కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు వేసవి సెలవులు ప్రకటించారు. కమిషన్ వారి ఆదేశాల మేరకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు వేసవి సెలవులను కమిషన్ కార్యదర్శి మరియు ముఖ్యకార్యనిర్వహణాధికారి ఎస్ వి రమణ మూర్తి హక్కుల కమిషన్ కు (Summer Vacation) నోటిఫికేషన్ జారీ చేశారు, ఈ సందర్భంగా కమిషన్ (Summer Vacation) కాలంలో కూడా ఛైర్మెన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి , కమిషన్ సభ్యులు (జుడిషియల్) దండే సుబ్రహ్మణ్యం, కమిషన్ సభ్యులు(నాన్ జ్యుడిషియల్) డాక్టర్ శ్రీనివాస రావు గోచిపాత లు కమిషన్ లోని ఫిర్యాదులు / కేసులు విచారణలు జరిపే తేదీల వివరాలు ప్రకటించారు. ఈ సమాచారాన్ని కమిషన్ విభాగాధికారి బొగ్గరం తారక నరసింహ కుమార్ తేలియచేశారు.
Prajavartha Online Telugu News