గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నక్యాంటీన్లలో ఆహార సరఫరా నిర్దేశిత సమయపాలన పాటించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అక్షయపాత్ర సిబ్బందిని ఆదేశించారు. గురువారం చుట్టగుంట సెంటర్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలోని అన్న క్యాంటీన్లలో ప్రతి రోజు వచ్చే ప్రజల సంఖ్యకు అనుగుణంగా ఇండెంట్ తెచ్చుకోవాలని, ఏ ఒక్కరికీ ఆహారం అందలేదనే ఫిర్యాదు రాకుడదన్నారు. క్యాంటీన్ లో ఏమైనా సమస్యలు ఉంటే తెలియచేయడానికి ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ని అందరికీ కనిపించేలా ఉంచాలన్నారు.
Prajavartha Online Telugu News