-బడ్జెట్–2026 పేదలు, మహిళలు, యువత అభివృద్ధికి దిశానిర్దేశం -ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్–2026 దేశ పేదలు, మహిళలు, యువత అభివృద్ధిని కేంద్రబిందువుగా ఉంచిన సమగ్ర, సమతుల్య బడ్జెట్ అని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ అన్నారు. అభివృద్ధి–సంక్షేమాల మధ్య సరైన సమన్వయంతో రూపొందిన ఈ బడ్జెట్ దేశ ఆర్థిక భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, …
Read More »Monthly Archives: February 2026
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక… : కమిషనర్ కె.మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 2వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »కేంద్ర బడ్జెట్ శ్లాఘనీయం
-ఆలోచనలో స్పష్టత, చిత్తశుద్ధి, సరైన వ్యూహాలతో రూపొందిన బడ్జెట్ -దేశం ఆత్మ నిర్భరత దిశగా మరో ముందడుగు అన్న వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ -దేశ ప్రగతికి దోహదం చేసే విధాన పత్రం -క్యాన్సర్ తో పాటు 17 ప్రాణాంతక ఔషధాలపై దిగుమతి సుంకాలు తగ్గించడం స్వాగతీయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఆదివారంనాడు లోక్సభలో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ శ్లాఘనీయమని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్యా …
Read More »క్లీన్ చిట్ అంటే చంద్రబాబు ను చూసి వైసీపీ నేర్చుకోవాలి
-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : క్లీన్ చిట్ అంటే ఏమిటో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని చూసి వైసీపీ నేతలు నేర్చుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హితవు పలికారు. గతంలో తిరుమల లడ్డూల కల్తీ నెయ్యి వ్యవహారంలో తమకు క్లీన్ చిట్ రాలేదని తెలిసినా వైసీపీ ఫేక్ బ్యాచ్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిందని విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు పై …
Read More »ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో పెద్దపీట
-క్రిటికల్ మినరల్ వెలికితీతకు ప్రాధాన్యమివ్వడం అతిపెద్ద నిర్ణయం -అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుతో అభివృద్ధి వేగవంతం -ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం, యువతకు పారిశ్రామిక శిక్షణకు ప్రాధాన్యమివ్వడం హర్షణీయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : క్రిటికల్ మినరల్స్ వెలికితీతకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఏపీని దేశ ముఖచిత్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు మంచి అవకాశమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో మైనింగ్ సహా ప్రాసెసింగ్, వేల్యూ యాడెడ్ …
Read More »కేంద్ర బడ్జెట్ 2026కు ఏపీ ఛాంబర్స్ స్వాగతం; ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులపై ఆందోళన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ ఫెడరేషన్ (AP Chambers) ఈరోజు మీడియా సమావేశం నిర్వహించి, కేంద్ర బడ్జెట్ 2026పై తమ అభిప్రాయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి ఏపీ ఛాంబర్స్ అధ్యక్షులు పొట్లూరి భాస్కరరావు మాట్లాడుతూ… “రికార్డు స్థాయిలో తొమ్మిదవ సారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి మేము అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు వాణిజ్య అవాంతరాల నేపథ్యంలో, ఇది ఒక …
Read More »వన్నె తగ్గని శత వసంతాల కమ్యూనిస్టు పార్టీకి నిబద్ధత కలిగిన కార్యకర్తలే అసలైన అసలైన ఆస్తి… : జి.కోటేశ్వరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిబ్బధత కలిగిన కార్యకర్తలే వెన్నెముకగా నిలిచి భారత దేశంలో కమ్యూనిస్టు ఉద్యమని నిత్య నూతనంగా 100 సంవత్సరంలోకి తీసుకొనివెళ్లారని సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ, 36వ డివిజన్ నాయకులు ఎం.వి. క్రిష్ణయ్య అధ్యక్షతన జరిగిన డివిజన్ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భముగా కోటేశ్వరరావు మాట్లాడుతూ అనునిత్యం ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేయడం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త …
Read More »
Prajavartha Online Telugu News