Breaking News

తుంగభద్ర డ్యామ్ లో స్టాప్ లాగ్ గేట్ అమరికలో మొదటి భాగం పూర్తి పై చంద్రబాబు అభినందనలు

-సమిష్టిగా పనిచేసి విజయం సాధించారన్న ముఖ్యమంత్రి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తుంగభద్ర డ్యామ్ లో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ గేట్ అమరిక ప్రక్రియ విజయవంతం అవ్వడంపై సిఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 6 రోజుల క్రితం ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడంతో అనివార్యంగా డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయాల్సి వచ్చింది. డ్యామ్ నుంచి దాదాపు 60 టిఎంసి నీటిని విడుదల చేస్తే తప్ప స్టాప్ లాగ్ గేట్ అమర్చడం సాధ్యం కాని పరిస్థితిలో అధికారులు అత్యంత సమర్థవంతంగా పనిచేసి నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్న సమయంలోనే స్టాప్ లాగ్ గేటు అమరిక ప్రక్రియ ప్రారంభించారు. ఎపికి చెందిన రిటైర్డ్ అధికారి కన్నయ్యనాయుడు నేతృత్వంలో యుద్ద ప్రాతిపదికన గేట్లు డిజైన్లు చేయించి పనులు మొదలు పెట్టారు. మూడు భాగాలుగా చేపట్లే ఈ ప్రక్రియలో మొదటి భాగాన్ని విజయవంతంగా కొద్ది సేపటి క్రితం పూర్తి చేశారు. గేటు అమరిక విషయంలో ఎపి ప్రభుత్వం కర్నాటక ప్రభుత్వానికి అవసరమైన సాయాన్ని అందించింది. గేట్ అమరిక పరిణామాలను అనంతపురం జిల్లా మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఉన్నా, నీటి ప్రవాహం ఉన్న సమయంలో స్టాప్ లాగ్ గేటు విజయవంతంగా అమర్చడాన్ని చంద్రబాబు అభినందించారు. సమిష్టి కృషితో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని సిఎం అన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయిన సిబ్బంది, కార్మికులు, అధికారులకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. విపత్తు సమయంలో ముందుకు వచ్చి పనిచేసిన రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడుకు సిఎం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పని మొత్తం పూర్తి అయ్యేవరకు సమన్వయంతో పనిచేసి సమస్యను పూర్తిగా అధిగమించాలని రాష్ట్ర అధికారులు, మంత్రులకు సిఎం సూచించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *