Breaking News

Tag Archives: rajamandri

నిడదవోలును ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్

-తిమ్మరాజుపాలెం కోటసత్తెమ్మ అమ్మవారు, నిడదవోలు పట్టణంలోని మదన గోపాలస్వామి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి దుర్గేష్ -సాంప్రదాయ పంచకట్టులో దర్శనమిచ్చిన మంత్రి దుర్గేష్.. శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న చిన్నారులతో ఉత్సాహంగా గడిపిన మంత్రి దుర్గేష్.. -రాష్ట్ర ప్రజలకు శ్రీకృష్ణజన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దుర్గేష్.. శ్రీకృష్ణభగవానుడు, అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని కాంక్షించిన మంత్రి దుర్గేష్ -నిడదవోలును నంబర్-1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని వెల్లడి నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలును ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, …

Read More »

తూర్పుగోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి గా ఎం.యు.వి. మనోహర్ బాధ్యతల స్వీకరణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి (D.P.T.O.)గా ఎం.యు.వి. మనోహర్ శుక్రవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని డి.పి.టి.ఓ. ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. మనోహర్‌కు ప్రజా రవాణా రంగంలో విస్తృతమైన అనుభవం ఉంది. గతంలో రాజమహేంద్రవరం అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ (కమర్షియల్)గా విధులు నిర్వహించారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు, అమలాపురం, కాకినాడ డిపోలలో డిపో మేనేజర్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం కాకినాడ డి.పి.టి.ఓ.గా విధులు నిర్వహిస్తూ, బదిలీపై తూర్పుగోదావరి జిల్లా డి.పి.టి.ఓ.గా నియమితులై బాధ్యతలు …

Read More »

గొల్లగుప్పలో వైద్య శిబిరం ఏర్పాటు ముమ్మరంగా వైద్య సేవలు

-బాధితులకు మెరుగైన వైద్యం.. ప్రత్యేక వైద్య బృందాలతో నిరంతర పర్యవేక్షణ -భయాందోళన చెందాల్సిన అవసరం లేదు -పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ భద్రాచలం, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో నిర్వహించిన ఫీవర్ సర్వేలెన్స్‌లో భాగంగా చేపట్టిన వైద్య శిబిరంలో క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేసిన అనంతరం అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. …

Read More »

తూర్పుగోదావరి జిల్లా డీపీఆర్వో పెద్దింటి రవికి ఘనంగా పదవీ విరమణ వీడ్కోలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా పౌర సంబంధాల అధికారి (డీపీఆర్వో)గా బాధ్యతలు నిర్వహిస్తూ ఆగస్టు 31న పదవీ విరమణ చేసిన పెద్దింటి రవికి పదవీ విరమణ వీడ్కోలు సభను సోమవారం రాజమహేంద్రవరం లోని వైటీసీ ప్రాంగణంలో ఉన్న డీఐపీఆర్వో కార్యాలయంలో ఆత్మీయుల మధ్య నిర్వహించారు. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె. లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాఖ అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని రవి సేవలను కొనియాడారు. నిబద్ధత, స్థితప్రజ్ఞతతో …

Read More »

మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం

-రూ.10 లక్షల PMEGP రుణంతో మగ్గం వర్క్ యూనిట్ నిర్వహణ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న రుణాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందడంతో పాటు, ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఎక్స్‌అఫీషియో సెక్రటరీ వాకాటి కరుణ సూచించారు. ఆమె మార్గదర్శకత్వంలో నిడదవోలు మండలం పురుషోత్తపల్లి గ్రామంలోని ఆదర్శ పందలపారు గ్రామ సంఘం పరిధిలోని శ్రీరామదుర్గ సంఘం సభ్యురాలు జల్లేపల్లి లక్ష్మీ నాగ నిర్వహిస్తున్న మగ్గం వర్క్ …

Read More »

