Breaking News

అన్న క్యాంటీన్లకు మాజీ ఎంపీ గోకరాజు కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు రూ.కోటి విరాళం ఇచ్చారు. ఈ చెక్‌ను ఆదివారం మంత్రి నారా లోకేశ్‌కు అందజేశారు. గంగరాజు చేయూతకు, ఉదార సహకారానికి మంత్రి లోకేశ్‌ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మెరుగైన ఆంధ్రప్రదేశ్‌కు బాటలు వేసేందుకు వివిధ భాగస్వాములు కలిసి వస్తున్నందుకు సంతోషిస్తున్నానంటూ, గంగరాజు విరాళమిచ్చిన ఫొటోను ‘ఎక్స్‌’లో మంత్రి లోకేశ్‌ పోస్ట్‌ చేశారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *