Breaking News

సెప్టెంబర్ 19 , 20 తేదీల్లో ఛైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి పర్యటన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సెప్టెంబర్ 19 , 20 తేదీల్లో రెండు రోజులు పాటు రాజమహేంద్రవరం లో మహిళా కమిషన్ ఛైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి పర్యటిస్తున్నట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కె విజయ కుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్ సి డబ్ల్యూ ఆదేశానుసారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ పోషణ్ మా కార్యక్రమం 19.09.2024 మరియు 20.09.2024 తేదీ లలో రాజమహేంద్రవరం లో నిర్వహించనున్నట్లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి గజ్జల వెంకటలక్ష్మి హాజరవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. పర్యటన లో భాగంగా ప్రత్యేక మహిళా జైలును సందర్శించనున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా మహిళల నుంచి ఆర్ అండ్ బి అతిథి గృహంలో అర్జీలను స్వీకరించనున్నట్లు తెలిపారు.

రాజమహేంద్రవరం పట్టణానికి సంబంధించిన బాధిత మహిళల ఫిర్యాదులు స్వీకరించుటకు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు 19.09.2024 గురువారం మ. 03.00 -04.00 వరకు 20.09.2024 శుక్రవారం మ.02.00 – 03.00 వరకు మహిళా కమిషన్ ఛైర్పర్సన్ అందుబాటులో ఉంటారని, కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర 6మహిళా కమిషన్ కార్యాలయ వర్గాలు తెలియ పరచియున్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *