Breaking News

డీజీపీ కుమార్తె వివాహంలో మంత్రి సవిత

-నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి

హైదరాబాద్/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు కుమార్తె వివాహంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖ మాత్యులు ఎస్.సవిత పాల్గొన్నారు. శనివారం హైదరాబాద్ లోని సిటాడెల్ కన్వెన్షన్ సెంటర్ లో శనివారం జరిగిన ఈ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు గాయత్రి సొనాక్షి, రుత్విక్ సాయిని మంత్రి సవిత ఆశీర్వదించారు. వివాహా వేడుకకు హాజరైన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మంత్రి సవిత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, పలు శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

స్వచ్చంద సంస్థలు యాంటి బర్త్ కంట్రోల్ (ఏబిసి)కి సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు స్వచ్చంద సంస్థలు యాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *