచార పౌర సంబంధాల కార్యాలయ అధికారులకు , సిబ్బందికి గణతంత్ర దినోత్సవ ప్రశంసలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి వారి కార్యాలయానికి చెందిన అధికారులు, సిబ్బంది ఉత్తమ సేవలకుగాను ప్రశంసించి ధ్రువ పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె. లక్ష్మీ నారాయణ, డివిజనల్ పౌర సంబంధాల అధికారి ఎం. లక్ష్మణా చార్యులు, సీనియర్ అసిస్టెంట్ ఎం. కృష్ణ వేణి, డ్రైవర్ బి. వెంకట రమణలు జిల్లా కలెక్టర్ మేఘా స్వరూప్ చేతుల మీదుగా ఉత్తమ అధికారి, ఉద్యోగి …

Read More »

రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో 77వ గణతంత్ర దినోత్సవం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా కలెక్టర్ ఆఫీస్ వారు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఉత్సవాలలో జరిగిన వివిధ ప్రభుత్వ శకటాల ప్రదర్శన పోటీలలో రాజమహేంద్రవరం టౌన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నక్కపల్లి శామ్యూల్ ఆధ్వర్యంలో తయారుచేయబడిన తూర్పు గోదావరి సర్కిల్ విద్యుత్ శకటం మొదటి స్థానం గెలుపొందింది. గత మూడు దఫాలుగా మొదటి స్థానం గెలుచుకోవడం విద్యుత్ సిబ్బంది యొక్క పట్టుదలని సూపరింటెండింగ్ ఇంజనీర్ కె తిలక్ కుమార్ అభినందించారు.

Read More »

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందిస్తూ ప్రశంసా పత్రాలు అందుకున్న జిల్లా అధికారులు….

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, విజయవాడ మున్సిపల్ కమీషనర్ హెచ్ ఎం.ధ్యానచంద్ర, రెవెన్యూ డివిజనల్ అధికారులు విజయవాడ, నందిగామ. తిరువూరు కె. చైతన్య, బాల కృష్ణ, ఎం. మాధవి, ఎస్డీఎంఎస్డీ ఎగ్జిక్యూటివ్ అధికారి సీనా నాయక్, దేవాదాయ అసిస్టెంట్ కమీషనర్ ఎన్. షణ్ముగం, జిల్లా మత్స్య శాఖ సిఎస్ చక్రాణి, ఉద్యానవన అధికారి పి. పరమేశ్వర రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఎస్. శ్రీనివాసరావు, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ ఎ. …

Read More »

ఉత్తమ సేవకు ప్రతిభ పురస్కారం…

-ప్రశంసా పత్రం అందుకున్న డీఐపీఆర్వో కార్యాలయం అధికారులు, సిబ్బంది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలిచే సమాచార పౌర సంబంధాల శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది అందించిన ఉత్తమ సేవలకుగాను జిల్లా కలెక్టర్ నుండి ప్రశంసా పత్రాలు అందుకున్నారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలలో సమాచార పౌర సంబంధాధికారి కేవీ. రమణారావు, అదనపు పీఆర్వో కె. రవి, ఏవీ సూపర్వైజర్ వివి. ప్రసాద్, …

Read More »

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల్లో విద్యార్థులు, కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశభక్తి గీతాలు, శాస్త్రీయ నృత్యాలు ద్వారా భారతదేశపు సాంస్కృతిక వైవిధ్యం, మ‌హ‌నీయుల త్యాగాలు, దేశ కీర్తి శిఖ‌రాల స‌మ‌ర్థ‌త‌ను, ప్ర‌తిభ‌ను ప్ర‌తిబింబించాయి. ముఖ్యంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేసే ప్రదర్శనలు ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాలను రేకెత్తించాయి. ఏకేటీపీ మునిసిప‌ల్ హైస్కూల్ (స‌త్య‌నారాయ‌ణ‌పురం), శ్రీరామ్ ప‌బ్లిక్ స్కూల్ (సింగ్‌న‌గ‌ర్‌), డీఎస్ఎంసీ హైస్కూల్ (విద్యాధ‌ర‌పురం), క‌ళాక్షేత్ర డ్యాన్స్ అకాడ‌మీ, పావ‌ని న‌రేంద్ర …

Read More »

గణతంత్ర దినోత్స‌వ వేడుకలలో ప్రదర్శించిన శకటాలు అభివృద్ధి ప్ర‌యాణాన్ని అద్భుతంగా చాటిచెప్పాయి.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గణతంత్ర దినోత్స‌వ వేడుకలలో ప్రదర్శించిన శకటాలు అభివృద్ధి ప్ర‌యాణాన్ని అద్భుతంగా చాటిచెప్పాయి. మొత్తం 18 శాఖ‌ల శ‌క‌టాలు స్వ‌ర్ణాంధ్ర ప‌ది సూత్రాల కార్యాచ‌ర‌ణను క‌ళ్ల‌కుక‌ట్టాయి.  దుర్గామ‌ల్లేశ్వర స్వామివార్ల దేవ‌స్థానం, స్వ‌ర్ణాంధ్ర 2047 (దార్శ‌నిక ప్ర‌ణాళిక‌లు), జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (పేద‌రికం లేని స‌మాజం), పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌, సంస్థ (దీపం-2 ప‌థ‌కం), ప‌ర్యాట‌క శాఖ (కొండ‌ప‌ల్లి ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌), పాఠ‌శాల విద్యాశాఖ (విలువ ఆధారిత విద్య‌), ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్‌, ఈగ‌ల్ (మాద‌క‌ద్ర‌వ్య ర‌హిత జిల్లా, న‌వోద‌యం 2.0), …

Read More »