Breaking News

ముఖ్యమంత్రుల సహాయనిధికి విరాళాలు ప్రకటిస్తున్న సినీ ప్రముఖులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదలు.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి విరాళాలు ప్రకటిస్తున్న సినీ ప్రముఖులు.. ఉభయ తెలుగు రాష్ట్రాలు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. ఎప్పుడు, ఏ కష్టం వచ్చినా ముందుగా స్పందించేది టాలీవుడ్ పరిశ్రమే. ఈసారి కూడా సెలబ్రిటీలు రెండు తెలుగు రాష్ట్రాలలో సంభవించిన విపత్తు నుండి బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే సెలబ్రిటీలెందరో ఏపీ, తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటించారు. ప్రకటిస్తున్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్- ఏపీకి రూ. కోటి

నందమూరి బాలకృష్ణ- ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు

సూపర్ స్టార్ మహేష్ బాబు- ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్- ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు

వైజయంతీ మూవీస్- ఏపీకి రూ. 25 లక్షలు

త్రివిక్రమ్ – రాధాకృష్ణ – నాగవంశీ: ఏపీకి రూ. 25 లక్షలు, తెలంగాణకు రూ. 25 లక్షలు

ఆయ్ మూవీ నిర్మాత బన్నీ వాస్: ‘ఆయ్’ ఈ వారం కలెక్షన్స్‌లో 25 శాతం ఏపీకి

విశ్వక్సేన్- ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు

సిద్ధు జొన్నలగడ్డ- ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 15 లక్షలు

వెంకీ అట్లూరి- ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు

అనన్య నాగళ్ల- ఏపీకి రూ. 2.5 లక్షలు, తెలంగాణకు రూ. 2.5 లక్షలు

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *