అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సినీ రంగ సమస్యలు, సినీ కార్మికుల ఆందోళన పై మంత్రి దుర్గేష్ కు వినతిపత్రం అందించనున్న నిర్మాతలు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి నిర్మాతలు వస్తామన్నారు.. రమ్మన్నాం.. ప్రత్యేక ఎజెండా ఏమీ లేదని తెలిపిన మంత్రి దుర్గేష్ ఆందోళన నేపథ్యంలో సినీ కార్మికులు, సినీ నిర్మాతలకు ఇరువురు చెప్పే విషయాలు వింటాం అని పేర్కొన్న మంత్రి దుర్గేష్ అనంతరం సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి సంబంధిత అంశాన్ని తీసుకెళ్లి చర్చిస్తామన్న మంత్రి దుర్గేష్
ప్రభుత్వ జోక్యం అవసరం అయితే సీఎం, డిప్యూటీ సీఎం ల స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు : మంత్రి దుర్గేష్
ఈ అంశంపై ఫెడరేషన్, ఛాంబర్ కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి:మంత్రి కందుల దుర్గేష్ ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము.. మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు కృషి చేస్తాం: మంత్రి దుర్గేష్ ఏపీలో ఎవరైనా స్టూడియోలు, రీ రికార్డింగ్ థియేటర్లు, డబ్బింగ్ థియేటర్ లు నిర్మించాలని ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తాం: మంత్రి కందుల దుర్గేష్
Prajavartha Online Telugu News