Breaking News

Daily Archives: March 11, 2026

ఎన్నిసార్లు చెప్పినా….ఏలూరు జీజీహెచ్ సిబ్బంది తీరు మారదా?

– పేషెంట్ల పట్ల ఇంత నిర్లక్ష్యం ఏంటి? – ఏలూరులో శిశువు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోండి… – ఏలూరు ఆర్.ఎం.ఓ కు మంత్రి సారథి సీరియస్ వార్నింగ్…. – ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై మంత్రి పార్థసారథి సీరియస్…. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు మృతిచెందిన ఘటనపై రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార మరియు పౌరసంబంధాలశాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి సీరియస్ అయ్యారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ల పట్ల సిబ్బంది …

Read More »

రైతుల కోసం ఏఐ ఆగ్రోన‌మిస్ట్‌

-ఇప్ప‌టికే 5.45ల‌క్ష‌ల మంది రైతుల న‌మోద‌ -రైతులంతా దీన్ని ఉప‌యోగించుకునేలా చూడాలి -ఎల్‌నినో తీవ్ర‌త పొంచి ఉంది -జూన్‌-ఆగ‌స్టు మ‌ధ్య సాధార‌ణ స్థాయిని మించి ఎండ‌లు -ప్ర‌భుత్వం తద‌నుగుణంగా స‌న్న‌ద్ధంగా ఉంది – జిల్లాల్లోనూ స‌మ‌స్య‌లు రాకుండా చూడాలి -వ్య‌వ‌సాయ‌శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుడితి రాజ‌శేఖ‌ర్‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల‌కు బ‌హుళ ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉండేలా ప్ర‌భుత్వం రైతుల కోసం ప్ర‌త్యేకంగా ఏఐ ఆగ్రోన‌మిస్ట్ యాప్ తీసుకొచ్చింద‌ని, దీన్ని రైతులంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా ఉప‌యోగించుకునేలా జిల్లా క‌లెక్ట‌ర్లు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వ్య‌వ‌సాయ‌శాఖ …

Read More »

16 న విజయవాడలో రాష్ట్రస్థాయి ప్రభుత్వ ఇఫ్తార్

-రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాల్లో ఇఫ్తార్ ఏర్పాట్లు -ఇఫ్తార్ ఏర్పాట్ల కోసం రూ. 1.50 కోట్లు విడుదల అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్ మాసంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల స్థాయిలో ఇఫ్తార్ ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.1.50 కోట్లు నిధులను విడుదల చేసింది.ముస్లిం మైనారిటీల కు అత్యంత భక్తిశ్రద్ధలతో కూడిన రంజాన్ మాసంలో సాయంకాలం ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 16వ తేదీన రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఇఫ్తార్ కార్యక్రమాన్ని విజయవాడలో ఏ-కన్వెన్షన్ సెంటర్లో …

Read More »

గల్ఫ్ ఉద్రిక్తతలపై ఆందోళన అవసరం లేదు

– రొయ్యల రైతులు పానిక్ హార్వెస్టింగ్ చేయొద్దు – వదంతులను నమ్మకుండా శాస్త్రీయంగా అక్వాకల్చర్ కొనసాగించాలి – షిప్పింగ్ కంటైనర్ల కొరతపై ప్రచారం అసత్యం – వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రొయ్యల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బుధ‌వారం విజ‌య‌వాడ క్యాంప్ కార్యాల‌యం నుండి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర …

Read More »

ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు బ‌డ్జెట్‌

-త్వ‌ర‌లో జిల్లాలో బ‌డ్జెట్ స‌మావేశాలు -ప్ర‌జ‌ల‌కు బ‌డ్జెట్ గురించి వివ‌రించాలి -రాబోయేది అసాధ‌ర‌ణ వృద్ధి సంవ‌త్స‌రం -అధికారులు ద్విగిణీకృత ఉత్సాహంతో ప‌నిచేయాలి -కేంద్రం నుంచి వ‌చ్చే ప్ర‌తి పైసా ఖ‌ర్చు చేద్దాం -అధికారుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ సూచ‌న‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర బ‌డ్జెట్‌ను ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు తీసుకెళ్లేలా ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం రూపొందిస్తోంద‌ని, త్వ‌ర‌లోనే జిల్లాల్లో బ‌డ్జెట్ స‌మావేశాలు ఏర్పాటు చేసి ప్ర‌జ‌ల‌కు బ‌డ్జెట్ గురించి వివ‌రిస్తామ‌ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ తెలిపారు. …

