గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఫిబ్రవరి నెలకు సంబంధించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ సన్నద్ధత ఏర్పాట్ల పై శనివారం రాష్ట్ర సచివాలయం నుంచి రెవిన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయలక్ష్మి జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ ఫ్రెండ్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీకి నిర్దేశించిన షెడ్యూలు, రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన నూతన పాస్ పుస్తకాలు తదితర అంశాలపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయలక్ష్మి సమీక్షించి, సూచన అందించారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, ఆర్డీవో శ్రీనివాసులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News