Breaking News

శానిటేషన్ సిబ్బందికి నిత్యవసర సరుకులు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బుడమేరు ముంపు గురయిన మన 42 వ డివిజన్ ప్రజలకు ఎనలేని సేవలు చేసిన శానిటేషన్ సిబ్బందికి నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య , ప్రజలలో ఉండి ఎనలేని సేవలు చేసినటువంటి శానిటేషన్ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా అభినందించాలి ఎందుకంటే మనకోసం వాళ్ళ ఆరోగ్యాన్ని గాని వాళ్ళ కుటుంబాన్ని గాని పట్టించుకోకుండా మనకు సేవలు చేసిన పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి ఒక్కరు అండగా నిలవాలని కోరారు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తన విజనరీతో ప్రతి ఒక్క ఉద్యోగిని, ప్రజల్ని రక్షించుకోవడం కోసం పది రోజులు కలెక్టరేట్లో నుండి అహర్నిశలు శ్రమించి మన విజయవాడ నగర ప్రజలకు అందుబాటులో ఉన్నారు, 42 డివిజన్లో తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త నాయకుడు ప్రజలకు సేవలు చేస్తూ ఈ వరదల్లో మనందరికీ సేవలు అందించిన మన కార్యకర్తలను కూడా మన అభినందించుకోవాలి, ఎంపీ కేశినేని చిన్ని గారు, స్థానిక ఎంఎల్ఏ సుజన చౌదరి ఎప్పటికప్పుడు సూచనల ఇస్తూ ప్రభుత్వం ద్వారా పాలు , మినరల్ వాటర్ బాటిల్స్ , బిస్కెట్ , ఆహార పదార్థాలు , బ్రెడ్, సప్లై చెప్పించారు, ఈ కార్యక్రమంలో నెలకుర్తీ వెంకట్రావు , కోనపరెడ్డి నాగభూషణం, అందే మేరి, సీతా చంద్రశేఖర్ యనమల కాళిదాసు , పచ్చవ మల్లికార్జున, M.రమేష్, విజయ, సూరిబాబు, హలింబి, రామారావు, బుజ్జి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *