విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Oct 13-17, 2025 వరకు ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం లో జరిగిన ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో 35+ డబుల్స్ విభాగంలో విజయవాడ కార్పొరేషన్ ఎస్టేట్ సెక్షన్ లో పనిచేస్తున్న అడ్మిన్ సెక్రెటరీ రామకూరి రాంబాబు మహేష్ తో (విజయనగరం) జోడి కలిసి డబుల్స్ టైటిల్ ను గెలుచుకున్నారు. రాష్ట్రస్థాయిలో మరియు జాతీయస్థాయిలో పలు టోర్నమెంట్ లో పాల్గొని విజయం సాధిస్తున్న అడ్మిన్ సెక్రటరీ రామకూరి రాంబాబు ని విజయవాడ నగర మున్సిపల్ కమిషనర్ శ్రీ ధ్యాన్చంద్ర హెచ్.యమ్. ఐ.ఏ.ఎస్ అభినందించారు.
Prajavartha Online Telugu News