Read More »

6వ జిల్లా కలెక్టర్ల సమావేశానికి స్వాగతం పలికిన సిసిఎల్ఏ జయలక్ష్మి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాష్ట్ర సచివాలయంలో రెండు రోజుల పాటు జరిగే 6వ జిల్లా కలెక్టర్ల సమావేశానికి సిసిఎల్ఏ జయలక్ష్మి స్వాగతం పలికారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ముందుగా మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను మరింత మెరుగైన రీతిలో అమలు చేసేందుకు అధికారుల పని తీరును మదింపు చేసేందుకు ఈసమావేశం దోహద పడుతుందని పేర్కొన్నారు. 2047 నాటికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా 55 లక్షల రూ.ల తలసరి ఆదాయం సాధించే విధంగా ప్రయత్నాలు …

Read More »

ఢిల్లీలో కూటమి ఎంపీల ఆత్మీయ సమావేశం

-కేంద్ర మంత్రి రామ్మోహన నాయుడు ఇంట్లో విందు -పాల్గొన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి , యువ నేత నారా లోకేష్ -విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ( చిన్ని)ను ఆప్యాయంగా పలకరించిన యువ నేత, మంత్రి లోకేష్ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి పార్టీ లకు చెందిన ఎంపీ లు అందరూ బుధవారం ఆత్మీయంగా సమావేశమయ్యారు. కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఇంట్లో మధ్యాహ్నం జరిగిన విందులో కూటమి ఎంపీలు అందరూ …

Read More »

శివాజీ వర్ధంతి వేడుకలు..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో ఛత్రపతి శివాజీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శంభాజీ మహరాజ్ చిత్ర పఠానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. హిందూ సనాతన ధర్మ పరిరక్షకుడు, సనాతన ధర్మ యోధుడిగా భారత దేశ చరిత్రలో శివాజీ పేరు చిరస్మరనీయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, విశ్వహిందూ పరిషత్ నాయకుడు శివాజీ, టీడీపీ నాయకుడు వక్కలగడ్డ భాస్కరరావు, కూటమి నాయకులు, సుజనా మిత్ర కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

Read More »

కూటమిపై బురద జల్లడం మానుకో

-జగన్ కు మంత్రి సవిత హెచ్చరిక -మెసాలకు, అబద్ధాలకు మారుపేరు నువ్వు -నీకు విజన్ లేదు.. రాష్ట్రం గురించి ఆలోచన లేదు.. -ఉనికి కోసం వారాంతపు రాజకీయాలు -నువ్వు విద్యుత్ ఛార్జీలు పెంచితే.. -ట్రూడౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీలు తగ్గించాం -ఉద్యోగులను మోసగించావ్… కేసులతో వేధించావ్ -ఆస్తుల కోసం చెల్లిని, తల్లిని గెంటేసిన చరిత్ర నీతి -నీ అసమర్థ పాలనతో వ్యవస్థలన్నీ ధ్వంసం -జగన్ పై మంత్రి సవిత విసుర్లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మోసాలకు, అబద్ధాలకు మారు పేరు జగన్ …

Read More »

రాష్ట్ర పండుగగా మొల్ల జయంతి

-ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణ -విజయవాడలో రాష్ట్ర స్థాయి జయంత్యోత్సవం -రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మొట్టమొదటి తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్ల(మొల్లమాంబ) జయంతిని ఈ నెల 13న రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆమె వెల్లడించారు. కవయిత్రి ఆతుకూరి …

Read More »