Breaking News

నల్ల హనుమంతుడు ఆలయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీరాముని పరమ భక్తుడు హనుమంతుడు. పురాణాల ప్రకారం హనుమంతుడు తనకు శ్రీరామునిపై తన భక్తిని, విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి తన శరీరాన్ని సింధురంతో నింపుకున్నాడు. చిరంజీవి అయిన హనుమంతుడు కలియుగంలో తన భక్తుల కష్టాలను తొలగిస్తాడని నమ్ముతారు. అందుకే ఆ సేతు హిమాచలం ఆంజనేయస్వామి ఆలయాలున్నాయి. చిన్న చిన్న గల్లీ నుంచి భారీ విగ్రహాలు దర్శనం ఇస్తాయి. అయితే ఒక ప్రాంతంలో మాత్రం హనుమంతుడు నల్లని రూపంలో దర్శనం ఇస్తాడు. దీని సంబంధించిన పురాణం కథ కూడా ఉంది. ఆ ఆలయం ఎక్కడ ఉంది .. విశిష్టత ఏమిటి తెలుసుకుందాం..

ఈ ఆలయం ఎక్కడ ఉందంటే
జైపూర్‌లోని హవా మహల్ సమీపంలో హనుమంతుడు ఆలయం ఉంది. ఇక్కడ ఆలయంలో హనుమాన్ విగ్రహం నల్లని రంగులో ఉంటుంది. కనుక ఈ ఆలయాన్ని నల్ల హనుమంతుడు ఆలయం అని పిలుస్తారు. ప్రతిరోజూ భక్తులు ఇక్కడ హనుమంతుడు దర్శనం కోసం వస్తాయి. అయితే ఈ భక్తుల రద్దీ మంగళవారం అత్యధికంగా ఉంటుంది. ఈ ఆలయంలో హనుమంతుడు తూర్పు ముఖంగా ఉన్నాడు.
నల్ల హనుమంతుడు విగ్రహ రహస్యం

దేశంలో హనుమంతుడికి సంబంధించిన అనేక ఇతర దేవాలయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మాత్రం నలుపు రంగు విగ్రహాన్ని పూజిస్తారు. పురాణాల ప్రకారం హనుమంతుడు.. ప్రత్యక్ష దైవం సూర్యుడి వద్ద తన విద్యను పూర్తి చేశాడు. అప్పుడు తన గురువు సూర్యుడిని గురు దక్షిణ కోసం అడగమని కోరాడు. అప్పుడు సూర్యుడు తన శిష్యుడు హనుమంతుడితో తన కుమారుడు శనీశ్వరుడు తన మాట వినడం లేదని అతనిని తిరిగి తీసుకురావాలని అభ్యర్థించాడు. ఇదే తనకు ఇవ్వాల్సిన గురుదక్షిణ అని చెప్పాడు.

శనీశ్వరుడు వద్దకు హనుమంతుడు
గురువు కోరిక విన్న హనుమంతుడు శనీశ్వరుడు వద్దకు చేరుకున్నాడు. అతని తండ్రి వద్దకు తిరిగి రావాలని ప్రార్థించడం ప్రారంభించాడు. అయితే శనీశ్వరుడు హనుమంతుడిని చూసిన తర్వాత చాలా కోపంగా ఉన్నాడు. అప్పుడు శనీశ్వరుడు దృష్టి హనుమంతుడిపై పడింది. దీంతో హనుమంతుడి ఛాయ నల్లగా మారింది.

వరం ఇచ్చిన శనీశ్వరుడు
శనీశ్వరుడు దృష్టి పడినా హనుమంతుడిపై ఎటువంటి ప్రభావం చూపలేదు. హనుమంతుడు శనీశ్వరుడిని ఒప్పించడంలో విజయం సాధించాడు. దీంతో శనీశ్వరుడు.. హనుమంతుడు భక్తికి కార్యదీక్షకు సంతోషించాడు. ఎవరైనా శనివారం రోజున హనుమంతుడిని పూజిస్తే.. తన ప్రభావం ఆ వ్యక్తిపై చూపదని వాగ్దానం చేశాడు.

దారం కట్టుకుంటే వ్యాధులు నయం
హనుమంతుని ఆశీస్సులతో ఇక్కడ అద్భుత ఒక దారం తయారు చేయబడిందని నమ్మకం. ఈ ఆలయంలోని దారం కోసం విదేశాల నుంచి ప్రజలు ఇక్కడకు వస్తారని ఒక ప్రత్యేక నమ్మకం. ఇక్కడ ఇచ్చే దారం పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది. ఇది పిల్లల ఆరోగ్యాన్ని బాగు చేస్తుందని నమ్మకం. అంతేకాదు హనుమంతుని దర్శనం కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను దూరప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకువస్తారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *