Breaking News

శ్రీవారి లడ్డు కల్తీ తో హిందువులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు… : చలపతి రావు శృంగేరి పీఠం ఎస్టేట్ ఇంచార్జి శర్మ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మా తరతరాలుగా వెంకటేశ్వర స్వామి మా ఇలవేల్పు అని వెంకటేశ్వర స్వామి ఆలయంలో హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారు. చాలా దారుణం అని గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశంలో చలపతి రావు శృంగేరి పీఠం ఎస్టేట్ ఇంచార్జి శర్మ అన్నారు. జగన్ హిందూ ద్రోహి హిందువులు జగన్ కి ఓటు వేయలేదా అని ప్రశ్నించారు. వేంకటేశ్వరస్వామి కి ద్రోహం చేసినవారూ చరిత్రలో ఎవడు బాగుపడలేదు. శ్రీవారి లడ్డు కల్తీతో హిందువులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. శ్రీవారి ప్రసాదం అంటే హిందువులకు ఎంతో ప్రీతిపాత్రమైనది హిందువుల మనోభావాలతో చెలగాటం ఆడితే ఎవ్వరు బాగుపడరనీ గతంలో తాగేసిన ఖాళీ మద్యం బాటిల్స్ కొండపై పడవేయడం ఏంటనీ ప్రశ్నించారు. కలియుగ దైవం ఆయనతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు అని తెలిపారు. రాజకీయాలు చేయకుండా భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకు అందరూ పనిచేయాలని విశ్వనీయ సంస్థల ద్వారా భక్తులకు న్యాయమైన నాణ్యత గల లడ్డూలు అందించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *