Breaking News

Tag Archives: rajamandri

భారత రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్.అంబేద్కర్ ఆశయ సాధనే మన లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్

-వేమగిరిలో ఘనంగా డా. బి. ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు.. పాల్గొని ఘన నివాళులర్పించిన మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం:భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి. ఆర్.అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఘన నివాళులర్పించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం వేమగిరి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా “జోహార్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్” అంటూ నినదించి, …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులుగా తమదైన ముద్ర వేయాలి

-నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్డీవోలు ఆర్. శివరాముడు, కాకర ఆనందరావుకు మంత్రి కందుల దుర్గేష్ సూచన -రాజమహేంద్రవరం లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్డీవోలు -ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పారదర్శక పాలన అందించాలని సూచించిన మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులుగా తమదైన ముద్ర వేయాలని ఇటీవల నూతనంగా నియమింపబడ్డ రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్డీవోలకు మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఇటీవల నూతనంగా రాజమహేంద్రవరం ఆర్డీవోగా …

Read More »

ఈ వి ఎమ్ గోదాముల భద్రతపై కలెక్టర్ కీర్తి చేకూరి తనిఖీలు – మరింత కట్టుదిట్టం చేయాలన్న సూచనలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ (EVM) గోదాములను జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. పరిశీలన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, EVMల భద్రత, నిల్వ విధానం, సీసీటీవీ పర్యవేక్షణ, భద్రతా సిబ్బంది ఏర్పాటు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించినట్లు వెల్లడించారు. గోదాముల వద్ద ప్రస్తుతం ఉన్న భద్రతా ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, …

Read More »

“వికాస” ఆధ్వర్యంలో మార్చ్ 28న జాబ్ మేళా

– కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : “వికాస” ఆధ్వర్యంలో మార్చి 28వ తేదీ శనివారం ఉదయం 9.30 గంటలకు రాజమహేంద్రవరం కలెక్టరేట్ పరిసరాల్లోని వికాస కార్యాలయం (బొమ్మూరు, హార్లిక్స్ ఫ్యాక్టరీ ఎదురుగా)లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ జాబ్ మేళాలో ఎస్‌ఎస్‌సి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంబిఏ ఉత్తీర్ణులైన 35 సంవత్సరాల లోపు అర్హులైన …

Read More »

డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో మానిటరింగ్ కమిటీ సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో గురువారం 9వ అదనపు జిల్లా జడ్జి ఎమ్. మాధురి , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శ్రీ లక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార ప్యానల్ న్యాయవాదులు, డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కేసులలో ఉచిత న్యాయ సహాయం అందించేందుకు నియమించబడిన న్యాయవాదులతో ఆయా కేసుల పురోగతిని సమీక్షించారు. కేసుల పరిష్కారాన్ని …

Read More »

కడియం నర్సరీలకు అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరణ అవసరం

-ఎగుమతుల దిశగా ముందడుగు వేయాలి: నర్సరీ రైతులకు కలెక్టర్ పిలుపు -కడియం నర్సరీలకు గ్లోబల్ బ్రాండ్‌గా ఎదగాలంటే అవగాహన కీలకం -కలెక్టర్ కీర్తి చేకూరి కడియం / రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అందమైన పూలు, అలంకరణ మొక్కలకు ప్రఖ్యాతి గడించిన కడియం నర్సరీ రైతులు అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. గురువారం కడియంలో నిర్వహించిన “కడియం నర్సరీ నుండి ఎగుమతికి గల అవకాశాలు మరియు వ్యూహాలపై వర్క్‌షాప్” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. …

Read More »

జర్నలిస్టులకు మెగా హెల్త్ క్యాంప్ – విశేష స్పందన

-మొత్తం 233 మందికి ఉచిత వైద్య పరీక్షలు -వైద్య ఆరోగ్య శాఖ, సమాచార శాఖ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు -వైద్య బృందానికి ప్రజా ప్రతినిధుల ప్రశంసలు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్‌కు విశేష స్పందన లభించిందనీ, మొత్తం 233 మంది పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యులు ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని పరీక్షలు చేయించుకున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియ చేశారు. ఈ వైద్య శిబిరం రాజమహేంద్రవరం స్థానిక ఆర్ట్స్ కళాశాల …

Read More »

గిరిజన సంక్షేమ కమిషన్ సభ్యులు మార్చి 28,29 తేదీల్లో జిల్లాలో పర్యటన

– జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె ఎన్ జ్యోతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన కమిషన్ సభ్యులు కె. మల్లేశ్వరరావు, కె. లక్ష్మి లు మార్చి 28, 29 తేదీలలో తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.ఎన్. జ్యోతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటన సందర్భంగా అవసరమైన ఏర్పాట్లు, మర్యాదలు కల్పించాలని గౌరవ చైర్మన్ ఆదేశించినట్లు ఆమె వెల్లడించారు. 28వ తేదీ ఉదయం 06.20 నుండి 09.30 గంటల …

Read More »

తూర్పు గోదావరిలో పైప్ గ్యాస్ కనెక్షన్ల విస్తరణకు చర్యలు వేగవంతం చేయాలి

-పైపు లైన్లు ఏర్పాటు చేసిన ఏరియాలోని గృహాలకు గ్యాస్ సరఫరా కు కార్యాచరణ సిద్ధం చేయాలి -జేసి వై మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో గృహాలు, వాణిజ్య సంస్థలు మరియు పారిశ్రామిక అవసరాలకు పైపుల ద్వారా సహజ వాయువు సరఫరాను విస్తరించేందుకు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో Godavari Gas Private …

Read More »

ఆంధ్రప్రదేశ్ పామ్ ఆయిల్ మిల్లుల ఆధునికీకరణకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలి

– ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి రాజమహేంద్రవరం / న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దగ్గుబాటి పురందేశ్వరి భారత పార్లమెంట్ లో Rule 377 కింద అత్యవసర ప్రజా ప్రాధాన్యత గల అంశంగా ఆంధ్రప్రదేశ్‌లో పామ్ ఆయిల్ ప్రాసెసింగ్ మిల్లుల ఆధునికీకరణ అవసరాన్ని మంగళవారం కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే అత్యధిక పామ్ ఆయిల్ సాగు విస్తీర్ణం కలిగిన రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.49 లక్షల హెక్టార్లలో పామ్ ఆయిల్ సాగు జరుగుతుండగా, ముఖ్యంగా తూర్పు మరియు …

Read More »