Breaking News

Monthly Archives: February 2026

యానాది గిరిజనుల అభివృద్ధి చేయడం లో ప్రభుత్వాలు కృషి చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యానాదులను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం కృషి చేయాలని , ఆలిండియా యానాది మహానాడు సంఘం సమావేశంలో జాతీయ అధ్యక్షుడు మెలిక శ్రీనివాసరావు అన్నారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం యానాదుల్ని అన్ని విధాల ఆదుకుని అభివృద్ధి చేస్తామని నమ్మించి మోసం చేయడమే కాకుండా రాష్ట్రంలో యానాదులపై దాడులు అత్యాచారాలు భూకబ్జాలు చేస్తూ, చిత్రహింసలు గురి చేశారని అన్నారు. రాష్ట్రంలో 10 లక్షల పై …

Read More »

నగరంలో ఎన్.ఆర్. ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఎన్ఆర్ ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్ ప్రారంభించడం జరిగింది. శనివారం అరండల్ పేట లో ప్రభుత్వ విప్ మరియు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా 25వ డివిజన్ కార్పొరేటర్ మాచర్ల గోపి, బోండా ఉమా కుమారుడు బోండా సిద్ధార్థ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ అత్యంత సన్నిహితులైన ఎన్ ఆర్ ఫ్లెక్స్ ప్రింటింగ్ నిర్వాహకుడు అయిన రాజేష్ ఈ షాపును నూతనంగా …

Read More »

క్వాంటం వ్యాలీతో నోబెల్ లక్ష్యానికి ఆంధ్రప్రదేశ్ చారిత్రాత్మక ముందడుగు

-మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వంలో ఐబీఎం క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం కావడం ఆంధ్రప్రదేశ్ సాంకేతిక చరిత్రలో మైలురాయిగా నిలిచిందని మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి క్వాంటం టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న ఐబీఎంతో భాగస్వామ్యం ద్వారా ఈ సెంటర్ స్థాపన, అమరావతిని గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్‌పై నిలబెట్టే వ్యూహాత్మక నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని …

Read More »

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

-2027 డిసెంబరు నాటికి అందరికీ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకం -14 విశిష్ట భద్రతా ఫీచర్లతో పాస్ పుస్తకం…రికార్డుల ట్యాంపరింగ్ కు ప్రయత్నిస్తే జైలుకే -తాడేపల్లి వద్ద హెలిపాడ్ కోసం ప్రైవేటు భూమిని 22ఏలో పెట్టారు -కర్నూలు జిల్లా కలుగట్లలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ను భూవివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 2027 డిసెంబరు నాటికి సర్వే పూర్తి చేసి రాష్ట్రంలో రైతులు, …

Read More »

రాష్ట్రంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం

-కేంద్రమంత్రితో కలిసి ‘క్వాంటం వ్యాలీ’కి రేపు సీఎం చంద్రబాబు శంకుస్థాపన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ భవిష్యత్ సాంకేతిక రంగాన్ని మలుపుతిప్పే చారిత్రక ఘట్టానికి అమరావతి శనివారం వేదికగా నిలవనుంది. ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రూపొందించిన ‘అమరావతి క్వాంటమ్ వ్యాలీ’ భవన నిర్మాణానికి రేపు పునాదిరాయి పడుతోంది. దీని ద్వారా భారతదేశం క్వాంటమ్ విప్లవానికి నాయకత్వం వహించే అవకాశం రాష్ట్రానికి రానుంది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖా మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి ముఖ్యమంత్రి …

Read More »

నగరంలో ‘శ్రీవిద్య లగ్జరీ షోరూమ్’ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో వారసత్వ ఫ్యాషన్ కోసం ఒక కొత్త గమ్య స్థానం ‘శ్రీవిద్య లగ్జరీ షోరూమ్’ ఆవిష్కృతమైంది. శుక్రవారం బందరురోడ్డులో అత్యంత ప్రీమియం షోరూమ్ ‘శ్రీవిద్య లగ్జరీ షోరూమ్’ను సినీనటి పాయల్ రాజ్‌పుత్ ప్రారంభించగా గౌరవ అతిథిగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సండర్భంగా సినీనటి పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ… తనకు చీరల సొగసు శాశ్వతత్వం అంటే ఎప్పుడూ చాలా ఇష్టమన్నారు. శ్రీవిద్య కలెక్షన్ నిజంగా మంత్రముగ్ధులను చేసేలా వుందన్నారు. ముఖ్యంగా సాంప్రదాయ నేతలను …

Read More »

నగరంలో ఎస్ ఎస్ గిఫ్ట్ ఐటమ్స్ ఈవెంట్స్, డెకరేషన్ ఐటమ్స్ షాపు ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఎస్ ఎస్ ఈవెంట్స్ అండ్ డెకరేషన్ ఐటమ్స్ షాప్ నూతనంగా ప్రారంభించారు. శుక్రవారం ఏలూరు రోడ్ లో సీతారామపురం జంక్షన్ వద్ద సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అయిన బోండా ఉమామహేశ్వర రావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ ఎస్ ఈవెంట్స్ అండ్ డెకరేషన్ ఐటమ్స్ షాపు యాజమాన్యానికి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శుభకార్యాలకు ఈవెంట్స్ నిర్వహించటం డెకరేషన్ చేయడంలో సుమారు పది సంవత్సరాల పైన అనుభవం …

Read More »

రైజ్ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోండి

– మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగండి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త గుంటుపల్లిలోని రూరల్ ఇంక్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ సెంటర్ (రైజ్)లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ శుక్రవారం గుంటుపల్లిలోని రైజ్ కేంద్రాన్ని సందర్శించి, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యశాలలను పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడి, అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి …

Read More »

స్వ‌ర్ణాంధ్ర‌కు అక్ష‌రాంధ్ర సౌర‌భాలు

– కార్య‌క్ర‌మం విజ‌య‌వంతానికి నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అక్ష‌రాంధ్ర కార్య‌క్ర‌మాన్ని స‌ద్వినియోగం చేసుకొని నిర‌క్ష్య‌రాస్యులు అక్ష‌రాస్యులుగా మారి.. బంగారు భ‌విత‌కు బాట‌లు వేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. ఉల్లాస్ కార్య‌క్ర‌మంలో భాగంగా విజ‌య‌వాడ అర్బ‌న్ ప‌రిధిలోని రామ‌లింగేశ్వ‌ర‌న‌గ‌ర్‌లో నిర్వ‌హిస్తున్న అక్ష‌రాంధ్ర కేంద్రాన్ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ శుక్ర‌వారం సాయంత్రం సంద‌ర్శించారు. అక్ష‌ర జ్ఞానాన్ని పొందుతున్న మ‌హిళ‌ల‌తో మాట్లాడి, వారి అభ్య‌స‌న సామ‌ర్ధ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. కార్య‌క్ర‌మానికి హాజ‌రైన …

Read More »

బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటాం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాధితురాలి కుటుంబానికి అండగా ఉండి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. మెడికో దీపిక మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్  రాయపాటి శైలజ శుక్రవారం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను, తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మీడియా ప్రతినిధులతో చైర్ పర్సన్ మాట్లాడుతూ.. మెడికో దీపిక …

Read More »