మృత ఖైదీ వారసులు ఉంటే పరిహారం కోసం క్లెయిమ్ చేయాలి

– కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మృతి చెందిన ఖైదీ మసాడ శ్రీను రవి @ శ్రీను @ రవి, తండ్రి పైడినాయుడు సంబంధిత బంధువులు/చట్టబద్ధ వారసులకు చెల్లించేందుకు ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారాన్ని మంజూరు చేసినట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ కీర్తి చేకూరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మృత ఖైదీకి సంబంధించిన చట్టబద్ధ వారసులు లేదా సంబంధిత బంధువులు గుర్తించబడలేదని మురమండ, దుళ్ల గ్రామాల్లో కడియం తహసీల్దార్ నిర్వహించిన విచారణలో వెల్లడైనట్లు నివేదిక …

Read More »

నేడే (ఆగస్టు 25) రాజమహేంద్రవరానికి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరి మంగళవారం (25-08-2026) సాయంత్రం రాజమహేంద్రవరానికి చేరుకోనున్నారు. ఈ పర్యటన సందర్భంగా రాజమహేంద్రవరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు క్వారీ మార్కెట్ వద్ద ఉన్న తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించే బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 27వ తేదీ గురువారం ఉదయం 10.30 గంటలకు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించే DISHA సమావేశంలో ఎంపీ శ్రీమతి …

Read More »

వెబ్‌ల్యాండ్‌ భూ రికార్డుల్లో తప్పులను సరిచేయాలి

-96 మంది లబ్ధిదారుల రికార్డుల్లో భూమి స్వభావం సవరణ పత్రాలు అందచేత -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం. పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో భూ రికార్డు సరిచేసిన ధృవీకరణ పత్రాల పంపిణీ, స్వచ్ఛత కార్యక్రమాలపై దిశ నిర్దేశం చేయడం జరిగింది. భూ రికార్డుల్లో గతంలో నమోదైన తప్పులను నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హత ఉన్న కేసుల్లో సత్వరమే సవరణలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. కొవ్వూరు రెవెన్యూ డివిజన్‌ చాగల్లు …

Read More »

దేశంలో తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో .. రాష్ట్రంలో తొలిసారి పోలవరం జిల్లా లో RBSK 2.0 కు శ్రీకారం

-62.65 లక్షల మంది పిల్లలకు 38 రకాల ఉచిత ఆరోగ్య పరీక్షల నిర్వహణకు శ్రీకారం -రంపచోడవరం ముసురుమిల్లి పాఠశాలలో RBSK 2.0 రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన మంత్రి సత్య కుమార్ -తొలిసారిగా బీపీ, షుగర్, ఇతర పరీక్షలతో పాటు సెల్ ఫోన్ వినియోగo -వివరాల సేకరిస్తున్నామని మంత్రి సత్యకుమార్ వెల్లడి -పరీక్షల ద్వారా ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి చిన్నారులకు ఉచిత వైద్యం అందిస్తామని స్పష్టీకరణ -43.30 లక్షల మంది చిన్నారులకు కoటి పరీక్షలు కూడా జరుగుతున్నాయని చెప్పిన మంత్రి -2.50 …

Read More »

తాగునీటికి తొలి ప్రాధాన్యత… రైతులకు సాగునీటి కొరత రాకుండా అన్ని చర్యలు

-గోదావరి నీటి పరిస్థితిపై ఇరిగేషన్ ఇంజనీర్-ఇన్-చీఫ్ కంచరాన నరసింహమూర్తి వివరాలు వెల్లడి రాజమహేంద్రవరం (ధవళేశ్వరం), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో తక్కువ వర్షపాతం, గోదావరి నదిలో గణనీయంగా తగ్గిన ప్రవాహాల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యత ఇస్తూనే, రైతులకు సాగునీటి కొరత రాకుండా ప్రభుత్వం అన్ని ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని జలవనరుల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ENC) కె. నరసింహమూర్తి తెలిపారు. శనివారం ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయంలో గోదావరి నదీ ప్రవాహ పరిస్థితులు, సాగునీటి సరఫరా, తాగునీటి లభ్యతపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. …

Read More »